India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

నరసాపురం మండలం సీతారామపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణ కోల్పోయారు. శేరేపాలెం గ్రామానికి చెందిన చిలకపాటి జేమ్స్ (32) హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాళీపట్నంకు చెందిన సంజీవరావు తన బైక్తో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జేమ్స్ నరసాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

పదో తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప.గో DEO నారాయణ గురువారం తెలిపారు. bse.ap.gov.in వెబ్సైట్, 9552300009 వాట్సప్ నంబర్, మనమిత్ర లేదా లీప్ యాప్ నుంచి వీటిని పొందవచ్చన్నారు. సందేహాలుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని ఆయన సూచించారు. విద్యార్థులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాలు, ప్రణాళిక, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలిసి వివిధ మండలాల్లో వంటనూనెలు, కందిపప్పు, ఎండుమిర్చి హోల్సేల్, రిటైల్ ధరల వ్యత్యాసాన్ని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాలు, ప్రణాళిక, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలిసి వివిధ మండలాల్లో వంటనూనెలు, కందిపప్పు, ఎండుమిర్చి హోల్సేల్, రిటైల్ ధరల వ్యత్యాసాన్ని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాలు, ప్రణాళిక, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలిసి వివిధ మండలాల్లో వంటనూనెలు, కందిపప్పు, ఎండుమిర్చి హోల్సేల్, రిటైల్ ధరల వ్యత్యాసాన్ని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

ఏపీ జేఏసీ పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. చలం ఎన్నికయ్యారు. భీమవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చలం మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.