Y.S.R. Cuddapah

News November 26, 2025

కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

image

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News November 26, 2025

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ సంతకం

image

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కోటి సంతకాల సేకరణ ఫారంపై సంతకం చేసి తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

News November 26, 2025

ప్రొద్దుటూరులో బంగారు ధరలు ఇలా..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారు ధరలు బుధవారం ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.12,590
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.11,583
* వెండి 10 గ్రాములు ధర రూ.1,630 గా ఉంది.
నిన్న, ఈరోజుకి బంగారు ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ నిన్న వెండి 10 గ్రాములు రూ.1,616 ఉండగా నేడు రూ.1630లకు పెరిగింది.

News November 26, 2025

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

image

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు నిలిపివేస్తూ ఆ శాఖ ఎండీ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ‘ఫేజ్-3’లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోని లోపాలపై ఇటీవల పరిశీలన చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో 6,298 ఇళ్ల నిర్మాణాలకు అదనపు చెల్లింపు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు 30 మంది ఏఈఎస్‌లు, 171 మంది ఈఏ/డబ్ల్యూఏఎస్‌లను బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.

News November 26, 2025

కన్నీటి నివాళి: ‘అమ్మే మా వెన్నెముక’

image

కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచిన <<18391262>>అమ్మ<<>> రత్నమ్మ (83) ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం భారంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటలతో చెప్పలేనంత గొప్పవని అన్నారు. అమ్మ లేకపోవడం మాటల్లో చెప్పలేని పెద్ద లోటుగా మిగిలిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

News November 26, 2025

ఎంపీ సీఎం రమేశ్ తల్లి మృతి

image

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 26, 2025

ఎంపీ సీఎం రమేశ్ తల్లి మృతి

image

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 26, 2025

50KM ప్రయాణం.. డివిజన్ మార్పుపై చర్చ

image

కడప డివిజన్‌లోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోకి చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం నుంచి కడప చాలా దగ్గర. ప్రస్తుతం రాజంపేటలోకి కలపడంతో ఏదైనా పనికోసం 50కి.మీ వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్‌లో ఉండాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

News November 26, 2025

పులివెందులలో YS జగన్ నేటి పర్యటన ఇలా..

image

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాసవీ ఫంక్షన్‌ హాలులో వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం బ్రాహ్మణపల్లె వద్ద అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లింగాల మాజీ సర్పంచ్‌ మహేష్‌రెడ్డి కుటుంబసభ్యులను, రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు.

News November 26, 2025

పులివెందులలో YS జగన్ నేటి పర్యటన ఇలా..

image

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పులివెందులలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాసవీ ఫంక్షన్‌ హాలులో వివాహ వేడుకలో పాల్గొని, అనంతరం బ్రాహ్మణపల్లె వద్ద అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చిస్తారు. మధ్యాహ్నం లింగాల మాజీ సర్పంచ్‌ మహేష్‌రెడ్డి కుటుంబసభ్యులను, రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు.