WestGodavari

News August 10, 2024

ప.గో: ఏపీ నిట్‌లో 480 సీట్లకు సర్టిఫికెట్ల పరిశీలన

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ విద్యా సంస్థలో సీట్ అలాట్మెంట్ జరిగిన 480 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం నిర్వహించారు. 2024- 25 విద్యా సంవత్సరానికి 50% రాష్ట్ర విద్యార్థులు, మిగిలిన 50% ఇతర రాష్ట్రాల విద్యార్థులతో జోసా, సీ-శాబ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. విద్యార్థుల రాకతో కళాశాల సందడిగా మారింది.

News August 10, 2024

పాలకొల్లులో ఆలయ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

image

పాలకొల్లు పట్టణంలోని శ్రీ గామాస్ వాసవి క్లబ్ కళ్యాణ మండప ఆవరణలో శనివారం జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ముందుగా అమ్మవారికి పూజ నిర్వహించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

News August 10, 2024

ఏలూరు: వైసీపీ కీలకనేత రాజీనామా.. ప్రభావం చూపేనా..?

image

ఏలూరు జిల్లా YCP కీలకనేత, మాజీ MLA ఆళ్ల నాని ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మాజీ CM జగన్‌కు ఈయన అత్యంత సన్నిహితుడు. YCP ఆవిర్భావం నుంచి నాని కీలకనేతగా ఉన్నారు. ఏలూరు అసెంబ్లీ నుంచి 3 సార్లు MLAగా గెలుపొందారు. 2014- 19 నడుమ MLCగా, ఉమ్మడి ప.గో. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. YCP ప్రభుత్వంలో మూడేళ్లు మంత్రిగానూ పనిచేశారు.
– ఆయన రాజీనామా ప.గో. జిల్లాలో పార్టీపై ప్రభావం చూపేనా..?

News August 10, 2024

ప.గో.: పేరెంట్స్ ప్రశ్నించినందుకు.. యువతి సూసైడ్

image

ఫోన్ మాట్లాడుతున్నావని పేరెంట్స్ ప్రశ్నించగా ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. నల్లజర్ల మండలం ఘంటావారిగూడేనికి చెందిన లక్ష్మి(18) ఓపెన్ ఇంటర్ చేస్తూ ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తోంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో కలతచెందిన ఆమె శుక్రవారం మధ్యాహ్నం అమ్మానాన్నకు ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉందని కట్ చేసింది. వారు వచ్చేసరికి ఉరేసుకొని చనిపోయింది. కేసు నమోదైంది.

News August 9, 2024

ఏలూరు: భార్యను హతమార్చిన భర్త అరెస్ట్

image

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో మహిళ హత్యకు సంబంధించి ఆమె భర్త సూర్యచంద్రంను అరెస్టు చేసినట్లు ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ శుక్రవారం తెలిపారు. ఈనెల 7న రామానుజపురంలో రాజనాల సాయిలక్ష్మిని ఆమె భర్త సూర్యచంద్రం హత్య చేశాడన్నారు. భార్య వేధింపులు, గొడవల వల్ల హత్య చేసినట్లు సూర్యచంద్రం ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు.

News August 9, 2024

‘సినిమా చెట్టు’కు ట్రీట్‌మెంట్.. 45 రోజుల్లో చిగుర్లు..!

image

కొవ్వూరు మండలం కుమారదేవంలోని ‘సినిమా చెట్టు’ పునరుజ్జీవ ప్రక్రియ చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో నిపుణులు కెమికల్ ట్రీట్‌మెంట్ చేశారు. 45 రోజుల తర్వాత చిగుర్లు వస్తాయని పేర్కొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇలా 10 చెట్లకుపైగా చిగురింపజేశామన్నారు. ఈ చెట్టు అంటే తనకు ప్రాణమని, దాన్ని బతికిస్తే ఎక్కువ నిడివితో మళ్లీ ఓ పెద్ద సినిమా తీస్తానని డైరెక్టర్ వంశీ తెలిపారు.

News August 9, 2024

ప.గో: ప్రోటోకాల్.. జెండా ఎగురవేసే మంత్రులు వీరే

image

రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వాతంత్ర్య వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రొటోకాల్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో పాల్గొనున్న మంత్రుల వివరాలు వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లాలో కొలుసు పార్థసారథి ముఖ్య అతిథులుగా జెండా ఎగురవేస్తారని పేర్కొంది.

News August 9, 2024

ప.గో.: ఎమ్మెల్యే RRR కేసులో బెయిల్‌కు నిరాకరణ

image

వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ ఉండి MLA రఘురామకృష్ణ మాజీ సీఎం జగన్ సహా.. సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్‌పై ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. కాగా గుంటూరు, నగరపాలెం పోలీసులు నమోదుచేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇప్పించాలని విజయ్ పాల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్ట్ నిరాకరించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

News August 9, 2024

ప.గో.: అత్యాచార ఘటనలో నిందితుడు అరెస్ట్

image

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాలు.. పాలకొల్లుకు చెందిన ఓ బాలిక(15)కు నరసాపురం పట్టణానికి సతీశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆమెను మూడుసార్లు నరసాపురంలోని లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుణ్ని అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదుచేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి తెలిపారు.

News August 8, 2024

ప.గో: రూ.2లకే బిర్యానీ.. ఎగబడిన జనం

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో గురువారం రూ.2లకే బిర్యానీ ఇవ్వడంతో జనాలు భారీగా తరలివచ్చారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఈ ఆఫర్ ప్రకటించారు. 2 రోజులుగా దీనిపై ప్రచారం చేయడంతో బిర్యానీ ప్రియులు ఎగబడ్డారు. 2000 మంది వస్తే 200 బిర్యానీ ప్యాకెట్స్ మాత్రం ఇచ్చారని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం అయ్యి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.