Y.S.R. Cuddapah

News April 5, 2026

ప్రొద్దుటూరు శివాలయం ఇంటి దొంగలపై విచారణ!

image

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) ఇంటి దొంగలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అమ్మవారి బంగారు హారం, స్వామివారి వెండి వస్తువులు, సుమారు రూ. కోటి డబ్బులు మాయమయ్యాయి. వీటిపై ఎండోమెంట్ కర్నూల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సూపరింటెండెంట్ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది అధికారుల బృందాన్ని విచారణకు నియమించారు. వీరు సోమవారం విచారణకు వస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు.

News April 5, 2026

కడపలో పోలీసుల తనిఖీలు.. బార్లు, వైన్‌ షాపులపై నజర్!

image

కడప నగరంలోని బార్లు, వైన్‌ షాపుల్లో పోలీసులు శనివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సీఐలు చిన్న పెద్దయ్య, ఓబులేసు పర్యవేక్షించారు. నేరాల అదుపునకు యాజమాన్యాలు సహకరించాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 4, 2026

కడప జిల్లాలో GST వసూళ్లు ఇలా.!

image

కడప జిల్లాలో పులివెందుల, ప్రొద్దుటూరు 1 సర్కిల్‌లో GST వసూళ్లు 40% పైగా పెరిగాయి.
సర్కిళ్ల వారీగా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్ల వివరాలు రూ.కోట్లలో (ప్రోగ్రెస్%).
* కడప 1-18.85-20 (8.5%).
* కడప 2-8.0-7.42 (-7%).
* కడప SPL-8.16.8.95 (9.74%).
* ప్రొద్దుటూరు 1-4.00-5.80 (41.57%).
* ప్రొద్దుటూరు 2-7.60-9.16 (20%)
* పులివెందుల- 11.69-17.07 (45.92%).

News April 4, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,160
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,947
* వెండి 10 గ్రాముల ధర రూ.2,390.

News April 4, 2026

జీఎస్టీ వసూళ్లలో TOP-6లో కడప డివిజన్

image

కడప డివిజన్లో జీఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.851.44 కోట్లు రాగా.. 2025-26లో రూ.932.83 కోట్లు వచ్చాయని SGST కడప జాయింట్ కమిషనర్ సుమతి తెలిపారు. నెలకు సగటున రూ.70.95 కోట్లు జీఎస్టీ వసూలయ్యాయి. రూ.82.38 కోట్ల పెరుగుదల నమోదైంది. రూ.2025 మార్చిలో రూ.73.31 కోట్లు రాగా.. 2026 మార్చిలో రూ.84.39 కోట్లకు పెరిగాయి. గత నెలలో SGST నగదు వసూళ్లలో రూ.38.79 కోట్లతో స్టేట్‌లో కడప టాప్-6లో నిలిచింది.

News April 4, 2026

కడప: ఒక్క రోజులో 238 కేసులు నమోదు

image

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు చేశారు. వాహనదారుల నుంచి రూ.46,590లు పెనాల్టీ వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో అన్ని రకాల వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలను, డ్రైవింగ్ లైసన్స్‌లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News April 3, 2026

కడప జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు

image

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 238 కేసులు నమోదు చేశారు. వాహనదారుల నుంచి రూ.46,590లు పెనాల్టీ వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో అన్ని రకాల వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలను, డ్రైవింగ్ లైసన్స్‌లను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News April 3, 2026

కడప: రూ.లక్షలు కొట్టేసిన సైబర్ నిందితుడు అరెస్ట్

image

సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 9 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశామని విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. తాజాగా ఈ ముఠాకు సంబంధించి కడప జిల్లాకు చెందిన నగేషయ్యను అరెస్టు చేశామన్నారు. విశాఖలోని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.83 లక్షల వరకు దోచుకున్నారన్నారు. నిందితుడికి మణికంఠ, చందు అనే వారు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్నట్లు గుర్తించామన్నారు.

News April 3, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,170
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,956
*వెండి 10 గ్రాముల ధర రూ.2,400
———

News April 3, 2026

కడప జిల్లా కలెక్టర్‌ను అభినందించిన CM

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను గురువారం ఒంటిమిట్టలోని TTD అతిథి గృహంలో అభినందించారు. స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు పొందడం పట్ల ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ విధానం అమలవుతున్న తీరును ముఖ్యమంత్రికి వివరించారు. స్మార్ట్ కిచెన్ ద్వారా ఆహార భద్రత, పారదర్శకత, రుచికరమైన భోజనం అందించవచ్చని సీఎంకు వివరించారు.