India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆరునెలల ప్రగతి తెలిపారు. రైతులకు వారు తోలిన ధాన్యానికి రూ.911కోట్లు వారి ఖాతాలకు తోలిన రెండు రోజుల్లో వేశామన్నారు. అన్నం పెట్టే రైతుకు అందరూ అండగా ఉండాలన్నారు. అలాగే ఎన్ ఆర్ జీ ఎస్ ఉపాధి హామీ పథకంలో రోడ్ల నిర్మాణం, రెవెన్యూ సదస్సులో 511గ్రామాలనుంచి అర్జీలు అందాయన్నారు.
పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో 2024వ సంవత్సరంలో నేరాలను అదుపు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప కిషోర్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేర నియంత్రణ కోసం గంజాయి, నాటుసారా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్ఠ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
నూతన సంవత్సర వేడుకలను జిల్లాలోని పేద విద్యార్థులతో జరుపుకుందామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసిల్వి, ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేస్తే వారి చదువులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లా ప్రజలు న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసులు సర్వత్రా న్యూఇయర్ సందడి నెలకొంది. స్వీట్, బేకరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఈవెంట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి ఈ న్యూఇయర్ సెలబ్రేషన్స్ను మీరు ఎలా ప్లాన్ చేశారో కామెంట్ చేయండి.
సీరియల్ నటిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాలు.. ప.గో.జిల్లా కవిటానికి చెందిన మహిళ(29) కృష్ణానగర్లో నివాసం ఉంటోంది. ఇటీవల ఓ సీరియల్ షూట్లో ఫణితేజతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో అతడు అసభ్యకరమైన వీడియోలు పంపాడు. ఇతరులతో దిగిన ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గోపాలకృష్ణ అనే వ్యక్తి రూ.18వేలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి ప.గో. జిల్లా TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలతో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు, 10 మంది డీలర్లపై కేసు నమోదు చేశారు.
అనుమతిలేని పిల్లల దత్తతును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అలా జరిగితే సంబంధిత గ్రామ అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. సోమవారం భీమవరం సమావేశ మందిరం వద్ద కలెక్టర్ అధ్యక్షతన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి కార్యక్రమాల కన్వర్జెన్సీ సమావేశాన్ని సభ్యులైన సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(D) చేబ్రోలుకి చెందిన పుట్టా వీరన్న, శ్రీదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సీఏలో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చేబ్రోలు, నారాయణపురంలో ప్రాథమిక విద్యాబ్యాసం సాగించిన గీతాంజలి.. ఇంటర్ అనంతరం CAలో ఉచిత సీటు సాధించారు. తండ్రి వీరన్న ఆటో డ్రైవర్గా కష్టపడుతూ గీతాంజలిని ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. పట్టుదలతో చదివిన గీతాంజలి సీఏ ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులను గర్వపడేలా చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి 13 నియోజకవర్గాల్లో YCP నెగ్గింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 15 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 10 చోట్ల TDP, ఐదు స్థానాల్లో జనసేన విజయం సాధించాయి. పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడు మంత్రి కాగా, రఘురామకృష్ణరాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ కావడం కొసమెరుపు.
దేవరపల్లి మండలంలోని డైమండ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి గుంటూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్లో క్షతగ్రాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.