Y.S.R. Cuddapah

News September 1, 2025

113 మంది అర్జీదారుల ఫిర్యాదు స్వీకరణ: ఎస్పీ

image

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ అశోక్ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం’(PGRS) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 113 మంది పిర్యాదు దారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామన్నారు.

News September 1, 2025

కమలాపురం: లోకేశ్ పర్యటన ఇలా..!

image

మంత్రి నారా లోకేశ్ కమలాపురం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన పర్యటించనున్నారు. ఉదయం10.30 గంటలకు పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల భవనాలు ప్రారంభిస్తారు. 11.35కు కొప్పర్తిలో ఓ కంపెనీని ప్రారంభించి 12.20కి చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లెకు చేరుకుంటారు. సెంట్రల్ కిచెన్ ఓపెన్ చేసి మధ్యాహ్నం 2గంటలకు చింతకొమ్మదిన్నె మండలం కొలుమలపల్లెలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.

News September 1, 2025

కడప: బాలికపై అత్యాచారయత్నం

image

కడప జిల్లా మైలవరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదుగురు యువకులు గాలి మరల రిపేర్ పనుల కోసం వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో మహ్మద్ అలీ(35) అనే యువకుడు 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయడంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 1, 2025

చక్రాయపేట: నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం

image

కడప జిల్లాలో ఆదివారం వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చక్రాయపేట మండలం మహాదేవపల్లె వాసులు గ్రామంలో గణనాథుని ఊరేగించి సమీప చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 31, 2025

సెప్టెంబర్ 2న కొప్పర్తికి రానున్న మంత్రి లోకేశ్

image

మంత్రి లోకేశ్ సెప్టెంబర్ 2న కమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ను సందర్శిస్తారని వారు తెలిపారు. కొప్పర్తికి త్వరలో మరిన్ని పరిశ్రమలు రానున్నాయని, ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వారు తెలిపారు.

News August 31, 2025

రేపు పులివెందుల రానున్న YS జగన్

image

కడప జిల్లాలో మూడు రోజులపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించానున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నానికి పులివెందుల చేరుకోనున్న జగన్, రెండో తేదీ ఉదయం తన తండ్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలలో నివాళులర్పిస్తారు. అనంతరం లింగాల మండలం అంబకంపల్లి చేరుకొని జలహారతిలో పాల్గొంటారు. పులివెందుల చెరుకుని రాత్రికి బస చేసి మూడవ తేదీ ఉదయం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

News August 31, 2025

కడప: మూడు ప్రాంతాల్లోనే బార్ల ఏర్పాటు

image

కడప జిల్లాలో మూడు ప్రాంతాల్లోనే రేపటి నుంచి కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. కడపలో 8, ప్రొద్దుటూరులో 5, బద్వేల్‌లో 1 కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలోని మిగతా బార్లను నేటి అర్ధరాత్రి నుంచి క్లోజ్ కానున్నాయి. నూతన బార్ పాలసీ మేరకు జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2, మొత్తం 29 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. 14 వాటికే దరఖాస్తులు రాగా వాటిని డ్రా ద్వారా అధికారులు కేటాయించారు.

News August 31, 2025

కడప: రేషన్ కార్డుదారులకు ఉచితంగా జొన్నలు

image

చౌకా దుకాణాల ద్వారా సెప్టెంబరు నుంచి లబ్ధిదారులకు ఉచితంగా జొన్నలు అందించనున్నట్లు జేసీ అతిథి సింగ్ శనివారం తెలిపారు. బియ్యం కార్డులో ముగ్గరు సభ్యులు కన్నా తక్కువ ఉంటే ఒక కిలో మాత్రమే ఇస్తామన్నారు. సభ్యులు ఎక్కువ ఉంటే రెండు కిలోలు జొన్నలు బియ్యానికి బదులుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంత్యోదయ, అన్నయోజన వారు కూడా అర్హులన్నారు.

News August 30, 2025

BREAKING: బద్వేల్ జనసేన ఇన్‌ఛార్జ్ మృతి

image

బద్వేల్ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ బసవి రమేశ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం అతను మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుముందు ఆయన అనారోగ్య పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అనంతరం చికిత్స కోసం రూ.2 లక్షల సాయం చేశారు. అతని మృతి బాధాకరమని కార్యకర్తలు అన్నారు.

News August 30, 2025

అల్లు అర్జున్ కుటుంబానికి శ్రీనివాసరెడ్డి పరామర్శ

image

నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మృతి చెందారు. హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు & కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబీకులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.