India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుంచి తక్షణం తొలగించి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ డిమాండ్ చేశారు. మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డీటీసి చంద్రశేఖర్కు వ్యతిరేకంగా కడప ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడటం దారుణమన్నారు.
కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై డీటీసీ చంద్రశేఖర్ వేధింపుల పట్ల అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, జాయింట్ రవాణా కమిషనర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో శుక్రవారం కడప రవాణా శాఖ కార్యాలయంలో స్వయంగా బాధిత మహిళా ఉద్యోగితో మాట్లాడారు. అనంతరం ఘటనపై ప్రత్యేకంగా విచారించారు. కార్యాలయంలోని సీసీ కెమెరాలు స్వయంగా పరిశీలించి డీటీసీ చంద్రశేఖర్పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కడప జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మహిళా ఉద్యోగులకు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిర్లక్ష్యంగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. అతడిపై శాఖ పరమైన విచారణకు ఆదేశించారు.
కడప నగరంలో బుధవారం శ్రీరామ మహా శోభాయాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం పాలకొండల్లో భక్తులు అఖండ విజయజ్యోతిని వెలిగించారు. అయోధ్య ఐక్యవేదిక కమిటీతోపాటు, పుష్పగిరి తీర్థ క్షేత్ర పరిరక్షణ కమిటీలతో పాలకొండల దిగువన ఆర్చీ వద్ద కొండపై ప్రత్యేకంగా చదును చేసిన ప్రాంతంలో 250 మీటర్ల వస్త్రాన్ని 50 లీటర్ల నేతిలో తడిపి చుట్టలుగా చుట్టి శివలింగం ఆకారానికి తెచ్చారు.
కోడి తెచ్చిన తంటా ఘటన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మలమడుగు(M), పొన్నతోటలో ఉండే నాగలక్ష్మమ్మ చెట్టుపై పక్కింటి కోళ్లు వచ్చి పెంట వేస్తున్నాయని రోషమ్మకు చెప్పింది. దీంతో రోషమ్మ కుటుంబ సభ్యులతో నాగలక్ష్మమ్మ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో నాగలక్ష్మమ్మ, భర్త, కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్చారు. ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ శుక్రవారం బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు పోలీస్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు ఎస్పీలను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడప ఎస్పీగా అశోక్ కుమార్ను నియమించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కడప ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు, వేదాలు వల్లించినట్లుందని రాష్ట్రమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామాపురం మండలం రాచపల్లి పంచాయతీలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మంగళవారం అధికారులు చట్టబద్ధంగా తొలగించడం జరిగిందన్నారు. దీనిని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అక్రమ నిర్మాణాల తొలగింపు అంటూ అడ్డుకోవడం బాధాకరమన్నారు.
పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యురేనియం ప్రాజెక్ట్ నుంచి వెలువడుతున్న వ్యర్థాల నుంచి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అలాగే భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పునరావాసం, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు. యురేనియం బాధితులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
కడప శివార్లలోని సెంట్రల్ జైలు సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ రిమ్స్కు తరలించారు. రిమ్స్ వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందారని నిర్ధారించారు. రామాంజనేయపురం పరిధిలోని శ్రీరామనగర్కు చెందిన పడిగ ప్రవీణ్, వి. సుభాశ్లుగా గుర్తించారు.
కడప జయనగర్ కాలనీ జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో గురువారం సాయంత్రం 4 గంటలకు జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ బాలబాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి తెలిపారు. 01-01-2002వ తేదీకి ముందు పుట్టిన క్రీడాకారులు ఎంపికలకు అర్హులన్నారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు విజయవాడలో ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు.
Sorry, no posts matched your criteria.