India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. అదనపు SP (అడ్మిన్) ప్రకాశ్ బాబు ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం చేయాలని పోలీసులు ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 158 పిటీషన్లను చట్టం ప్రకారం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ పాల్గొన్న కార్యక్రమంలో ఫిర్యాదుదారులకు సిబ్బంది సహాయం చేశారు.
ఎర్రగుంట్ల మండలం కమలాపురం వెళ్లే రహదారిలోని తిప్పలూరు వద్ద సోమవారం రాత్రి కంటైనర్ -లారీ ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఇరుక్కుపోగా అతనిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో రెండు లారీలు ఢీకొనడంతో రోడ్డుకు ఇరువైపుల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
కడపలో రైలు కింద పడి <<17990131>>కుటుంబం ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటన కలచి వేస్తోంది. శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష, 18 నెలల వయసు ఉన్న కుమారుడు రితిక్తో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చిన్నారి రితిక్ మృతి చెందడం పలువురిని ఆవేదనకు గురి చేస్తుంది. అభం శుభం తెలియని వయసులో ఏం జరుగుతుందో తెలియక, తన తల్లి రైలు కిందకు ఎందుకు తీసుకుని వెళ్తుందో అర్థం కాక చిన్నారి మృతి చెందడం బాధాకరం.
కడప నగర శివారులో ఆదివారం రాత్రి <<17990044>>ఓ కుటుంబం<<>> రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలం చేరుకొని మృతదేహాలను రిమ్స్కు తరలించారు. మృతుల వివరాలను రైల్వే ఎస్సై తెలిపారు. కడప శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష, కుమారుడు రితిక్గా పేర్కొన్నారు. మృతుడు స్థానికంగా ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలి
కమలాపురంలో ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. ఈర్ల సుకన్య (11) అనే బాలిక ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకి తీశారు. ఇసుక తవ్వడంతో లోతైన గుంతలు ఏర్పడడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రొద్దుటూరుకు చెందిన సింహా సేన్ రెడ్డి కుమార్తె దియా సింహ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైంది. కడపలో శనివారం జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలలో విద్యార్థిని దియా సింహ బ్రాంజ్ మెడల్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో దియాసింహ పాల్గొనున్నట్లు కోచ్ నాగేశ్వరరావు తెలియజేశారు.
మెగా డీఎస్సీ నిర్వహణతో కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయులుగా ఎంపికైన 70 మందిని శనివారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతిష్ఠాత్మకంగా డీఎస్సీ నిర్వహించామన్నారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
అసలుకు నకిలీకి ఏ మాత్రం తేడా లేకుండా పచ్చ బ్యాచ్ నకిలీ మద్యం మార్కెట్లోకి తీసుకువచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆయన శనివారం పొద్దుటూరులో మద్యం బాటిళ్లు తీసుకుని సమావేశం నిర్వహించారు. ఇందులో అసలు ఏదో, నకిలీ ఏదో పట్టుకుంటే రూ.పది లక్షలు ఇస్తామని సవాల్ చేశారు. బాటిళ్లు, లేబుళ్లు, మూతలు, క్యూఆర్ కోడ్ ఏ మాత్రం తేడా లేకుండా నకిలీ తీసుకువచ్చారన్నారు.
ఖాజీపేట(M) గుత్తి కొట్టలు గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి కుటుంబం వృత్తిరీత్యా జర్మనీలో స్థిరపడింది. నాగేశ్వర్ రెడ్డి కుమార్తె బేబీ చేతన (15) అక్కడ 9వ తరగతి చదువుతోంది. రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై మృతి చెందింది. ఆ చిన్నారి మృతదేహం స్వగ్రామానికి శనివారం చేరుకుంది. చిన్నారి మృతి పట్ల గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి మృతి బాధాకరమన్నారు.
ప్రొద్దుటూరు: స్థానిక జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి షేక్ మున్నా(19) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు 1టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్నా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.