India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఓ యువతి కత్తితో దాడి చేసింది. సదరు యువతి కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా ద్వారకాతిరుమలలో తిరుగోతుంది. అదే గ్రామానికి చెందిన తిరునగరి రమేశ్ మద్యం మత్తులో కొద్దిరోజులుగా ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి శ్రీవారి పాదుకా మండపంలో నిద్రిస్తున్న రమేశ్ చేతిపై, ముఖంపై చాకుతో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించారు.
ప.గో జిల్లా స్కూల్స్-గేమ్స్ అండర్ 14, 17 విభాగాల జిల్లా కార్యదర్శిగా స్వచ్ఛందంగా పని చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈవో నాగమణి శనివారం తెలిపారు. ఆసక్తి గల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, ఎస్ఏ, (పీఈ) పీఈటీలు జులై 29న సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. కేటాయించిన సమయం లోపు మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయని స్పష్టం చేశారు.
ప.గో జిల్లాలో ఆదివారం నుంచి జరిగే ఏపీపీఎస్సీ పరీక్షలకు భీమవరంలోని డీఎన్ఆర్ ఇంజినీరింగ్ & టెక్ అటానమస్ క్యాంపస్, తాడేపల్లిగూడెంలోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలను సెంటర్స్గా నిర్ణయించినట్లు డీఆవో ఉదయ భాస్కర్ తెలిపారు. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు ఉదయం 10- మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం 3- 5 వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పరీక్షా సమయం కంటే గంట ముందు వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
తణుకు మండలం దువ్వ గ్రామంలో ముంపు నిర్వాసితులకు నగదుతో పాటు నిత్యావసర వస్తువులను శనివారం అందజేశారు. రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కలెక్టర్ నాగరాణి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేతులమీదుగా ఒక్కొక్కరికి రూ.3 వేలు నగదు, 25 కిలోల బియ్యం, వస్తువులను పంపిణీ చేశారు.
భద్రాచలం వద్ద శనివారం 4PMకు నీటిమట్టం 53 అడుగులు ఉండగా అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టర్ నాగరాణి వరద ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. లంక గ్రామాల ప్రజలకు భోజనం, వసతి, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. మూగజీవాలకు నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇబ్బందులున్న చోట వరద బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు.
ప.గో జిల్లా వీరవాసరం మండలం నందమూరి గరువు ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై శనివారం యాక్సిడెంట్ జరిగింది. ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామానికి చెందిన వి.శ్రీరామమూర్తి(75)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరామమూర్తి ఆటోలో వెళ్తుండగా.. ఆ ఆటోను పాల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI రమేశ్ తెలిపారు.
ఏలూరు ప్రజలకు SP ప్రతాప్ శివకిశోర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SBI- Yono Rewards, Union Bank KYC Update, Electricity Bills, Government Schemes Eligibility పేరుతో సైబర్ నేరగాళ్లు APK ఫైల్స్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. వాటిని ఎవరూ షేర్ చేయొద్దన్నారు. ఎవరైతే ఆ APK ఫైల్స్పై క్లిక్ చేస్తారో వారి ఫోన్ హ్యాక్ అయ్యి అకౌంట్లోని నగదు ఖాళీ అవుతుందన్నారు.
కుక్కునూరు మండలం దాచారం R&R కాలనీ ముంపు ప్రాంతాల్లో మంత్రుల బృందం శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. నిర్వాసితులకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, వరదలు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కాలనీల్లో ఉండొచ్చన్నారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని, వెళ్ళేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.3 వేల ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు.
కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ సందర్భంగా జోగయ్య స్వగృహం వద్ద మీడియాతో మాట్లాడారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈడబ్ల్యూఎస్లో 10శాతం కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్ టీడీపీ కల్పించిందన్నారు.
కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య పాలకొల్లులో శనివారం ఒక లేఖ రాశారు. గత టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అటకెక్కిందని, రిజర్వేషన్లపై పునరాలోచించాలని కోరారు. కూటమి ప్రభుత్వాన్ని కాపులు 99 శాతం ఓట్లు వేసి గెలిపించారని, పవన్ వల్ల కాపులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.