WestGodavari

News February 21, 2026

భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

image

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.

News February 21, 2026

ప.గో: శ్రీవారి ఫొటోలతో ప్లకార్డులు.. MLA నాయకర్ ఫైర్

image

శాసన మండలిలో YCP ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన YCPకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానిస్తూ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.

News February 21, 2026

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో ప్రభాకరరావు

image

ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ విద్యా అధికారి (ఆర్‌ఎస్‌ఐవో) జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల నుంచి ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 17,225, ద్వితీయ సంవత్సరం 16,925, ఒకేషనల్‌ విభాగంలో 1,919, 1772 మంది చొప్పున మొత్తం 37,841 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News February 21, 2026

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో ప్రభాకరరావు

image

ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ విద్యా అధికారి (ఆర్‌ఎస్‌ఐవో) జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల నుంచి ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 17,225, ద్వితీయ సంవత్సరం 16,925, ఒకేషనల్‌ విభాగంలో 1,919, 1772 మంది చొప్పున మొత్తం 37,841 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News February 21, 2026

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో ప్రభాకరరావు

image

ఈనెల 23 నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్భందీగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ విద్యా అధికారి (ఆర్‌ఎస్‌ఐవో) జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళా శాలల నుంచి ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 17,225, ద్వితీయ సంవత్సరం 16,925, ఒకేషనల్‌ విభాగంలో 1,919, 1772 మంది చొప్పున మొత్తం 37,841 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News February 20, 2026

కాళ్ల: కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా కాశీ

image

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సుంకర కాశీవిశ్వేశ్వరరావు నియామకమయ్యారు. శుక్రవారం ఆయనకు నియామకపత్రంను జిల్లా నాయకులు అందించారు. బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలను గౌరవిస్తూ తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడు వెంకట సూర్యనారాయణ రాజు నియామక పత్రాన్ని అందజేశారని కాశీ తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐ. శ్రీదేవి, ఉపాధ్యక్షుడు కోరా రామ్మూర్తి, తదితరులు అభినందించారు.

News February 20, 2026

కాళ్ల: పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీ

image

పదో తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ నారాయణ అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు, జువ్వలపాలెం హైస్కూల్ లను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గత ఏడాది ఈరెండు పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణశాతం 36 సాదించారని, రాబోయే మార్చి 16 నుంచి జరుగనున్న పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు

News February 20, 2026

తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారులు

image

తిరుమలలో అపహరణకు గురైన ఇద్దరు చిన్నారులను పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు తణుకునకు చెందిన లక్ష్మీ,రాంబాబు దంపతులు తమ కుమార్తెలు నవదుర్గ, అశ్వినీలతో ఈ నెల 16న తిరుమల వచ్చారు. బాలికలు ఆడుకుంటూ ఉండగా అన్నమయ్య జిల్లాకు చెందిన గుండ్లూరు శివమ్మ వారిని అపహరించి తన వెంట తీసుకుపోయింది. తిరుమల పోలీసులు సిసి ఫుటేజీలను పరిశీలించి 17న కొవ్వూరు రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకుని చిన్నారులను అప్పగించారు.

News February 19, 2026

నరసాపురం: బలవన్మరణానికి పాల్పడిన బాలిక

image

నరసాపురం పట్టణంలో బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ బాలిక ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం కుటుంబీకులు ఆసుపత్రికి తరలించినా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి చెప్పారు. దీనిపై టౌన్ ఎస్ఐ జయలక్ష్మి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2026

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం భీమవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల నమోదు, మార్పుల క్లైమ్ల పరిష్కారంపై సమీక్షించారు. ముఖ్యంగా యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.