India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో సోమవారం నుంచి 10th పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు మానసిక ప్రశాంతతో, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని DEO శంషుద్దీన్ సూచించారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

కడప జిల్లాలో సోమవారం నుంచి 10th పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు మానసిక ప్రశాంతతో, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని DEO శంషుద్దీన్ సూచించారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

కడప జిల్లాలో శుక్రవారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. నేడు జరిగిన బయాలజీ, కామర్స్ పరీక్షలకు 2,864 మంది విద్యార్థులు హాజరయ్యారు. బయాలజీ పరీక్ష 1,199 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 1,049 మంది రాశారు. 150 మంది ఆబ్సెంట్ అయ్యారు. కామర్స్ పరీక్షలకు 1,977 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 1,815 మంది హాజరయ్యారు. 162 మంది పరీక్షలు రాయలేదు. రోజులాగే ఈరోజు చూచిరాతలు జరిగాయి.

కడప జిల్లాలో శుక్రవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ ఫిజిక్స్ పేపర్-2 పరీక్షలు జరిగాయి. నేడు 12,141 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 11,865 మంది హాజరయ్యారు. 276 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కడప జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని శాఖల సహకారంతో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO శంషుద్దీన్ తెలిపారు. జిల్లాలో 28,152 మంది విద్యార్థులకు 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,783 మంది ఇన్విజిలేటర్లు, 167 మంది చీప్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 7 ఫ్లయింగ్, 30 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. 9 సమస్యాత్మక సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

కడప జిల్లా వ్యాప్తంగా రేపు (మార్చి 14) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని కోర్టుల్లో ఈ లోక్ అదాలత్ జరుగుతుందనీ, జిల్లాలో మొత్తం 23 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందేందుకు జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని కోరారు.

పొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,780
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,518
*వెండి 10 గ్రాముల ధర రూ.2,665

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలిగా జీవనం సాగిస్తున్నాడు.
Sorry, no posts matched your criteria.