India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖాజీపేటలోని పలు హోటళ్లపై V&E, సివిల్ సప్లై అధికారులు ఆదివారం అకస్మిక దాడులు చేపట్టారు. గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని 6 కేసులు నమోదు చేసి, 16 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని, భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.

ఖాజీపేటలోని పలు హోటళ్లపై V&E, సివిల్ సప్లై అధికారులు ఆదివారం అకస్మిక దాడులు చేపట్టారు. గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని 6 కేసులు నమోదు చేసి, 16 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని, భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.

బద్వేల్లోని హోటళ్లపై ఆదివారం కడప జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, బద్వేల్ ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు మైదుకూరు రోడ్ పరిసర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. పలువురు నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 7 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో నిందితులు చెప్పింది వినడమే CBI పనా?, సొంతంగా ఆలోచించదా..? అని ఆయన కుమార్తె YS సునీత ప్రశ్నించారు. పులివెందులలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. నేను రాత్రింబవళ్లు కష్టపడితే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. వివేకా హత్య విషయంలో ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలని, దీనిపై పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు.

ఈనెల 16 నుంచి ఏప్రిల్ 20 వరకు జిల్లాలో ప్రతి గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్.ఏ.శ్రీనివాసులు తెలిపారు. కడప జిల్లాకు 3 లక్షల డోసులను కేటాయించామన్నారు. పాడి పశువుల యాజమానులందరూ పశువైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. గాలి కుంటు వ్యాధి సోకుతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కడప జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న 10th పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.

కడప జిల్లాలో రెగ్యులర్, ఓపెన్ 10th పరీక్షలు ఒకే చోట నిర్వహిస్తుండడంతో రెగ్యులర్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ 10th పరీక్షలకు 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడే 31 చోట్ల ఓపెన్ 10th సెంటర్లు ఏర్పాటు చేశారు. రెగ్యులర్, ఓపెన్ 10th పరీక్షలు పక్కపక్క గదుల్లోనే జరగనున్నాయి. చూచిరాతల ఓపెన్ పరీక్షలతో, చదివిరాసే రెగ్యులర్ విద్యార్థులు డిస్టర్బ్ అవుతారు.

కడప జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనల పాటించని 282 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి రూ.58,340లు జరిమానాగా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలిపారు.

జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.97.17 కోట్లు పేరుకు పోయాయి. 2 వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల వారీగా బకాయిలు ఇలా (రూ.కోట్లలో) ఉన్నాయి. *KDP – రూ.62.93 *PDTR – రూ.20.14 *PLVD – రూ.4.58 *జమ్మలమడుగు – రూ.2.49
*ఎర్రగుంట్ల – రూ.3.20 *మైదుకూరు – రూ.3.09 *కమలాపురం – రూ.0.74కోట్లు.

జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజన్ అధికారి భవన అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. LPG పంపిణి సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా చేయాలన్నారు. అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.