Y.S.R. Cuddapah

News March 19, 2026

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: కడప SP

image

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని SP నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్ల పరిధిలో నేరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 19, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 259 మంది విద్యార్థులు డుమ్మా.!

image

కడప జిల్లాలో బుధవారం సెకండ్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ -2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. నేడు జరిగిన పరీక్షలకు 12,145 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 11,886 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 98% విద్యార్థులు పరీక్షలు రాశారు. 259 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు.

News March 19, 2026

వీరశివారెడ్డి బీజేపీలో చేరిక సాధ్యమేనా..?

image

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు పదేపదే ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ముహూర్తం ఖరారు కాలేదు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ మద్దతు తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొందరు నేతలు ఆయన చేరికను అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో వీరశివారెడ్డి కమలం గూటికి చేరడం సాధ్యమవుతుందో లేదోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

News March 19, 2026

వీరశివారెడ్డి బీజేపీలో చేరిక సాధ్యమేనా..?

image

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు పదేపదే ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ముహూర్తం ఖరారు కాలేదు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ మద్దతు తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొందరు నేతలు ఆయన చేరికను అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో వీరశివారెడ్డి కమలం గూటికి చేరడం సాధ్యమవుతుందో లేదోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

News March 18, 2026

కడప: పిడుగు పడి ఒకరి మృతి

image

కడప జిల్లా కాశినాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈక్రమంలో ఆయన చనిపోయారు. కుటుంబ పెద్ద కన్నుమూయడంతో బంధువులు బోరున విలపించారు.

News March 18, 2026

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: ఎస్పీ

image

జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్ల పరిధిలో నేరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 18, 2026

కడప జిల్లాలో ఓపెన్ 10th పరీక్షలు.. 387 మంది డుమ్మా..!

image

జిల్లాలో బుధవారం 31 కేంద్రాల్లో ఓపెన్ టెన్త్ పరీక్షలు నిర్వహించారు. నేడు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం 2,356 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 1,969 మంది మాత్రమే పరీక్ష రాశారు. 387 మంది విద్యార్థులు పరీక్షకు డుమ్మా కొట్టినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కడప మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాల కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

News March 18, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,530
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ. 14,288
*వెండి 10 గ్రాముల ధర రూ.2,575

News March 18, 2026

కడప జిల్లాలో రైతుల నుంచి వసూళ్లు ఎంత..?

image

కడప జిల్లాలో రైతుల నుంచి MSPతో పంటల కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5,732 మంది శనగ రైతులు వీటిలో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 3,143 మంది రైతుల నుంచి 13,078.5 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశారు. బస్తాకు రూ.150 – రూ.200లు మామూళ్లు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రూ.3, 4 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News March 18, 2026

కడపలో నేడు మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్

image

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కడపలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు జరగనుంది. కాగా ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం గురువులు పాల్గొంటారన్నారు.