WestGodavari

News July 26, 2024

ప్రేమ పేరిట నయవంచన.. పదేళ్ల జైలు శిక్ష

image

యువతిని గర్భవతిని చేసి, మోసం చేసిన నిందితుడికి ఏలూరు మహిళా కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల ఫైన్ విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామాంజనేయులు తెలిపారు. నరసాపురంలోని రుస్తుంబాద్‌‌కు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన అశోక్ ప్రేమ పేరిట వాడుకొని మోసం చేశాడని 2021 Febలో పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రాజేశ్వరి అశోక్‌కు శుక్రవారం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

News July 26, 2024

నరసాపురం- మచిలీపట్నం కొత్త రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్

image

సముద్ర తీరం వెంట కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బ్రిటీష్ హయాం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన నరసాపురం- మచిలీపట్నం మధ్య లైన్‌కు సర్వే చేయాలని నిర్ణయించింది. తాజా కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే నరసాపురం పెద్ద జంక్షన్‌గా మారనుందని తీరప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 26, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాధ్యక్షుడిగా తాడేపల్లిగూడెం వాసి

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా DCCB రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏఎస్. సాయిబాబా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ మూర్తి, కార్యదర్శిగా రామారావు, కోశాధికారిగా సూర్యచంద్ర రావు, ఈసీ మెంబర్‌గా రాంబాబు, ఇతర డైరెక్టర్లను ఎన్నుకొన్నట్లు వివరించారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

News July 26, 2024

నరసాపురం- గుంటూరు రైలు రద్దు

image

రైలు పట్టాల పునరుద్ధరణ, నిర్వహణ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 1వ తేదీ వరకు మచిలీపట్నం- విజయవాడ, నరసాపురం- విజయవాడ, విజయవాడ- భీమవరం రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నరసాపురం- గుంటూరు రైలును ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

News July 26, 2024

28న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు ఎంపిక

image

ఏలూరు కోటదిబ్బ కస్తూర్బా నగర బాలికోన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 28న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 1- 1- 2011 తర్వాత జన్మించి ఉండాలన్నారు. తమ వెంట జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తెచ్చుకోవాలన్నారు.

News July 26, 2024

నరసాపురం- కోటిపల్లి లైన్‌కు మహర్దశ

image

నరసాపురం రైల్వేలైన్‌కు మహర్దశ పట్టనుంది. తీర ప్రాంతంలో నరసాపురం- కోటిపల్లి రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం- మచిలీపట్నం మధ్య రైల్వే లైను ఏర్పాటుచేయాలని.. దీనిపై సర్వే చేసేందుకు నిధులు కేటాయించారు.

News July 26, 2024

ఏలూరు: బాలికపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు ఫైల్

image

బాలిక(16)పై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు SI ప్రియ కుమార్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలానికి చెందిన ఓ బాలిక ఈ నెల 23న అర్ధరాత్రి దాటిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో రవి అనే యువకుడు ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.

News July 26, 2024

27న ఉమ్మడి ప.గో జిల్లా బీచ్ కబడ్డీ జట్టు ఎంపిక

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పురుషులు, స్త్రీల బీచ్ కబడ్డీ జట్ల ఎంపికలు ఈనెల 27 వీరవాసరంలోని మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హై స్కూల్‌లో జరగనున్నాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సహాయక కార్యదర్శి పి.మల్లేశ్వరరావు తెలిపారు. ఈ ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు పురుషులు 85 కేజీల లోపు, స్త్రీలు 75 కేజీల లోపు ఉండాలని సూచించారు. ఒరిజినల్ ఆధార్ కార్డును వెంట తీసుకొని రావాలన్నారు.

News July 26, 2024

పట్టిసీమ నుంచి 2,832 క్యూసెక్యుల నీరు విడుదల

image

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,832 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈఈ పెద్దిరాజు గురువారం తెలిపారు. పట్టిసీమలో నీటిమట్టం 22.987 మీటర్లు నమోదు కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్లతో నీటిని వదిలినట్టు వివరించారు. కృష్ణా డెల్టా, ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల నేపథ్యంలో నీరు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

News July 26, 2024

వసతి గృహాల మరమ్మతులకు ప్రతిపాదనలు: కలెక్టర్

image

ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సంక్షేమ వసతి గృహాల అత్యవసర మరమ్మతులపై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 46 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా.. వాటిలో 35 వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరమ్మతులు చేపట్టుటకు సుమారు రూ.2.65 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.