India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరులో వివాహిత ప్రియాంక(25) <<14761231>>ఆత్మహత్యకు<<>> భర్తతో గొడవలే కారణమని తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పని చేసే శ్రీకాంత్(30) అనే వ్యక్తి తనకు గతంలో పెళ్లయిందనే విషయాన్ని దాచి ప్రియాంకను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవల ప్రియాంకకు తెలిసి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. డబ్బు కోసం వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సైతం తెలిపింది. శనివారం రాత్రి కూడా గొడవ జరగ్గా నిన్న ఆమె ఉరి వేసుకుంది.
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను సోమవారం నుంచి మండల, డివిజనల్ ,మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు.
తన తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం ప్రకటించారు. భీమవరంలో తన తండ్రి సంస్మరణ సభలో శ్రీనివాస వర్మ మాట్లాడారు. తన తండ్రి వల్లే ఈ స్థాయికి చేరానని అన్నారు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అన్నారు.
కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులతో కళకళలాడే పేరుపాలెం బీచ్ ఆదివారం వెలవెలబోయింది. అల్పపీడనం ఎఫెక్ట్తో బీచ్లో పెద్ద పెద్ద రాకాసి అలలు వస్తుండడంతో పోలీస్ యంత్రాంగం పర్యాటకులను రావొద్దని హెచ్చరించింది. దీంతో పర్యాటకులు బీచ్కు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చింది.
బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాళ్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ప.గో జిల్లాలో ఫెంగల్ తుఫాను ప్రభావం ఉండటంతో రైతులు నష్టపోకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలను రైతులకు జారీ చేశారు. వరి కోతలు రెండు రోజులు వాయిదా వేసుకోవాలని, అలాగే ఇప్పటికే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భద్రపరుచుకోవాలి అన్నారు. సమాచారం కోసం 8121676653, 18004251291 సంప్రదించవచ్చని అన్నారు.
గోపాలపురం మండలం జగన్నాథపురంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తెలిసిందే. ఎస్ఐ సతీష్ వివరాల మేరకు.. రెడ్డిగణపవరం నుంచి వాడపల్లి వెంకన్న సన్నిధికి వామిశెట్టి వెంకటేశ్వరరావ్, షేక్ బేగం(35) బైక్పై వెళ్తుండగా జగన్నాథపురంలో ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా బేగం మృతి చెందారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
అప్పు ఇచ్చి అడిగినందుకు వ్యక్తిపై మహిళ యాసిడ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన రేష్మతో పాలకోడేరుకు చెందిన బాలకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంలో దఫాల వారీగా 2.40 లక్షలను అప్పుగా రేష్మకు బాలకృష్ణ ఇచ్చాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన బాలకృష్ణపై ఈ నెల 6న మహిళ యాసిడ్ పోసిందని పాలకోడేరు SI రవివర్మ తెలిపారు. శుక్రవారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
నరసాపురం పట్టణ పరిధిలోని పలు హోటళ్లను నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం. అంజయ్య తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో పరిశుభ్రత, ఆహార ఉత్పత్తుల నాణ్యతతను క్షుణ్ణంగా పరిశీలించి యజమానులకు పలు సూచనలు చేశారు. పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని ఆయా హోటళ్ల నిర్వాహకులను హెచ్చరించారు.
ఏలూరు జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ప్రణాళికల లక్ష్య సాధనపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పరిశ్రమ, విద్యా, వైద్యం, రోడ్డు, భవనాలు తదితర శాఖలు లక్ష్యంతో పనిచేయాలన్నారు. మనం చేసే కార్యాచరణతో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.