India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప పార్లమెంటులోని ప్రజలకు అధిష్ఠానం ఐవీఆర్ సర్వే ద్వారా ఫోన్లు చేస్తోంది. సర్వేలో ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డితో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించగా.. వీరశివారెడ్డి వైపే మొగ్గుచూపినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక్కడినుంచి వాసు టికెట్ ఆశిస్తుండగా ఎవరికి దక్కుతుందో చూడాలి

అప్పుల బాధ తాళలేక పోరుమామిళ్ల మండలం బాలరెడ్డిపల్లికు చెందిన బాలకృష్ణ(35) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బాలకృష్ణ నాలుగు ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆశించిన మేర దిగుబడి రాకపోగా, తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రైతు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. పీటీఎం మండలం చండ్రాయునిపల్లి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే సహచరులు ఏఎస్ఐని 108లో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.

ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి తాను, తన అనుచరులు సహకరించబోమని కొత్తపల్లె గ్రామపంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎమ్మెల్యే చిచ్చు పెట్టాలని చూస్తున్నాడని, ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇవ్వమని, ప్రచారం చేయమని స్పష్టం చేశారు. త్వరలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు నడుచుకుంటానని తెలిపారు.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2024 ఫలితాలలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆర్కేవ్యాలీ IIIT పూర్వ విద్యార్థిని ( R17 బ్యాచ్) ఎస్. నవ్య ఉత్తమ ప్రతిభతో సత్తా చాటింది. 39.67 మార్కులతో రాణించి ఆల్ ఇండియా 538వ ర్యాంకు (AIR-538) కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఎంఎంఈ హెచ్ఓడీ జిలాని, అధ్యాపకులు రమేశ్, అంజిబాబు, విజయ్, అనూష, వెంకీ తదితరులు అభినందించారు.

2024 ఎన్నికల నగారా మోగింది. అటు కూటమి, ఇటు YCP అభ్యర్థుల ప్రకటలను చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఈ సారి రాష్ట్రంలో చాలా మార్పులు చేశారు. కానీ.. వైఎస్ఆర్ జిల్లాలోనే ఎటువంటి మార్పులు లేవు. 2019 ఎన్నికల్లో నిలబడ్డ వారే ఇప్పుడు కూడా నిలబడుతున్నారు. TDP ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో మాధవిరెడ్డి, బీటెక్ రవి, పుత్తా చైతన్య రెడ్డి కొత్తగా బరిలో నిలబడుతున్నారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.

ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ 6 స్థానాలను ఇప్పటికే ప్రకటించగా, వైసీపీ శనివారం అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్పష్టత వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారమే తరువాయి. బద్వేలు, రాజంపేట, కోడూరు, జమ్మలమడుగు స్థానాల్లో TDPతో పొత్తులో ఉన్న జనసేన, బీజేపీకి ఏ సీట్లు వెళ్తాయో చూడాలి. ఏదేమైనా జిల్లాలో పూర్తి స్పష్టతతో పార్టీలు దూసుకుపోతున్నాయి.

లక్కిరెడ్డిపల్లె మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుర్నూతల పంచాయతీ బొమ్మేపల్లికి చెందిన యోగానందరెడ్డి భార్య రమణమ్మ (32)ను ఆదివారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. అనంతరం లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో యోగానందరెడ్డి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ గంగానాధ బాబు, ఎస్ఐ విష్ణువర్ధన్ క్లూస్ టీంతో మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాశినాయన మండలంలోని నరసాపురంలో అనుమానాస్పద స్థితిలో సాధువు ఆదివారం మృతి చెందడం స్థానికులు గుర్తించారు. నరసాపురం సమీపంలోని అంకాలమ్మ రాతి శిలల సమీపంలో కత్తితో పొడుచుకొని సాధువు మృతిచెందినట్లు స్థానికులు చెప్తున్నారు. జ్యోతి క్షేత్రంలో ఉండే సాధువు శనివారం నరసాపురం ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చూపించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కడప జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులపై అందరి దృష్టి ఉంది. కారణం వారు 9వ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వారే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి. ఇద్దరికీ 40 ఏళ్ల పై చిలుకు రాజకీయ అనుభవం ఉంది. వరద 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 3 సార్లు ఓడారు. రఘురామిరెడ్డి 4 సార్లు గెలిచి, 4 ఓడారు. ఇప్పడు వీరిద్దరు 9వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోసారి వీరు గెలిచి చరిత్ర సృష్టిస్తారా?
Sorry, no posts matched your criteria.