WestGodavari

News February 22, 2026

ప.గో: EX MLA పేరుతో INSTA అకౌంట్.. నమ్మితే అంతే..!

image

నరసాపురం మాజీ MLA కొత్తపల్లి జానకీ రామ్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఖాతాల ద్వారా అభిమానులకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, అనుచరులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ డబ్బులు పంపి మోసపోవద్దని జానకీ రామ్ కోరారు.

News February 22, 2026

భీమవరం: అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

image

కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీగా ఉండి, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలపై ప్రస్తుతం ప.గో.జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

News February 22, 2026

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

image

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News February 22, 2026

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

image

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News February 22, 2026

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

image

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News February 22, 2026

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

image

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News February 22, 2026

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

image

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News February 21, 2026

టెన్త్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: DEO

image

పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ పిలుపునిచ్చారు. శనివారం పోడూరులోని క్లస్టర్ కాంప్లెక్స్‌లను ఆయన ఆకస్మికంగా సందర్శించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక స్థాయిలో అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సూర్యనారాయణ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News February 21, 2026

కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా పారదర్శకతతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

News February 21, 2026

నరసాపురం: గాల్లో ఎగురుతూ కరెంటు పనులు!

image

నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.