WestGodavari

News January 7, 2025

గోపాలపురం: మొక్కజొన్న ఆడే మెషిన్ మీద పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో గోపాలపురం మండలంలోని గోపవరంలో మంగళవారం వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. పొట్రా లక్ష్మణరావు (45) తన భుజంపై మొక్కజొన్నలు ఆడే మెషిన్ మోసుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. మిషన్ లక్ష్మణరావుపై పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మల్లీశ్వరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News January 7, 2025

టీ.నర్సాపురం: అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రేమ జంటకు వివాహం

image

టీ.నర్సాపురం ప్రధాన సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ప్రేమ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. టి.నర్సాపురం(M) బొర్రంపాలెంకి చెందిన ఇమ్మడిశెట్టి నాగేశ్వరి, కే.జగ్గవరానికి చెందిన బాలు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఇవాళ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెద్దల సమక్షంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దండలు మార్చుకున్నారు.

News January 7, 2025

ఉండి: చిన్నారులను ఆడించిన లోకేశ్

image

ఉండి నియోజకవర్గంలో సోమవారం మంత్రి నారా లోకేశ్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద అమిరంలో చిన్నారులతో లోకేశ్‌ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన చిన్నారులను ఎత్తుకుని గుండెలపై ఆడించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ రఘురామ, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో మూడు పార్టీల కేడర్‌తో భేటీ అయ్యారు.

News January 7, 2025

ప.గో.జిల్లా ప్రజలు భయపడకండి: DMHO నాయక్

image

HMPV కేసుల నమోదుతో ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారు ఆసుపత్రులకు వస్తున్నారు. ప.గో.జిల్లా ప్రజలు ఈ వైరస్ పట్ల ఆందోళన వద్దని, జాగ్రత్తలు పాటిస్తే మంచిదని జిల్లా ఇన్‌ఛార్జ్ DMHO బి.నాయక్ సూచించారు. జిల్లాలోని 54 ప్రాథమిక కేంద్రాల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండేలా అవసరమైన మందులు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు.

News January 7, 2025

ప.గో: రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

image

ప.గో.జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వారి వివరాలివే.. మొగల్తూరు(M) ముత్యాలపల్లికి చెందిన ఆదిలక్షి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని చనిపోయింది. యండగండిలో లారీ రివర్సులో వెనక్కి ఉన్న వ్యక్తిని ఢీకొట్టడంతో అప్పారావు చనిపోయారు. దలపర్రులో బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. మొగల్తూరులో నడిచి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.

News January 7, 2025

కాళ్ల: మంత్రి లోకేశ్ హత్తుకున్న బాలుడు ఎవరంటే?

image

కాళ్ల మండలం పెదఅమిరంలో ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద సోమవారం మంత్రి నారా లోకేశ్ భరత్ అనే బాలుడిని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆచంటకు చెందిన ఈ బాలుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. అంతేకాదు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో ఒకరోజు 12 గంటలు పచ్చి మంచినీరు ముట్టకుండా ఉపవాసం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

News January 7, 2025

ప.గో జిల్లా ఓటర్ల వివరాలు: కలెక్టర్

image

 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ -2025 ప్ర‌క్రియ‌ అనంత‌రం ఓట‌ర్ల తుది జాబితాను జిల్లా క‌లెక్ట‌ర్ నాగరాణి సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 6 నాటికి జిల్లాలోని మొత్తం 1,461 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 14,70,852 మంది ఓట‌ర్లు ఉన్నారన్నారు. వీరిలో పురుష ఓట‌ర్లు 7,20,597, మ‌హిళ‌లు 7,50,179, థ‌ర్డ్ జెండ‌ర్ 76 మంది ఉన్నారు.

News January 7, 2025

నల్లజర్ల: మహిళ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ 

image

మహిళలపై దాడులు చేస్తే సహించేది లేదని తూ.గో.జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు. నల్లజర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మర్లపూడి ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు పై కలెక్టర్ స్పందించారు. పోలీస్ అధికారిని పిలిచి మహిళ ఫిర్యాదుపై భర్త, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించారు.

News January 7, 2025

నరసాపురం: ఫసల్ భీమా యోజన గడువు పెంపు

image

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు ఈనెల 15 వరకు ప్రభుత్వం పెంచినట్లు వ్యవసాయశాఖ ఏడీఈ డాక్టర్ అనిల్ కుమారి తెలిపారు. సబ్ డివిజన్ లోని యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని రైతులు ఇంకా ఇన్యూరెన్స్ చెల్లించని పక్షంలో గడువులోపు చెల్లించుకోవాలన్నారు. దీని వల్ల పంటలు నష్టపోయినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా పొందేందుకు వీలుంటుందన్నారు.

News January 6, 2025

ప.గో: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్

image

➤కాకినాడ టౌన్- చర్లపల్లి(07038): 14వ తేదీ
➤సికింద్రాబాద్-కాకినాడ(07078): 12, 19
➤చర్లపల్లి-కాకినాడ(07031): 8, 10, 14, 16, 18
➤కాకినాడ-చర్లపల్లి(07032): 9, 11, 13, 15
➤చర్లపల్లి- నర్సాపూర్(07035): 11, 18
➤నర్సాపూర్- చర్లపల్లి(07036):12,19
➤చర్లపల్లి- నర్సాపూర్(07033):7, 9, 13, 15, 17
➤ చర్లపల్లి- నర్సాపూర్(07034):8, 10, 14, 16, 18
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.