WestGodavari

News February 20, 2025

ఏలూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష

image

బాలిక గర్భణి కావడానికి కారణమైన వ్యక్తికి జైలుశిక్ష పడింది. గణపవరం మండలం పిప్పరకు చెందిన దొంగ చిన్నబ్రహ్మయ్య 2014లో పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను గర్భవతిని చేసి దుబాయ్ పారిపోయాడు. తర్వాత బాలికకు పుట్టిన బిడ్డ చనిపోయింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఏలూరు జిల్లా పోక్సో కోర్టు స్టేషన్ జడ్జి సునంద తీర్పు చెప్పారు.

News February 20, 2025

పాలకొల్లు: మహిళ కడుపులో 10కేజీల కణితి తొలగింపు

image

విజయవాడకు చెందిన 52 ఏళ్ళ మహిళ కొన్నేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. బంధువుల సలహా మేరకు పాలకొల్లు హాస్పిటల్ కు వెళ్ళింది. వైద్యులు పరీక్షలు చేసి ఆమె కడుపులో కణితి (కంతి) ఉందని డాక్టర్ నిర్దారించారు. బుధవారం సుమారు 2 గంటల పాటు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న 10 కేజీల కణితి ని తొలగించారు.

News February 20, 2025

భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ 

image

జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా, పకడ్బందీగా నిర్వహించి నివేధికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం విజయవాడ నుండి భూముల రీసర్వేపై సీసీఎల్ఏ జి జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో భూముల రీసర్వేపై ప్రత్యేక శ్రద్ధ వహించి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నివేదికలు పంపాలని, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. 

News February 19, 2025

27న ప.గో జిల్లాలో సెలవు

image

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.

News February 19, 2025

ఏలూరు: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్

image

నవ వధువు పారిపోయిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. ఏలూరు గజ్జలవారి చెరువుకు చెందిన శివనాగ సాయికృష్ణ, విశాఖ కంచరపాలేనికి చెందిన బోడేపు చంద్రహాసినితో జనవరి 31న పెళ్లి జరిగింది. వారం క్రితం బిట్టుబారు సమీపంలో కాపురం ప్రారంభించారు. ఈనెల 16న రాత్రి భర్త నిద్రపోయాక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 4 కాసుల గోల్డ్ చైన్, ఉంగరం, వెండి పట్టీలతో ఆమె పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News February 19, 2025

పైడిపర్రు : మహిళ మెడలోని మంగళసూత్రం అపహరణ

image

ఇంటి బయట వాకిలి శుభ్రం చేస్తున్న మహిళ మెడలోని మంగళసూత్రం గుర్తు తెలియని వ్యక్తి అపహరించకపోయిన ఘటన పైడిపర్రులో మంగళవారం చోటుచేసుకుంది. దేవలక్ష్మి నవదుర్గ కుటుంబ సమస్యల కారణంగా భర్త వీర వెంకటరాజుతో దూరంగా ఉంటుంది. సూర్యనగర్ లోని ఇంటి బయట మంగళవారం వాకిలి శుభ్రం చేస్తుండగా ఒక వ్యక్తి ఆమె మెడలోని మూడు కాసులు మంగళసూత్రంలో లాక్కొని పరారయ్యాడు. ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 19, 2025

నరసాపురం: వేధింపులు భరించలేక యువతి సూసైడ్

image

నరసాపురంలోని కొప్పర్రుకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఇన్‌ఛార్జ్ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. పోలీసుల కథనం.. ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న యువతిని అదే ప్రాంతానికి చెందిన యు. సాలోమోను ప్రేమపేరిట అసభ్యంగా ప్రవర్తించాడు. అతనితో పాటు అతని భార్య,చెల్లి వచ్చి దుర్భాషలాడడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఎస్సై తెలిపారు.

News February 19, 2025

ప.గో: మడ అడవులను పరిశీలించిన కలెక్టర్

image

నరసాపురం మండలం దర్భరేవు, రాజులలంక గ్రామాల్లో మంగళవారం మడ అడవులను కలెక్టర్ బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సముద్ర తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణగా నిలుస్తున్నాయన్నారు. స్థానిక రైతులతో తాబేళ్ల సంరక్షణ, మడ అడవులు పరిరక్షణపై జిల్లా కలెక్టర్ మాట్లాడి, తగు సూచనలు చేశారు.

News February 18, 2025

ఉంగుటూరు: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

image

ఉంగుటూరు(M) బావాయిపాలెంలో <<15486017>>ఏసురాజు హత్యకు <<>>వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తన భార్యతో చనువుగా ఉండొద్దని ఆమె భర్త చెప్పినా వినకపోవడం, మెసేజ్‌లు చేస్తున్నాడనే కోపంతో ఏసురాజుని బావాయిపాలెం తీసుకొచ్చి చేయి నరికేశారు. అనంతరం రక్తస్రావంతో ఏసు మృతి చెందాడు. కాగా మృతుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

News February 18, 2025

తాడేపల్లిగూడెం: 21 వేల కోళ్ల ఖననం

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తూ, అమ్మకాలపై ఆంక్షలు విధిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఓ ఫౌల్ట్రీలో అనుమానిత లక్షణాలు ఉన్న 21 వేల కోళ్లను అధికారులు ఖననం చేస్తున్నారు. పౌల్ట్రీ సమీపంలో గొయ్యి తవ్వించి వాటిని పాతిపెట్టారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించినట్లు కార్యదర్శి టి.రవిచంద్ తెలిపారు.