India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిషోర్ను VRకు పంపినట్లు SI సుహాన్ తెలిపారు. కిషోర్ కలసపాడు PSలో కోర్ట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో విఆర్కు పంపినట్లు కలసపాడు ఎస్సై వివరించారు.

మహిళా సాధికారతలో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ మహిళలకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారిత కోసం మొదటి సారిగా 1995-96లో CM చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో 40వేల సంఘాలు ఉన్నాయన్నారు.

మహిళా సాధికారతలో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ మహిళలకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారిత కోసం మొదటి సారిగా 1995-96లో CM చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో 40వేల సంఘాలు ఉన్నాయన్నారు.

మహిళా సాధికారతలో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ మహిళలకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారిత కోసం మొదటి సారిగా 1995-96లో CM చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో 40వేల సంఘాలు ఉన్నాయన్నారు.

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని శ్రీ చరణి నిరూపించారు. కడప జిల్లా VN పల్లె మండలంలో కుగ్రామమైన ఎర్రమల పల్లె గ్రామ కీర్తిని ఆమె జాతీయస్థాయికి తీసుకువెళ్లింది. పట్టుదలతో శ్రమించి తన అసాధారణమైన ప్రతిభతో భారత క్రికెట్ జట్టులో స్థానాన్ని సంపాదించి, మన దేశం ప్రపంచ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించి, పలువురి ప్రశంసలు అందుకుంది. ఆమె పట్టుదల నేటి మహిళలకు స్ఫూర్తి దాయకమని చెప్పవచ్చు.
#HAPPY WOMENS DAY

కడప జిల్లాలో ప్రవేట్ విద్యుత్ సర్వీసుల నుంచి ఇప్పటి వరకు రూ.26.46 కోట్లు బకాయిలు ఉన్నాయి. డివిజన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
కడపలో రూ.8.99 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.10.61 కోట్లు, మైదుకూరులో రూ.7.10 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇక పులివెందుల డివిజన్ పరిధిలో మాత్రం కొన్ని ప్రవేట్ కంపెనీలు అడ్వాన్స్ చెల్లింపులు చేయడంతో ఇక్కడ రూ.24.85 లక్షలు మిగులు ఉన్నాయి.

కడప జిల్లాలో 32 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో ఇన్విజిలేటర్లు చూచిరాత రాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు స్టడీ సెంటర్ల నిర్వాహకులు సంబంధిత అధికారులకు, ఇన్విజిలేటర్లకు, బందోబస్తు పోలీసులకు పెద్ద మొత్తంలో మామూళ్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకుంటామని DEO తెలిపారు.

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం రామచంద్రపురం పరిధిలో టిప్పర్ స్కూటర్ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్రెడ్డిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కడప జిల్లాలో శనివారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరిగాయి. నేడు జరిగిన కెమిస్ట్రీ, ఎకనామిక్స్ పరీక్షలకు 5,411 మంది విద్యార్థులు హాజరయ్యారు. కెమిస్ట్రీ పరీక్షలు 3,764 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 3,383 మంది రాశారు. 381 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఎకనామిక్స్ పరీక్షలు 2,257 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 2,028 మంది హాజరయ్యారు. అయితే 229 మంది గైర్హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.