Y.S.R. Cuddapah

News March 11, 2026

వైవీయూ విద్యార్థి రేగులపాటి పునీత్ చిత్రానికి అవార్డ్

image

వైవీయు బీఎఫ్‌ఏ విద్యార్థి రేగులపాటి పునీత్ మెరిట్ అవార్డ్ సాధించారు. తమిళనాడులోని శ్రీ దర్శినికలై కోడం ఆర్ట్ కాలేజీ నిర్వహించిన 21వ జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో పునీత్ ఆక్రిలిక్ రంగుతో గీసిన “గ్రామీణ మహిళ “ చిత్రం ఎంపికయ్యింది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు చెన్నై లలితకళా అకాడమీ ఆర్ట్ గ్యాలరీలో చిత్రాన్ని ప్రదర్శిస్తారని ఫైన్ ఆర్ట్స్ హెడ్ మృత్యుంజయ రావు తెలిపారు.

News March 11, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,930
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,656
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720

News March 11, 2026

నేటి ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది హాజరు

image

కడప జిల్లాలో బుధవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 2,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి గణితం పరీక్ష 2,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,624 మంది పరీక్షలు రాశారు. 222 మంది ఆబ్సెంట్ అయ్యారు. హిస్టరీ పరీక్షకు 276 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 246 మంది వచ్చారు. 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.

News March 11, 2026

కడప: ఇంటర్ పరీక్షలకు 91% విద్యార్థులు హాజరు..!

image

కడప జిల్లాలో బుధవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ కామర్స్, సోషియాలజీ పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 2,723(91%) మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,987 మంది విద్యార్థులకు గాను.. 2,723 మంది పరీక్షలు రాశారు. జనరల్ విద్యార్థుల్లో 2,207 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,083 మంది రాశారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 780 మందికి గాను.. 640 మంది హాజరయ్యారు.

News March 11, 2026

కడప జిల్లా: ఒక్కరోజులో 274 కేసులు.!

image

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ షెల్కే నచికేత్ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు మీరిన వారిపై 274 కేసులు నమోదు చేసి రూ.56,615 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

News March 11, 2026

కడప: రైతు కష్టం.. AMCలకు ఆదాయం పంట..!

image

రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై కడప జిల్లా AMCలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవని నాటికి రూ.11.78 కోట్లు లభించింది. పంటల వారీగా AMCలకు లభించిన ఆదాయం రూ.లక్షల్లో ఇలా. వరి-194, బియ్యం-52, వేరుశనగ-43, ప్రొద్దుతిరుగుడు-3, పత్తి-117, ఉల్లి-17, పప్పుశనగ-86, కందులు-3, బత్తాయి-14,, పసుపు-99, మినుములు-98, నువ్వులు-,96, మొక్కజొన్న-62, జొన్న-16, పప్పుదినుసులు-12, అరటి-21, ఇతర పంటలు-239 లక్షలు.

News March 11, 2026

నిబంధనలు పాటించని వారిపై 274 కేసులు నమోదు: కడప ఎస్పీ

image

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ షెల్కే నచికేత్ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు మీరిన వారిపై 274 కేసులు నమోదు చేసి రూ.56,615 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

News March 11, 2026

నిబంధనలు పాటించని వారిపై 274 కేసులు నమోదు: కడప ఎస్పీ

image

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ షెల్కే నచికేత్ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు మీరిన వారిపై 274 కేసులు నమోదు చేసి రూ.56,615 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

News March 10, 2026

కడప జిల్లాలోని మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

image

కడప కార్పొరేషన్ సహా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. వీటికి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో 284 జారీ చేసింది. కడపకు కలెక్టర్, ప్రొద్దుటూరుకు జాయింట్ కలెక్టర్, మిగతా ఐదు పట్టణాలకు ఆర్డీవోలు స్పెషల్ ఆఫీసర్లుగా ఆరు నెలల పాటు విధుల్లో ఉండనున్నారు.

News March 10, 2026

కడప: ఇంటర్ పిజిక్స్ పరీక్షలకు 13,755 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో మంగళవారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ పిజిక్స్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 13,755(96%) మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 13,131 మందికి గాను.. 12,741 మంది హాజరయ్యారు. 390 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,210 మందికి గాను.. 1,014 మంది పరీక్షలు రాశారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.