India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం భోగి రోజు కోడిపందాలు జోరుగా సాగాయి. పక్క రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు పాల్గొని పెద్ద ఎత్తున పందాలు కాశారు. పందాల పేరిట కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి. మొదటిరోజు కోడిపందాలు, గుండాట, పేకాటల ద్వారా సుమారు రూ.100 కోట్ల రూపాయలు పైనే చేతులు మారినట్లుగా అంచనా.
పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం నుండి సంక్రాంతి సందడి మొదలైపోతుంది. పండుగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అలా వచ్చేవారు సంక్రాంతి మూడు రోజులు ఈ ప్లేస్లు మాత్రం మిస్ కావద్దు. భీమవరం మావుళ్ళమ్మ జాతర, భీమవరం, పాలకొల్లు, మొగల్తూరులో జరిగే సంక్రాంతి సంబరాలు, పేరుపాలెం బీచ్లో, నరసాపురం వణువులమ్మ జాతర.
పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం నుండి సంక్రాంతి సందడి మొదలైపోతుంది. పండుగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అలా వచ్చేవారు సంక్రాంతి మూడు రోజులు ఈ ప్లేస్లు మాత్రం మిస్ కావద్దు. భీమవరం మావుళ్ళమ్మ జాతర, భీమవరం, పాలకొల్లు, మొగల్తూరులో జరిగే సంక్రాంతి సంబరాలు, పేరుపాలెం బీచ్లో, నరసాపురం వణువులమ్మ జాతర.
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
దేవరపల్లి మండలం సూర్యనారాయణ పురం హైవే పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మృతుడు కందిపల్లి సత్యనారాయణ (26)గా గుర్తించారు. పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామం బిక్కవోలుకు బైక్ పై వస్తున్నాడు. యర్లగూడెం టోల్గేట్ దాటిన తర్వాత బైక్ పై వెనుక కూర్చున్న సత్యనారాయణ నిద్ర మత్తులో కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఉమ్మడి ప.గో.జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. శంఖవరం మండలం కత్తిపూడి హైవేపై జరిగిన ప్రమాదంలో భీమవరానికి చెందిన ముగ్గురు చనిపోయారు. పెదవేగి మండలం సీతాపురంలో జరిగిన ప్రమాదంలో రామసింగవరానికి చెందిన కేబుల్ ఆపరేటర్ శ్యామ్ మృతి చెందారు. దెందులూరు మండలం ఉండ్రాజవరంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సోమయ్య (60) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శంఖవరం మండలం కత్తిపూడిలో హైవేపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. భీమవరానికి చెందిన సత్యనాగమధు కుటుంబీకులు, స్నేహితుడు మొత్తం ఏడుగురు శనివారం అన్నవరం బయలుదేరారు. ప్రమాద స్థలంలో శ్యాంప్రసాద్, దివ్య, ఆమె భర్త శివనారాయణ మృతిచెందారు. శ్యాంప్రసాద్ దంపతులకు పెళ్లై పదేళ్లు అయినా పిల్లలు కలగకపోవడంతో దత్తతు తీసుకునేందుకు వారు అన్నవరం బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది.
నరసాపురం ప్రాంతాన్ని ఒక పర్యాటక హబ్గా రూపొందిస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. శనివారం నరసాపురం వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. టూరిజంను ఒక పరిశ్రమగా గుర్తించి, అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్వేది మంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.