India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడపలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 26 వరకు ఉందని ప్రన్సిపల్ రత్నరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 26న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8555958200 నంబర్కు సంప్రదించవచ్చని సూచించారు.

కడప జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేసే 81 మంది మల్టీ పర్పస్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (MPEO)లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రనాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పని సర్దుబాటు కోసం బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరిని ఒక మండలం నుంచి మరొక మండలానికి, మరి కొందరిని ఒక డివిజన్ నుంచి వేరే డివిజన్ కు బదిలీ చేశారు. వీరు గ్రామాల్లో రైతులకు సహాయంగా RSKల్లో ఉంటారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య సన్నిధిలో తిరుమల శ్రీవారి దేవస్థానం ఆధ్వర్యంలో 200 శ్రీవారి లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉన్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. నేడు ఉదయం 7:30 గంటల నుంచి లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున విక్రయిస్తారన్నారు.

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77,475 హెక్టార్లు కాగా, 16,528 హెక్టార్లలోనే పంటల సాగు జరిగింది. వరి 7,116.27, జొన్న 48.08, మొక్క జొన్న 1,843.21, రాగి 10.5, కొర్ర 11.6, బాజ్ర 710 హెక్టార్లలో సాగు చేశారు. కంది 369.8, మినుములు 1,503.09, పెసలు 11.13 హెక్టార్లలో సాగు జరిగింది. వేరుశనగ 998.88, పొద్దుతిరుగుడు 225.7, కుసుమ 43.2, సోయాబీన్ 47, చెరకు 16, ఇతర పంటలు 10 హెక్టార్లలో సాగు చేశారు.

కడప జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి.
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
➤NOTE: అప్లికేషన్లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది.
➤ఇలా ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకుని పర్మీషన్ పొందండి.

జిల్లాలోని అన్ని మండలాలలో సెంట్రలైజేడ్ స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సెంట్రలైజేడ్ స్మార్ట్ కిచెన్ల గురించి అధికారులతో సమీక్ష చేశారు. ఇప్పటికే కడపలో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు.

కడప జిల్లాలో 25 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) పేదరిక నిర్మూలన కోసం కృషిచేస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం రాత్రి DRDA సమీక్షలో..
26,965 స్వయం సహాయక సంఘాల ద్వారా 2.62 లక్షల మంది మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారన్నారు. వివిధ రంగాల్లో జీవనోపాధి పొందుతూ సాధికారత దిశగా అడుగులేస్తున్నారని అన్నారు. అధికశాతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారన్నారు.

గ్రామాల్లో సుస్థిర, జీవనోపాధులను నెలకొల్పేందుకు రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చేలా, రైతు ఉత్పత్తి సంస్థలు స్వయంసహాయక సంఘాలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో DRDA PD రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

25 కేసుల్లో నిందితునిగా ఉన్న రిమాండ్ ఖైదీ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు సబ్ జైలునుంచి తప్పించుకు పోవడంపై జైలు సిబ్బందికి ఉన్నతాధికారులు చార్జ్ మెమోలు జారీ చేశారు. ఖైదీ పరారీ సమయంలో విధుల్లో ఉన్న ఇన్ఛార్జ్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు జైలు సిబ్బందికి చార్జ్ మెమోలు ఇచ్చారు. ఈనెల 16న పరారైన రఫీ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు.

కడప జిల్లాలో వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను అక్రమంగా విక్రయించడం, పరిశ్రమలకు మళ్లిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టెక్నికల్ గ్రేడ్ యూరియా (TGU)ని పరిశ్రమల అవసరాలకు మళ్లిస్తున్నారన్న విషయమై వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో JDA నాయక్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.