WestGodavari

News February 17, 2025

యజమానులకు చెప్పకుండా సర్వే చేయవద్దు: JC

image

భూ యజమానులకు తెలియకుండా సర్వే చేయరాదని ప.గో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఎంతమంది రైతులకు నోటీసులు ఇచ్చారో తెలుసుకున్నారు. నోటీసుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ముందుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.

News February 17, 2025

ప.గో: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీనితో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

News February 17, 2025

మటన్ షాపులకు ఎగబడ్డ జనం.. విపరీతంగా పెరిగిన రేట్లు!

image

బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ విక్రయాలు అమాంతం పడిపోగా మటన్, రొయ్యలు, చేపల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ప.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కేజీ మటన్ గరిష్ఠంగా రూ.1200 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. చేపలు కేజీ సాధారణంగా రూ.130గా ఉంటే రూ.180కి, రొయ్యలు రూ.250గా ఉంటే రూ.350కి పెంచి అమ్మారు. ధర ఎక్కువయినప్పటికీ బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వీటి కొనుగోళ్లకే మొగ్గు చూపారు. చికెన్ షాపులు వెలవెలబోయాయి.

News February 17, 2025

నిడమర్రు: యువకుడి హత్యపై ముమ్మర దర్యాప్తు

image

ఏలూరు జిల్లా నిడమర్రులోని బావాయిపాలెం గ్రామంలో ఏసురాజు (26) దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. మృతుడి చేయి నరికి తీసుకెళ్లారు. భర్తను విగతజీవిగా చూసిన ఏసు భార్య శ్రీవల్లి గుండెలు పగిలేలా రోదించింది. ఆమె 8 నెలల గర్భిణీ కాగా పురుడు కోసం పుట్టింటికి వెళ్లింది. రెండేళ్ల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా ఈ హత్యకు పాతకక్షలా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

News February 17, 2025

 ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.

News February 16, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్ 

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 17 సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను (పీజీఆర్ఎస్) జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. ఆదివారం కలెక్టర్  ప్రకటన విడుదల చేశారు.

News February 16, 2025

నిడమర్రులో యువకుడి దారుణ హత్య

image

ఏలూరు జిల్లా నిడమర్రులోని బావాయిపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మాది ఏసురాజు (26) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే యువకుడి చేయి నరికేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి నిడమర్రు SI చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News February 16, 2025

ద్వారకాతిరుమల : వైసీపీ సీనియర్ నాయకుడు రాజబాబు మృతి

image

ద్వారకాతిరుమలలోని సీహెచ్ పోతే పల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు శనివారం రాత్రి మృతిచెందారు. ఆయన ఇటీవల బాత్రూంలో జారి పడటంతో కాలు విరిగింది. అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News February 16, 2025

చింతలపూడి: బాలికకు జీబీఎస్ లక్షణాలు..UPDATE

image

చింతలపూడిలోని యర్రగుంటపల్లిలో బాలికకు జీబీఎస్ లక్షణాలు కనిపించగా..విజయవాడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. బాలిక నుంచి సీఎస్ఎఫ్ నమూనాలను తీసి తుది నిర్ధారణకు చెన్నైకు పంపినట్లు డీఎంహెచ్ వో, డీఈవో తెలిపారు. ఫలితాలు రావడానికి 2 వారాలు పడుతుందని, ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగా ఉందన్నారు. బాలిక స్వగ్రామంలో పలువురి నమూనాలను సేకరించగా ఎవరికీ లక్షణాలు లేవని పీహెచ్సీ వైద్యాధికారి నరేశ్ తెలిపారు.

News February 16, 2025

యలమంచిలి: 45 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

image

యలమంచిలి మండలంలో చించినాడ హైవే వద్ద శనివారం నరసాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లాకి మినీ లారీలో తరలిస్తున్న 45 క్వింటాళ్ల పీడీఎస్ రైసును విజిలెన్స్ సీఐ డి. ప్రసాద్ కుమార్ పట్టుకున్నారు. మినీ లారీని, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యలమంచిలి సివిల్ సప్లై డీటీ అయితం సత్యనారాయణ ఉన్నారు.