WestGodavari

News January 17, 2025

ఏలూరు: అధికారులను మెచ్చుకున్న మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు బేష్ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం జిల్లా అధికారులను అభినందించారు. రూ.734 కోట్ల విలువైన 3.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని అన్నారు. 96% రైతులకు 24 గంటల్లోనే సొమ్ము చెల్లించినట్లు వివరించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో మొదటిగా ఏలూరులోనే ప్రారంభమైందన్నారు. ధాన్యం సేకరణపై అధికారుల చొరవ ప్రశంసనీయమన్నారు. 

News January 16, 2025

భీమవరంలో కిడ్నాప్ కలకలం

image

భీమవరం పట్టణంలోని మెంటేవారి తోటకి చెందిన విశ్వనాథుని వెంకట సత్యనారాయణ గురువారం కిడ్నాప్ అయ్యారు. సత్యనారాయణ తమ బంధువులను టౌన్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించడానికి వచ్చి బయటికు వచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను వారి కారులో ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కి ఆర్థిక లావాదేవీలే కారణం అని పలువురు అంటున్నారు. ఘటనపై భీమవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 16, 2025

ప.గో జిల్లాను పచ్చగా నిర్మించుకుందాం: కలెక్టర్ నాగరాణి

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి దశలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, టీ గ్లాసులను నిషేధిస్తున్నామన్నారు. కలెక్టరేట్ నుంచే ఈ కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. జిల్లాను పచ్చగా నిర్మించుకుందామని, అందరూ సహకరించాలని, ఆంక్షలు మీరితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 16, 2025

తాడేపల్లిగూడెం: అసలు ఎవరీ రత్తయ్య..?

image

సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.

News January 16, 2025

ప.గో: పందెంలో మీకు ఏం వచ్చింది?

image

గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కొందరు లాభ పడగా.. మరికొందరు ఎంతో నష్టపోయారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కార్లను సైతం కుదవ పెట్టేశారట. కొందరు నెల జీతం మొత్తాన్ని క్షణాల్లో పోగొట్టేసుకున్నారు. మరికొందరు స్థలాలను సైతం తాకట్టు పెట్టేశారు. మీ పరిధిలో ఎవరైనా ఇలా నష్టపోయారా? లాభపడ్డారా? తెలిస్తే కామెంట్ చేయండి.

News January 16, 2025

మొగల్తూరులో కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు

image

మొగల్తూరులో బుధవారం సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియ, గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్‌లకు గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు.  వైష్ణవ్‌కు 200 రకాల పిండివంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.

News January 16, 2025

ప.గో: మూడు రోజులు…రూ.1000 కోట్లు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందాలు కూడా ముగిశాయి. ఈసారి కోడిపందాలు భారీ స్థాయిలో జరిగాయి. మొత్తం 3 రోజులుగా కోడిపందాలు, గుండాట, పేకాట మొత్తం కలిపి సుమారు రూ.1000 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.

News January 15, 2025

ప.గో : పందేలలో పచ్చకాకిదే హవా

image

ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం కుక్కుట శాస్త్రం ఉందని పందెం రాయుళ్లు చెబుతున్నారు. మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీంతో కుక్కుట శాస్త్రంలో అవగాహన ఉన్నవాళ్లు మంగళవారం అంతా పచ్చకాకి కోడి పుంజుల హవానే కొనసాగిందని అంటున్నారు.

News January 14, 2025

కొయ్యలగూడెం: మేక మాంసానికి కేజీ కోడి మాంసం ఫ్రీ

image

కొయ్యలగూడెం పట్టణంలోని టీపీ గూడెం రోడ్డులోని ఓ మాంస కొట్టు వ్యాపారి భారీ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా కిలో మేక మాంసం రూ.800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు.

News January 14, 2025

ప.గో జిల్లాలో కోసా రూ. 3 వేలు

image

రసవత్తర పోరులో ఓడి ప్రాణాలు కోల్పోయిన పందెం కోళ్లకు ఉభయగోదావరి జిల్లాల్లో భలే గిరాకీ ధర పలుకుతోంది. అయితే ఇక్కడ పందేనికి సిద్ధం చేసే కోళ్లకు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ ఉంటుంది. దీంతో అవి మరణించాక రుచిగా ఉంటాయని మాంసం ప్రియులు చెబుతూ ఉంటారు. దీంతో పందెంలోని ఒక కోసా రూ. 2వేలు నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోందని పలువురు అంటున్నారు.