WestGodavari

News July 22, 2024

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

అధిక వర్షాలు, వరదలపై జిల్లా యంత్రాగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఢిల్లీ నుంచి ఆయన కలెక్టర్ ప్రశాంతితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 22, 2024

YS జగన్‌పై చింతమనేని ఫైర్

image

మాజీ సీఎం వైఎస్.జగన్‌పై దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలను మభ్యపెట్టేందుకు రాష్ట్రంలో జరగని హత్యలను జరిగినట్లుగా ఆరోపిస్తున్నారని, సొంత చిన్ననాన్నను హత్య చేసిన వ్యక్తిని వెనకేసుకొని సాగుతా ఉన్నావ’ని జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘నీకు అర్హత లేదని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశార’న్నారు.

News July 22, 2024

మిస్టరీగానే నరసాపురం MPDO మిస్సింగ్

image

నరసాపురం MPDO వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆయనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్, వారి ఖాతాలకు బదిలీ అయిన సొమ్ముపై పోలీసులు దృష్టిసారించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పలుసార్లు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో MPDO నుంచి 2 దఫాల్లో మొత్తం రూ.3.2 లక్షలు వారి ఖాతాలకు జమ అయినట్లు సమాచారం. ఈ ముఠా చేతిలో ఇదేరీతిలో పలువురు మోసపోయినట్లు తెలుస్తోంది.

News July 22, 2024

ప.గో.: బ్రెయిన్ స్ట్రోక్.. సంగీత దర్శకుడు మృతి

image

ప.గో. జిల్లా ఉండికి చెందిన సినీ సంగీత దర్శకుడు గడి సతీష్ బాబు (50) శనివారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మృతిచెందారు. కాగా ఈయన గతంలో భీమవరంలోని ఓ ఆర్కెస్ట్రా బృందంలో కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. 2001లో సంగీత దర్శకుడు మణిశంకర్ వద్ద శిష్యుడిగా చేరి బెంగుళూరులో స్థిరపడ్డారని ఆయన సోదరుడు నరేంద్ర తెలిపారు. 150కి పైగా చిత్రాలకు రీ- రికార్డింగ్ చేయడంతో పాటు 6 కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

News July 22, 2024

భారీ వర్షాలు.. ప.గో. జిల్లాలో ఇదీ పరిస్థితి

image

భారీ వర్షాలకు ఉమ్మడి ప.గో. జిల్లా అతలాకుతలం అవుతోంది. వరినాట్లు నీటమునగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ కాలువలు, నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా..
☛ జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ
☛ భీమవరంలోని యనమదుర్రు డ్రైన్
☛ గోపాలపురం మండలం కొవ్వూరుపాడు – సాగిపాడు గ్రామాల మధ్య అల్లిక కాలువలు ఉగ్రరూపం దాల్చాయి.

News July 22, 2024

నేటి ‘మీ కోసం’ కార్యక్రమం రద్దు: ప.గో కలెక్టర్

image

భారీ వర్షాలు, వరదల కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన ‘మీ కోసం’ ప్రోగ్రాంను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కలెక్టర్ కోరారు.

News July 21, 2024

ఏలూరు: భార్య కువైట్ వెళ్లొద్దని మామను చంపేశాడు

image

ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురంలో మామను హతమార్చిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జి.కొత్తపల్లికి చెందిన సుబ్బారావుకు, జగన్నాథపురానికి చెందిన గంగాభవానికి 20ఏళ్ల కింద పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు. భర్త తాగుడుకు బానిస కావడంతో పుట్టింటికెళ్లిన భవాని ఏడాది కిందే కుమార్తెకు పెళ్లి చేసింది. ఆర్థికస్థితి బాగోలేక పని కోసం కువైట్ వెళ్లాలనుకోగా.. భవానిని ఆపేందుకు ఆమె తండ్రిని సుబ్బారావు హత్య చేశాడు.

News July 21, 2024

ప.గో: రేపు స్కూళ్లకు సెలవు

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ సి.నాగరాణి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. వరదల దృష్ట్యా శనివారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వగా.. ఆదివారం సాధారణ సెలవు.

News July 21, 2024

ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై ఏలూరు MP పర్యటన

image

వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాన్ని ఎంపీ మహేశ్ కుమార్ ఆదివారం ట్రాక్టర్‌పై తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారని భరోసా ఇచ్చారు. జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవటానికి వైద్యబృందం అన్నివిధాలా అప్రమత్తంగా ఉందని తెలిపారు.

News July 21, 2024

నరసాపురం MPDO మిస్సింగ్.. వీడని మిస్టరీ

image

నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు అదృశ్యం మిస్టరీ రోజురోజుకు మరింత చిక్కుముడిగా మారుతోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్ఐలు, పదుల సంఖ్యలో సిబ్బంది ఏలూరు కాలువను వలలు వేసి జల్లెడపట్టినా ఎంపీడీవో ఆచూకీపై సమాచారం ఇసుమంతైనా లభించలేదు. దీంతో ఇతని ఫోన్‌కాల్ లిస్ట్, ఆర్థిక లావాదేవీలను మరింత నిశితంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఆర్థిక వివాదాలపైనా ఆరా తీస్తున్నారు.