India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ అందజేశారు.
1)SSSV కృష్ణారావు, అడిషనల్ SP ఏఆర్ కడప
2. ఎం అరుణాచలం, ఏఎస్ఐ, కడప ట్రాఫిక్ పిఎస్
3. కె ఆనంద్, హెచ్సి 2008, సిద్దవటం పిఎస్
4. సి శ్రీనివాసులు, పీసీ 1233, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పిఎస్
5. కె విజయలక్ష్మి, డిసిఆర్బి, కడప
మైదుకూరు పట్టణానికి చెందిన కృష్ణ చైతన్య యాదవ్ రూ.56 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించినట్లు తండ్రి కృష్ణయ్య పేర్కొన్నారు. మైక్రో సాప్ట్ వేర్ కంపెనీ నందు భారీ వేతనంతో ఉద్యోగం పొందినట్లు చెప్పారు. కృష్ణ చైతన్య ఐఐటీ ఢిల్లీ నందు విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు చెప్పారు. అత్యధిక వేతనంతో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు, బంధువులు
పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో కరోనా వారియర్గా పేరు పొందిన పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లెకు చెందిన ఓబులాపురం రాజశేఖర్ను డాక్టరేట్ వరించింది. కరోనా సమయంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన రాజశేఖర్కు ఇంటర్నేషనల్ ఫేస్ యూనివర్సిటీ జర్మనీ వారు పాండిచ్చేరిలో ఈ అవార్డు అందజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రాజశేఖర్ ఆటో తోలుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని గ్రామస్థులు కొనియాడారు.
స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించిన సమరయోధులలో బాల ఎల్లారెడ్డి(103) ఒకరు. చెన్నూరుకు చెందిన ఆయన 1921 జనవరిలో జన్మించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా బాలయల్లారెడ్డి కొండపేట వంతెనను కూల్చేశారు. జిల్లాలో 15 మంది స్వాతంత్ర సమరయోధులు జైలు జీవితాలు గడపగా వారిలో ఇప్పటికే 14 మంది మృతిచెందారు. శతాధిక వయసులో ఉన్న బాల ఎల్లారెడ్డి ప్రస్తుతం చెన్నూరులో జీవిస్తున్నారు.
సెలవుల నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి రాకపోకలకు జిల్లా ఆర్టీసీ అధికారులు 36 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆరు డిపోల నుంచి కేవలం బెంగళూరుకు 30 బస్సులు, హైదరాబాదుకు 3, చెన్నైకు 3 బస్సుల చొప్పున ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, ఆ మేరకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు.
కడప జిల్లాలో మహాత్మా గాంధీ 3 సార్లు పర్యటించి ప్రజలకు పోరాట స్ఫూర్తినిచ్చారు. కరణం కె.సుబ్రహ్మణ్యం పన్ను చెల్లించవద్దని చెప్పినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బాలయల్లారెడ్డి వంతెనను కూల్చేస్తే, ఉద్యమం కోసం బంగారాన్ని తృణప్రాయంగా ఇచ్చేశారు అచ్చమ్మ. తొలి రాజకీయ ఖైదీగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు జైలు కెళ్లారు. ఇలా ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు పోరాడిన నేల మన కడప జిల్లా.
జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించిందని డ్వామా ఇన్ఛార్జ్ పీడీ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,17,227 మంది ఉపాధి కూలీలకు గాను 29.73 లక్షల పని దినాలకు సంబంధించి రూ 77.29 కోట్ల వేతన బకాయిలు కూలీలకు అందాల్సి ఉండగా మొత్తం చెల్లింపు చేసినట్లు తెలిపారు.
కర్నూల్ రేంజ్ పరిధిలో ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా
☛ సి. శంకర్ రెడ్డిని వీఆర్ కడపకు
☛ జి. జీవన్ గంగానాథ్ బాబు – పులివెందుల యూపీఎస్
☛ ఎన్. వెంకటరమణ – పులివెందుల రూరల్
☛ జి. వెంకటేశ్వర్లు – కడప తాలూకా
☛ ఎన్.వి నాగరాజు – రాజంపేటకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ప్రజలకు సూచించారు. కడప పోలీస్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్ని సచివాలయాలలో జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశించారు.
కడప నగరంలో ప్రసిద్ధిగాంచిన అమీన్ పీర్ పెద్ద దర్గాను ప్రముఖ నది కొణిదెల నిహారిక దర్శించుకున్నారు. నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్లు చిత్ర విజయోత్సవ ర్యాలీలో భాగంగా కడపకు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్తో కలిసి కొణిదెల నిహారిక దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రత్యేక విశిష్టతను నిహారికకు ప్రతినిధులు వివరించారు.
Sorry, no posts matched your criteria.