Y.S.R. Cuddapah

News August 3, 2024

ప్రొద్దుటూరు: టీడీపీలో చేరిన మరో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు

image

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని మరో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు శనివారం టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన 16వ వార్డ్ కౌన్సిలర్ మోపురి రేవతి, 21వ వార్డు కౌన్సిలర్ కొవ్వూరు స్వాతి, 36 వార్డు కౌన్సిలర్ అలవలపాటి అరుణలకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం <<13763825>>నలుగురు వైసీపీ కౌన్సిలర్లు<<>> టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

News August 3, 2024

ఆర్థిక ప్రణాళికతో సంపద సృష్టిపై జాతీయ సదస్సు

image

ఆర్థిక ప్రణాళికతో సంపద సృష్టిపై జాతీయ వెబినార్ ఈనెల 5వ తేదీన వైవీయూ కామర్స్ శాఖ, అసోషియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నది. వైవీయూలో వీసీ ప్రొ కె కృష్ణారెడ్డి, వెబినార్ కన్వీనర్, రిజిష్ట్రార్ ప్రొ ఎస్ రఘునాథరెడ్డి వెబినార్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వెబినార్ పాల్గొనే వారికి రిజిస్ట్రేషన్ రుసుము లేదని, ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.

News August 3, 2024

ఎర్రగుంట్లలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నాగేంద్ర నగర్‌కు చెందిన లింగాల వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ఎర్రగుంట్ల లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం వెంటకరామిరెడ్డి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడాన్ని స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా అప్పుల విషయంపై జరుగుతున్న తగాదాలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

News August 3, 2024

ఆర్టీపీపీలో క్రేన్ ఢీకొని కాంట్రాక్టు లేబర్ వ్యక్తి మృతి

image

ఎర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీలో శుక్రవారం సాయంత్రం క్రేన్ ఢీకొని, ముద్దనూరు చెందిన ఖాదర్ బాషా(49) అనే కాంట్రాక్ట్ లేబర్ తీవ్రంగా గాయపడి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు శనివారం ఉదయం నుంచి ఆర్టీపీపీలో ఆందోళన చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

News August 3, 2024

వేంపల్లి: IIIT కౌన్సెలింగ్ లిస్ట్ విడుదల.. టైమింగ్స్ ఇవే.!

image

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యా సంవత్సర ప్రవేశాలకు తొలి విడత కౌన్సెలింగ్ లో 3396 సీట్లు భర్తీ అయ్యాయి. తొలి విడతలో అడ్మిషన్లు పొంది క్యాంపస్ మార్పుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు లిస్టు, మిగిలిన సీట్ల భర్తీకి ఎంపిక చేసిన విద్యార్థుల సెకండ్ లిస్ట్ నేటి మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. కాగా లిస్టులను ఆర్జీయూకేటీ వెబ్సైట్ ‘www.rgukt.in’లో పొందుపరుస్తారని అధికారులు తెలిపారు.

News August 3, 2024

కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ

image

పెన్షన్ల పంపిణీలో అలసత్వం వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సచివాలయ సిబ్బంది ఉదయం 8 గంటల వరకు పింఛన్లు పంపిణీ ప్రారంభించలేదనే ఆరోపణతో, పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై కారణం తెలపాలంటూ ఆయా మండలాల MPDOలకు ZP సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 166 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్ల ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నోటీసుల్లో పాల్గొన్నారు.

News August 3, 2024

కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ

image

పెన్షన్ల పంపిణీనీలో అలసత్వం వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సచివాలయ సిబ్బంది ఉదయం 8 గంటల వరకు పింఛన్లు పంపిణీ ప్రారంభించలేదనే ఆరోపణతో, పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై కారణం తెలపాలంటూ ఆయా మండలాల MPDOలకు ZP సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 166 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్ల ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నోటీసుల్లో పాల్గొన్నారు.

News August 3, 2024

కడప జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం

image

జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక మోస్తరు వర్షం కురిసింది. సిద్ధవటంలో అత్యధికంగా 6.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బి కోడూరులో 1.8 మిల్లీమీటర్లు, బద్వేలులో 1.2 మిల్లీమీటర్లు, ప్రొద్దుటూరులో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో ఈ ప్రాంతాల్లో పంటలు సాగుచేసిన కాస్త ఊరట కలిగింది.

News August 3, 2024

కడప: కరెంట్ షాక్‌తో.. బాలుడు మృతి

image

ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ షాక్ కొట్టి మూడేళ్ల బాలుడు చనిపోయిన విషాద ఘటన పుల్లంపేట మండలం దలవాయిపల్లెలో చోటు చేసుకుంది. బిందుప్రియకు మూడేళ్ల కుమారుడు జాన్ వెస్లిన్ ఉన్నాడు. తల్లి శుక్రవారం వేడినీటి కోసం బాత్రూంలోని బకెట్‌లో వాటర్ హీటర్‌ను ఉంచి ఆన్ చేసింది. తల్లి ఇంట్లో పని చేసుకుంటుండగా ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన బాలుడు దానిని తాకాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.

News August 3, 2024

జిల్లాలో చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ఉత్పత్తి అయ్యే చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో చేనేత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైలవరం మండలం టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.