India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ క్షేత్రం ద్వారకాతిరుమలలో సినీ నటుడు షఫీ నిమ్మకాయలు అమ్మి సందడి చేశారు. నిన్న ఆయన మరో నటుడు మాణిక్ రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో లింగయ్య చెరువు వద్ద నిమ్మకాయలు అమ్మే మహిళా వ్యాపారులు ఆయన కారును ఆపి, వాటిని కొనాలని కోరారు. వెంటనే కారు దిగిన షఫీ తాను నిమ్మకాయలు అమ్ముతాను అంటూ, వారితో కలిసి సందడి చేశారు.
ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన సమయానికి 65.43 శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అని తెలిపారు.
ముసునూరు మండలం బలివేలో మహాశివరాత్రి ఉత్సవాల్లో మరణ మృదంగం మోగుతోంది. 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లింగపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం మృతిచెందగా..మరుసటిరోజునే అక్కిరెడ్డిగూడేనికి చెందిన H. రాంబాబును గురువారం బలివే తమ్మిలేరు బలితీసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జల్లుల స్నానం చేయాలని సూచించారు.
భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం అన్నదాన సత్రం పిలీగ్రీం సెంటరుకు రూ. కోటి మంజూరైంది. ఈ ప్రత్యేక గ్రాంటును దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి ఆర్డర్ కాపీని తీసుకొచ్చి భీమవరం MLA,PAC ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులుకి శ్రీవేద విజ్ఞాన పరిషత్ ఛైర్మన్ DV బాలసుబ్రహ్మణ్యం గురువారం అందజేశారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ CH రంగసాయి పాల్గొన్నారు.
✷ ప.గో జిల్లాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు✷ జిల్లాలో 65 శాతం పోలింగ్ ✷ శోభాయ మానంగా సోమేశ్వరుని రథోత్సవం.✷ సోమేశ్వర స్వామి రథోత్సవంలో అపశృతి ✷ భీమవరంలో యువకుడి మృతి ✷ తణుకులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్✷ దేవాలో గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి ✷ రేలంగులో అడుగడుగున వ్యర్ధాలు ✷తణుకులో ప్రభుత్వ హామీలు అమలు చేయాలి.
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సమయానికి 27.28% శాతంగా నమోదైందన్నారు. పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శివరాత్రి పలుకుటుంబాలకు తీరని విషాదం మిగిల్చింది. ఏలూరులో బలివే క్షేత్రానికి వెళ్లొచ్చి చెరువులో స్నానానికి దిగి వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం గల్లంతయ్యారు. ఆచూకీ తెలియలేదు. లింగపాలేనికి చెందిన అన్నదమ్ములు మణికుమార్, మునియ్య తమ్మిలేరులో మునిగి చనిపోయారు. పట్టిసీమలో నాగవీరభద్ర రావు, బలివే క్షేత్రానికి వచ్చిన అన్నవరం గుండెపోటుతో మృతి చెందారు.
అనధికారిక ఘాట్లలో స్నానం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, భక్తులకు ప.గో.జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. ఈసందర్భంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన ఈ క్రింది ఘాట్లలో ప్రజల భద్రత నిమితం రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నరసాపురం టౌన్, కోడేరు, కరుగోరుమిల్లి, పెదమల్లం, సిధాంతం, దొడ్డిపట్ల ఘాట్లలో స్నానం ఆచరించాలన్నారు.
✷ ప.గో జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
✷ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం కలెక్టర్ నాగరాణి
✷ నర్సాపురంలో భారీగా మద్యం సీసాలు లభ్యం
✷ ఆచంటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో దాసిరాజు
✷ నర్సాపురం మహిళ కడుపులో ఏడు కేజీల కణితి
✷ పాలకొల్లులో బెల్ట్ షాప్ నిర్వాహకుడు అరెస్టు
✷ నాగాలాండ్లో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ
Sorry, no posts matched your criteria.