India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నందలూరులో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకకు చెందిన టీడీపీ నేత కొమ్మినేని ప్రసాద్ (46) గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు, క్షత్రియ సంఘం రాష్ట్ర డైరెక్టర్ ప్రతాప్ రాజు మంచి కార్యకర్తను కోల్పోయామన్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కడప నుంచి గండికోట వెళ్తుండగా ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరికీ అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తూ ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా విచారించి సత్వరమే న్యాయం చేయాలన్నారు.
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాలయానికి సోమవారం తిరుమల శ్రీవారి లడ్డూలు వచ్చాయి. తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో వచ్చిన 1500 లడ్డులను సిబ్బంది ఆలయంలోనికి తీసుకువెళ్లారు. గతంలో రెండవ శనివారం, నాలుగవ శనివారం ఇచ్చే లడ్డూలు, గత కొన్ని నెలలుగా ప్రతిరోజు ఇస్తున్న విషయం తెలిసిందే.
కడప జిల్లాలోని హోం గార్డ్స్ సిబ్బంది విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని జిల్లా ఎస్.పిఅశోక్ కుమార్ సూచించారు. జిల్లాలోని హోం గార్డు ఇతర సిబ్బందికి కడప జిల్లా పోలీస్ మైదానంలో రెండు వారాల మొబిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హోం గార్డ్గా చేరకముందు తీసుకున్న శిక్షణను మరోసారి గుర్తు చేసుకుంటూ మొబలైజేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేడుక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆ తర్వాత సభా భవనంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండలాలు మున్సిపల్ కార్యాలయంలో కూడా ప్రజల అర్జీలను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.
కడప నగరంలో యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఎర్రముక్కపల్లి సమీపంలోని చికెన్ అంగడి యజమాని అస్లాం వద్ద ఇర్ఫాన్, ఖలీల్ పనిచేస్తున్నారు. ఖలీల్, ఇర్ఫాన్పై చాడీలు చెప్పడంతో యజమాని ఇర్ఫాన్ను పనిలో నుంచి తీసేశాడు. దీంతో ఆగ్రహించిన ఇర్ఫాన్ ఖలీల్పై కత్తితో శనివారం దాడి చేశాడు. గాయపడిన ఖలీల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖలీల్ ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
కడప బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి భార్యను కిరాతగంగా భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. బెల్లంమండి వీధిలో నివాసముండే జమీల భాను(32) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. కాగా నిందితుడికి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. కడపలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు సిబ్బందికి పలు కీలకమైన సూచనలు చేశారు. అంతకుముందు శిక్షణా కేంద్రంలో ఆయన మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
ప్రొద్దుటూరు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పిన నల్లబోతుల కుల్లాయప్పపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.