WestGodavari

News August 17, 2024

వట్లూరు ITIలో ఉచిత శిక్షణా తరగతులు

image

ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వ‌ట్లూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉపాధి శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గంటా సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాల కొరకు 89785 24022 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 16, 2024

భీమవరంలో రేపు ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్

image

పశ్చిమ బెంగాల్‌లోని RG Kar మెడికల్ కాలేజ్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా ఈనెల 17న ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు భీమవరంలో వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకరోజు పూర్తిగా వైద్య సేవలు, లేబరేటరీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నిలిపి వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.

News August 16, 2024

ప.గో.: పోలీస్ కో-ఆపరేటీవ్ సొసైటీ భవనం ప్రారంభం

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. రూ.28 లక్షల వ్యయంతో ఏలూరులో నిర్మించిన ఈ భవనాన్ని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సొసైటీలో సభ్యత్వం కలిగిన వారికి రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపారాణి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News August 16, 2024

ఏలూరు: భార్య మృతి.. మనస్తాపంతో భర్త సూసైడ్

image

తన భార్య మృతిని తట్టుకోలేని భర్త శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు నగరంలో చోటు చేసుకుంది. ఏలూరు చాణిక్యపురి కాలనీకు చెందిన దళాయి కృష్ణ (65) భార్య గతేడాది మే నెలలో మృతి చెందారు. అప్పటినుంచి తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ ఒంటరిగా ఉంటూ శుక్రవారం శ్రీనివాస థియేటర్ రైల్వేలో బ్రిడ్జిపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ఎస్సై సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 16, 2024

నరసాపురం: గవర్నర్ విందులో పారిశుద్ధ్య కార్మికుడు

image

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ రాజభవన్లో నిర్వహించే విందుకు గురువారం నరసాపురం పట్టణానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు స్వామి నాయుడు ఎంపికయ్యారు. ఈయన పట్టణంలో 12, 13వ వార్డుల్లో పారిశుధ్య కార్మికుడిగా సేవలు అందిస్తున్నారు. వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న పలు వర్గాలకు చెందిన వ్యక్తులకు గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవాన గవర్నర్ ఎట్ హెూమ్ కార్యక్రమంలో భాగంగా విందు ఇచ్చారు.

News August 16, 2024

జగన్‌ది నియంత పాలన.. అందుకే 11 సీట్లు: మంత్రి నిమ్మల

image

చరిత్రలో ముషారఫ్, హిట్లర్ వంటివారు కూడా చేయని నియంత పాలన జగన్ చేశారని అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాలకొల్లులో అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్లను జగన్ పాలనలో ధ్వంసం చేశారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని చెప్పారు.

News August 16, 2024

ఏలూరు: ముఖంపై అవాంఛిత రోమాలు.. యువతి సూసైడ్

image

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నూజివీడు పట్టణంలోని ఓ యువతి (18) ఇంటర్ పూర్తిచేసింది. ముఖంపై అవాంఛిత రోమాలు రావడంతో వాటిని బ్లేడుతో తీసివేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఎక్కువగా రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News August 16, 2024

ప.గో.: YSR ఉద్యానవర్సిటీ ఉపకులపతిగా గోపాల్

image

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్.కే.గోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా గోపాల్ పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విశ్వవిద్యాలయ అధ్యాపక సిబ్బంది స్వాగతం పలికారు.

News August 15, 2024

ప.గో.: రెండు గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదన 

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన బాలిక 14వ తేదీ (నిన్న) రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తండ్రి పాలకోడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రాత్రివేళ బొలెరో వాహనంలో వచ్చి తన కూతురుని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు రంగంలో దిగారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి పాలకోడేరుకు చెందిన హనుక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా SP సిబ్బందిని అభినందించారు.

News August 15, 2024

తణుకులో యథేచ్ఛగా చికెన్, మటన్ అమ్మకాలు

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జీవహింస చేయరాదని అందుకు మాంసాహారం అమ్మకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే కొందరు వ్యాపారులు ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ప్రధాన రోడ్డు అనుకొని పలు చికెన్, మటన్ దుకాణాల్లో గురువారం  విక్రయాలు సాగిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.