Y.S.R. Cuddapah

News November 30, 2025

పుష్పగిరిలో అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు!

image

పుష్పగిరి గంగాధరేశ్వర, శివాలపల్లి కాశీవిశ్వేశ్వరాలయాల్లో అరుదైన ‘బ్రహ్మసూత్ర’ శివలింగాలున్నట్లు చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ తెలిపారు. శివలింగంపై ఉండే ప్రత్యేక నిలువు గీతలను బ్రహ్మసూత్రం అంటారని, ఇవి చాలా అరుదని చెప్పారు. వీటిని ఒక్కసారి దర్శిస్తే వెయ్యిసార్లు శివాలయానికి వెళ్లినంత ఫలం దక్కుతుందని వివరించారు. ఇవి 10, 13వ శతాబ్దాల నాటివని ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.

News November 30, 2025

కడప: సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో డిసెంబర్ 1న(సోమవారం) కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ నచికేత్ వెల్లడించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా, తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

News November 30, 2025

తిరుపతి రుయాలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ

image

బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయాలి. తిరుపతి రుయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళ, శుక్రవారం న్యూరాలజీ OP ఇస్తారు. అత్యవసర వైద్యం 24గంటలు అందిస్తారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్ వేస్తారు. 90శాతం ప్రాణాపాయం తప్పుతుంది.

SHARE IT.

News November 30, 2025

కడప: వెంటనే ఈ నంబర్లు సేవ్ చేసుకోండి.!

image

తుఫాన్ నేపథ్యంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
☞కడప కలెక్టరేట్: 08562-246344 ☞కడప ఆర్టీవో ఆఫీస్: 08562-295990
☞ జమ్మలమడుగు ఆర్టీవో ఆఫీస్: 9502836762 ☞ బద్వేలు: 63014-32849 ☞పులివెందుల ఆర్డీవో ఆఫీస్: 98499-04111 ☞ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08561-293006
☞ ప్రజలు అత్యవసర సమయంలో ఈ నంబర్లకు ఫోన్ చేసి సాయం పొందవచ్చు.

News November 30, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కడప SP

image

తుఫాను నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP నచికేత్ విశ్వనాథ్ కోరారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. రెస్క్యూ టీం సిద్ధంగా ఉందని, చెరువులు కాలువలకు గండి పడే అవకాశం ఉన్నచోట పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా అత్యవసర సహాయం కోసం ప్రజలు 112కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు.

News November 30, 2025

కడప: ‘దిత్వా తుపానుపై అప్రమత్తంగా ఉండాలి’

image

కడప జిల్లాపై దిత్వ తుఫాన్ ప్రభావం ఉండనుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఆస్తి ప్రాణ, పంట నష్టం జరగకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

News November 30, 2025

కడప: ‘దిత్వా తుపానుపై అప్రమత్తంగా ఉండాలి’

image

కడప జిల్లాపై దిత్వ తుఫాన్ ప్రభావం ఉండనుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఆస్తి ప్రాణ, పంట నష్టం జరగకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

News November 30, 2025

కడప: ‘దిత్వా తుపానుపై అప్రమత్తంగా ఉండాలి’

image

కడప జిల్లాపై దిత్వ తుఫాన్ ప్రభావం ఉండనుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఆస్తి ప్రాణ, పంట నష్టం జరగకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

News November 29, 2025

జమ్మలమడుగు: RTC ఆధ్వర్యంలో శబరిమలకు.!

image

జమ్మలమడుగు నుంచి అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం శబరిమలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్బమ్మ తెలిపారు. అయ్యప్పస్వామి భక్తులకు APS-RTC వారు సువర్ణావకాశం కల్పిస్తున్నామన్నారు. ఇంద్ర AC, అల్ట్రాటెక్, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులు బుకింగ్ చేసిన గురు స్వాములకు రూ.2వేలు. కమిషన్‌లో 7 మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తామన్నారు. పూర్తి వివరాలకు 9959225778కు కాల్ చేయాలన్నారు.

News November 29, 2025

ప్రొద్దుటూరు: పెరిగిన బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరలు పెరిగాయి.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.12,700
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.11,684
* వెండి 10 గ్రాములు ధర రూ.1,730.
శుక్రవారం బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.12,590 ఉండగా, నేడు రూ.12,700, 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.11,583 ఉండగా, నేడు రూ.11,684, వెండి 10 గ్రాములు ధర రూ.1,680, నేడు రూ.1,730కు పెరిగింది.