India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఫలితాల పర్వమే. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే జిల్లాలో ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఐదుగురు హ్యాట్రిక్ సాధిస్తారని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వారిలో వైఎస్ జగన్, రఘరామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్ భాషా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. దీంతో ప్రజాతీర్పు కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. జిల్లాలో 23,39,900 మొత్తం ఓటర్లు ఉన్నారు. వీరిలో 18,37,711 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో జమ్మలమడుగు నియోజకవర్గం అత్యధికంగా 86.68% నమోదు కాగా, కడపలో 65.27% తక్కువగా నమోదైంది. అటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 99% మంది ఉద్యోగులు ఓటు వినియోగించుకున్నారు. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈనెల 14వ తేదీ ఉదయం నుంచి జూన్ 4వ తారీకు వరకు జిల్లా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (జిల్లా కలెక్టర్) జారీ చేసిన 144 సెక్షన్ అమలులో ఉంటుందని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి, ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
చాపాడు మండలంలోని మొర్రాయిపల్లెలో మంగళవారం పుష్పరాజ్ అనే ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందినట్లు ఏపీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఉపాధి పని చేస్తుండగా పుష్పరాజ్ గుండె నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
బ్రహ్మంగారి మఠం మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన వళ్లెం వీరారెడ్డి (30) మంగళవారం అనారోగ్యంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతను టీడీపీ యూత్ కమిటీలో కీలక నేతగా పనిచేసేవాడన్నారు. ఆయన మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరారెడ్డి మరణించడంతో పలువురు టీడీపీ నేతలు పార్థివ దేహానికి సంతాపం తెలిపారు.
జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగుతోందని DSP టీడీ.యస్వంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో YCP MLA అభ్యర్థి సుధీర్ రెడ్డికి, కూటమి MLA అభ్యర్థి ఆది నారాయణ రెడ్డికి, MP అభ్యర్థికి భూపేశ్ రెడ్డికి 2+2 గన్ మ్యాన్లతో భద్రతను పెంచారు. ఇప్పటికే ఇద్దరు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జమ్మలమడుగులో ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే నాన్బెయిలబుల్ కింద కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా 11 మంది అనుచరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలురులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇద్దరు టీడీపీ ఏజెంట్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో సహా 11 మందిపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికలు దాదాపుగా ప్రశాంతంగా ముగిశాయి. కమలాపురం, చాపాడు, పుల్లంపేట, జమ్మలమడుగు, రాయచోటి, కడప వంటి ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినా, మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలపై ఉక్కుపాదం మోపారు. అయితే గ్రామాల్లో కొందరు అల్లరిమూకలు చిచ్చుపెట్టారని, ఎన్నికలు ఒక్కరోజే అయిపోయాయి కానీ గొడవలు, గాయాలు మిగిల్చాయని పలువురు అంటున్నారు. దీనిపై మీరేమంటారు.
మాజీ మంత్రి, వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి సోమవారం పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఆయనకు ఓటు వేసేందుకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఒక్కరోజు అనుమతినిచ్చింది. భాక్రరాపురంలో ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.
జిల్లాలో పోలింగ్ చెదురుమదురు సంఘటనలు తప్ప, ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బద్వేలు 78.55% జమ్మలమడుగు 86.30, కడప 62.83, కమలాపురం 83.35, మైదుకూరు 84.06, ప్రొద్దుటూరు 79.11, పులివెందుల 81.06, కోడూరు 74.33, రాజంపేట 76.99, రాయచోటి 76.91శాతాల వారిగా పోలింగ్ జరిగింది. కాగా 78.72 జిల్లాలో నమోదయిందని తెలిపారు. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.