India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ “శ్రీ విశ్వావసు” నామ సంవత్సర ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగతోనే ఆరంభం అవుతుందని, ఉగాది పేరులోనే ఏడాది ప్రారంభమని అర్థం ఉందని తెలిపారు. ఉగాది మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్నీ తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.
కడప జిల్లా కొండాపురం 4 వరుసల రహదారిలోని CMR కాంప్లెక్స్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైకును కారు ఢీకొనడంతో బైకులో ఉన్న సరోజ, రామమోహన్ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజను చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.<<15922594>> భర్త రామ్మోహన్<<>> అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కడప జిల్లా కొండాపురం 4 వరుసల రహదారిలోని CMR కాంప్లెక్స్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైకును కారు ఢీకొనడంతో బైకులో ఉన్న సరోజ, రామమోహన్ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజను చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.<<15922594>> భర్త రామ్మోహన్<<>> అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాశినాయన ఆశ్రమానికి 23 హెక్టార్ల స్థలం కావాలని 2023లో నేను లేఖ రాస్తే YCP ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో మరోసారి కేంద్ర అటవీ శాఖ మంత్రికి మేము రిక్వెస్ట్ చేస్తే 13ఎకరాలు ఇస్తామని ఆయన చెప్పారు. డైనోసార్లాగా వైసీపీ కాలగర్భంలో కలిసిపోయింది. 30ఏళ్లు కాదు కదా.. 30 తరాలైన వైసీపీ గెలవదు’ అని ఢిల్లీలో ఎమ్మెల్యే అన్నారు.
బెట్టింగ్ భూతానికి కడప జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు. ప్రొద్దుటూరులో పట్టణంలోని రామేశ్వరానికి చెందిన యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. ఏకంగా రూ.8 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. 1-టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
NOTE: ఐపీఎల్, ఆన్లైన్, ఇతర ఏ బెట్టింగ్ జోలికి వెళ్లకండి
కడప జిల్లాలో మరొక కీలక నేత రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు అఫ్జల్ఖాన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన తన రాజీనామా లేఖను షర్మిలకు పంపారు. అనివార్య కారణాలతో పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 25 వేల ఓట్లు సాధించారు. ఈక్రమంలో ఇక్కడ వైసీపీ ఓడిపోయింది.
కడప జిల్లాలో అరటి ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టన్ను రూ.6వేల నుంచి రూ.9వేలు పలుకుతున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు అరటి గెలలన్నీ నేలకూలడంతో నష్టపోయిన రైతులను తగ్గిన అరటి ధరలు మరింత కుంగదీస్తున్నాయి. గతంలో టన్ను అరటికాయలు రూ.16 నుంచి రూ.18వేలు పలికాయి. ప్రభుత్వం స్పందించి అరటికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. = రైతులను = అరటికాయలు రూ.16 వేల
వైయస్సార్ కడపజిల్లా, ఎర్రగుంట్ల మండలం యర్రంపల్లి గ్రామానికి చెందిన ఎన్.శ్రీచరణి బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో 6 వికెట్లు తీసి సత్తా చాటింది. గురువారం డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన మల్టీ డేస్ క్రికెట్ మ్యాచ్లో టీమ్-బీకి ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి తొలిరోజు మ్యాచ్లో 32 ఓవర్లు వేసి 8 మెయిడిన్ ఓవర్లు, 6 వికెట్లు తీసి సత్తా చాటింది.
కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు సహకారం అందించిన ఉమ్మడి కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్, జగన్ మీద అభిమానంతో రామ గోవింద్ రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించారని అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల పట్ల జిల్లా పరిధిలోని ZPTCలు పోరాటం కొనసాగించాలని సూచించారు.
ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన విద్యార్థి 32 ఫేక్ ఇన్స్టాగ్రాం అకౌంట్లతో తన క్లాస్ అమ్మాయిలను వేధించాడు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థిని హెచ్చరించారు. తమ బిడ్డనే మందలిస్తారంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారితో పాటు మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.