India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✷ తణుకులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా అఘోరి ✷ నన్నయ యూనివర్సిటీ అధ్యాపకురాలికి అరుదైన గౌరవం ✷ భీమవరం: ఇయర్ ఫోన్స్ వాడకం తగ్గించాలి ✷ గోదావరి పుష్కరా పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ✷ అత్తిలిలో సాగునీరు అందించాలని ఆందోళన ✷మహిళా దినోత్సవం రోజున భారీ ర్యాలీ
రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం మండలం చినమిరం గ్రామంలో 62 నెంబరు రేషను షాపును జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టరును, కార్డుదారులకు పంపిణీ చేసే రికార్డులను పరిశీలించారు. ఎండీయూ వాహనంపై సరుకుల వివరాలు రేట్లు పట్టికను పరిశీలించారు.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 గా సమాచారం.
మరి కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వాటిని తెరిచే ప్రసక్తే లేదని ఎన్నికల అధికారి, కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టి, అల్లర్లకు కారకులైతే కఠిన చర్యలు తప్పవన్నారు.
గత నెల 27వ తేదీన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం సోమవారం సాయంత్రం 6 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను ఆదివారం పాలకొల్లులో జనసేన నేత బన్నీ వాసు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. పలు రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోనం చినబాబు, శిడగం సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
✷ ప.గో జిల్లాలో ఊపందుకున్న చికెన్ అమ్మకాలు ✷ మావుళ్ళమ్మ అమ్మవారి సేవలో యాంకర్ ఓంకార్ ✷ వేల్పూర్లో చికెన్ మేళా ✷ మత్స్యకారుల అభివృద్ధికి కృషి : కేంద్ర సహాయ మంత్రి ✷ ఉండిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి✷ పేరుపాలెం బీచ్లో పర్యాటకుల సందడి ✷ పాలకొల్లును కమ్మేసిన పొగ మంచు✷కాలువలోకి దూసుకెళ్లిన రొయ్యల లారీ.
భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని ప్రముఖ యాంకర్ ఓంకార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. ఓంకార్తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.
‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశించారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో మత్స్య శాఖ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను విన్నారు, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
7వ జాతీయ స్థాయి బధిర టీ20 క్రికెట్ పోటీలకు 16 మంది ఎంపికయ్యారని జిల్లా బధిర క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రంగసాయి తెలిపారు. వీరు ఏప్రిల్ 19 నుంచి 25 వరకు హర్యానా కాచపూర్ గురుగామ్లో జరిగే బధిర క్రికెట్ టీ20 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆదివారం భీమవరం లో ఆయన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.