WestGodavari

News November 28, 2024

ఏలూరు: ఫెంగల్ తుఫాన్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సాల్మన్ రాజు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు శాఖ పరంగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఏలూరు విద్యుత్ భవన్ నందు 24 గంటలు పనిచేసే విధంగా నెం. 9440902926 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామన్నారు. కావున ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు.

News November 27, 2024

ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: జేసీ

image

తుఫాను భయంతో ముందస్తు కోతలు, నూర్పిడి చేయొద్దని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రైతులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. జిల్లా బుధవారం జిల్లాలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తుఫాను హెచ్చరికల విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.

News November 27, 2024

ఓం బిర్లాను కలిసిన RRR

image

దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజు(RRR) మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ విషయాలు పంచుకున్నారు. RRR వెంట ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు. 

News November 27, 2024

నన్ను కొట్టిన వాళ్లంతా జైలుకు వెళ్తారు: RRR

image

ఉండి MLA, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు(RRR) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత ప్రభుత్వంలో నాపై కేసు పెట్టారు. విచారణలో భాగంగా కొందరు అధికారులు నన్ను కొట్టారు. ఇప్పుడు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నా. ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి’ అని RRR కోరారు.

News November 27, 2024

ఉండి యువతికి కీలక ఉద్యోగం

image

దేశస్థాయిలో ప.గో జిల్లా యువతి సత్తా చాటారు. ఉండి పెదపేటకు చెందిన నిస్సీ ప్లోరా డిగ్రీ BSC చదివారు. తర్వాత ఆమె హార్టికల్చర్ విభాగంలో పీహెచ్‌డీ చేశారు. దేశంలోని 16 కీలక పోస్టులకు 16 వేల మంది పరీక్షలు రాశారు. ఈక్రమంలో నిస్సీ ఫ్లోరా ప్రతిభ చూపి అహ్మదాబాద్‌లోని నేషనల్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. నిస్సీ తండ్రి ఏసురత్నం రిటైర్డ్ టీచర్. తల్లి వర్జీనియా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.

News November 27, 2024

భీమవరం నుంచి మలేషియా పంపి మోసం

image

మలేషియా పంపి మోసం చేసిన ఘటన భీమవరంలో జరిగింది. ‘నేను భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో ఉంటున్నా. ప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ మహిళ రూ.1.50 లక్షలు తీసుకుని పంబ్లింగ్ పని కోసం నన్ను మలేషియా పంపింది. కానీ ఓ హోటల్లో పనికి పెట్టి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తిరిగి భీమవరం పంపాలని నా భార్య ఆ మహిళను కోరినా పట్టించుకోలేదు. తెలిసిన వాళ్ల ద్వారా భీమవరం వచ్చా’ అని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 27, 2024

ఆకివీడులో 40 అడుగుల బొప్పాయి చెట్టు

image

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగరపంచాయతీలో కాకరపర్తి వీధిలో సత్యనారాయణ పెరటిలో బొప్పాయి చెట్టు అబ్బుర పరుస్తుంది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ బొప్పాయి సాధారణంగా ఐదు నుంచి పది పన్నెండు అడుగులు ఎత్తు వరకు ఎదుగుతాయి అన్నారు. తన పెరటిలో నాటిన మొక్క సుమారు 40 అడుగులు వరకు పెరిగి అందరిని ఆశ్చర్య పరుస్తుంది అన్నారు. తాను ఐదు సంవత్సరాల క్రితం నాటినట్టు ఆయన తెలిపారు.

News November 26, 2024

సంచలన కేసులో ఉత్కంఠ.. నేడు కీలక వ్యక్తి అరెస్ట్?

image

సీఐడీ విశ్రాంత అదనపు SP విజయ్ పాల్ నేడు ప్రకాశం జిల్లా SP ఎదుట విచారణకు హాజరుకానున్నారు. YCP హయాంలో ఓ కేసు విచారణలో ప్రస్తుత ఉండి MLA రఘురామను హింసించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణ అనంతరం విజయ్ పాల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కాగా నాడు MPగా ఉన్న RRRను విచారణలో కొట్టారనే ఆరోపణలు, సుప్రీంకోర్టులో విచారణ, ఆయనను ఆర్మీ హాస్పిటల్‌కు తరలించడం సంచలనం సృష్టించాయి.

News November 26, 2024

ఏలూరు: ఇద్దరు మిత్రులు అరెస్ట్.. 6 కార్లు రికవరీ

image

ఏలూరులో సెల్ఫ్ డ్రైవింగ్‌కు కార్లను తీసుకుని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సా చేసుకుంటున్న అభిషేక్ (34), భానుచందర్ (39) అనే ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకున్నామని ఏలూరు రేంజ్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరు ముద్దాయిల నుంచి 6 కార్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. పత్రాలు లేకుండా బైక్, కార్లు తాకట్టు పెట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 26, 2024

జగన్‌పై Dy.స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు

image

వైసీపీ అధినేత జగన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆయన మాట్లాడారు. జగన్ ఇంట్లో కూర్చుని మాట్లాడే బదులు, అసెంబ్లీకి రావాలని పేర్కొన్నారు. ‘ఆయనకు ప్రతిపక్ష హోదాను ప్రజలే తిరస్కరించారు. నేను ఎంపీగా ఉన్న సమయంలో దారుణంగా హింసించారు. నన్ను చంపాలని కూడా చూశారు. అప్పటి పెద్దలు చెప్పడంతోనే నాపై రాజద్రోహం కేసు పెట్టారు’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.