WestGodavari

News January 5, 2025

భీమవరం: ‘మంత్రి నారా లోకేశ్ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలి’

image

జనవరి 6న ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటింనున్నారు. లోకేశ్ పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ రోజున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అధికారులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

News January 4, 2025

బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలి: జేసీ 

image

బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని 14 గిడ్డంగులు యజమానులతో సమావేశమై సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ.. రైస్ మిల్లులో మర ఆడిన బియ్యాన్ని త్వరితగతిన దిగుమతి అయ్యేలా తగిన హామాలీలను సమకూర్చుకుని బియ్యం దిగుమతికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.

News January 4, 2025

జగన్ మోసం చేశారు: నిమ్మల

image

పోలవరం నిర్వాసితులకు 2017లోనే చంద్రబాబు రూ.800 కోట్లు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు పరిధిలోని 6 గ్రామాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారు. తాజాగా మేము ఒకేరోజు నిర్వాసితులకు రూ.815 కోట్లు చెల్లించాం’ అని నిమ్మల అన్నారు.

News January 4, 2025

కాకి, నెమలి, డేగ.. ఇంకేమున్నాయి..?

image

సంక్రాంతి సందడంతా ప.గో జిల్లాలోనే ఉంటోంది. కోడిపందేలు, కొత్త అల్లుళ్లకు మర్యాదలు చాలానే ఉంటాయి. ప్రత్యేకించి కోడిపందేల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భీమవరానికి వస్తుంటారు. రూ.కోట్లలో పందేలు కాస్తారు. కాకి, డేగ, తీతువ, కాకిడేగ, రసంగి, అబ్రాస్, కెక్కిరాయి, కోడికాకి, కోడి పింగళ, నెమలి అంటూ ఏ రోజు ఏది గెలుస్తోందో కొందరు ముందే జోస్యం చెప్పేస్తుంటారు. మీకు తెలిసిన కోళ్ల పేర్లు కామెంట్ చేయండి.

News January 4, 2025

1,123 ఎకరాల్లో తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్..!

image

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలో ఓ ఎయిర్‌పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప.గో జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. దాదాపు 1,123 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

News January 4, 2025

ప.గో: మంత్రి నాదెండ్లను కలిసిన దుర్గేశ్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు శాఖా పరమైన అంశాలు చర్చించినట్లు తెలిపారు.

News January 3, 2025

ప.గో: ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై గ్రామసభలు

image

ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

News January 3, 2025

ఏలూరు: రేపటి నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు

image

శనివారం నుంచి ఏలూరు జిల్లాలో భోజన పథకం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం’ అనే పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రారంభం కాబోతున్నది. దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థులు భోజనం చేయడానికి గిన్నెలు, గ్లాసులు, వంట పదార్థాలు సిద్ధం చేశామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ప్రభాకరరావు చెప్పారు. నారాయణపురం కాలేజీలో ఏర్పాట్లను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు.

News January 3, 2025

ప.గో: ‘గేమ్ ఛేంజర్’ పాసుల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు

image

రాజమండ్రిలో జరగబోయే గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు ప.గో జిల్లా మెగా ఫ్యాన్ రెడీ అవుతున్నారు. ఈవెంట్ పాసులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లోకల్ లీడర్ల చుట్టూ మెగాభిమానులు, జనసైనికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అందరికీ పాస్‌లు అందించలేక నాయకులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

News January 3, 2025

దేవరపల్లి: డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి 

image

దేవరపల్లి మండలం జాతీయ రహదారిపై బంధపురం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు బంధపురం వద్ద డివైడర్ ఢీకొట్టారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!