WestGodavari

News August 4, 2024

ఏలూరు: కానిస్టేబుల్‌పై కేసు నమోదు

image

కానిస్టేబుల్‌పై కేసు నమోదైన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల వివరాలు.. ఏలూరులోని వంగాయగూడేనికి చెందిన లింగేశ్వరరావు ఇస్త్రీ బండి నిర్వహిస్తున్నారు. అతనితో గ్రామీణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాస రెడ్డి పరిచయం పెంచుకున్నారు. లింగేశ్వరరావు కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలు దఫాల్లో రూ.7 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోగా బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News August 4, 2024

గుబ్బల మంగమ్మ భక్తులకు శుభవార్త

image

బుట్టాయిగూడెం మండలం కొరసావారిగూడెం అటవీ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లీ దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు ఉదయం 7 గంటల లోపు వచ్చి మొక్కులు చెల్లించుకోవచ్చని సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా వంట కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 3 గంటలలోపు తిరుగు ప్రయాణం కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని కోరారు.

News August 4, 2024

‘మేం గోదారోళ్లం.. స్నేహమంటే ప్రాణమిస్తాం’

image

ఉమ్మడి పశ్చిమ గోదారోళ్లు స్నేహమంటే ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విడదీయలేని బంధాలెన్నో. సంతోషంలోనే కాదు ఆపదలోనూ అండగా ఉండే మిత్రులెందరో. ఇక పాఠశాల స్థాయి నుంచి ఉన్న స్నేహాలైతే లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరుపెట్టిన మిత్రులెందరో కదా. అలాంటి వారి కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ ప్రాణ స్నేహితుడు ఎవరు..?
☞ Happy Friendship Day

News August 3, 2024

దెందులూరులో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

ఏలూరు జిల్లా దెందులూరు-అలుగులగూడెం మధ్య రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని 30 ఏళ్ల వయసు గల వ్యక్తిని ట్రైన్ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 3, 2024

ఏలూరు జిల్లాలో 36,480 ఇళ్లు పూర్తి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. పేదల గృహ నిర్మాణ పనులపై కలెక్టరేట్ నుంచి మండల స్థాయిలోని గృహ నిర్మాణ శాఖ సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. జిల్లాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకాల కింద 1,30,264 ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. వాటిలో 36,480 ఇళ్ల పనులు పూర్తి చేశామన్నారు.

News August 3, 2024

ప.గో: దారుణం.. చోరీకి వెళ్లి వృద్ధురాలిపై అత్యాచారం

image

వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేయాలని చూసిన ఇద్దరిని పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ప.గో SP ఆద్నాన్ నయీం అస్మీ వివరాల ప్రకారం.. గత నెల 29న పాలకొల్లులోని ఓ ఇంటిలో బొక్కా రాజు, మీసాల మావుల్లు చోరీకి వెళ్లారు. ఇంట్లో ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు లాక్కున్నారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు ఈరోజు నిందితులను అరెస్ట్ చేశారు.

News August 3, 2024

CM, డిప్యూటీ CMకు హరిరామ జోగయ్య లేఖ

image

రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య శనివారం ఓ లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర ప్రజానీకానికి ఎంతగానో దోహదపడతాయని లేఖలో పేర్కొన్నారు. అలాగే జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా తీసుకువచ్చిన నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల సబ్సిడీ రుణం ఇచ్చే సౌభాగ్య పథకాన్ని వెంటనే ప్రారంభించాలని అన్నారు.

News August 3, 2024

ఏలూరు: మామపై చర్యలు తీసుకోవాలని అల్లుళ్ల దీక్ష (VIDEO)

image

తమ భార్యలను కాపురానికి పంపించాలని ఇద్దరు అళ్లుల్లు ఏలూరు కలెక్టరేట్ ఎదుట రెండు రోజుల క్రితం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాగా శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి తమపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న మామ బీకే.శ్రీనివాస రామానుజ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము మోసపోయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

News August 3, 2024

గోదావరిలో తగ్గుముఖం పట్టిన వరద

image

గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే వద్ద ఉదయం 32.33 మీటర్లుగా ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 31.750కు తగ్గిందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. 48 గేట్ల నుంచి 8.06 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోందన్నారు.

News August 3, 2024

ప.గో.: 7 నెలల్లో 138 మంది మృత్యువాత

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో గడిచిన 7 నెలల్లో 162 రోడ్డుప్రమాదాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1426 మంది క్షతగాత్రులవగా, 138 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఉమ్మడి జిల్లా వ్యా్ప్తంగా మొత్తం 280 బాక్ల్ స్పాట్లను గుర్తించారు. అయితే చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.