India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చారిత్రక, పర్యటక, దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పర్యాటక రంగం ప్రధాన భూమిక పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో JC, టూరిజం అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక పోలీస్ విభాగాల అధికారులతో ఎస్పీ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫ్యాక్షన్ జోన్, DCRB, DTRB, SBI, SCST సెల్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, కోర్ట్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు.

కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, డీసీఎంఎస్ను ఏజెన్సీగా నియమించుకుంది. డీసీఎంఎస్ వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21మంది ప్రవేట్ వారిని ఇన్ఛార్జ్లుగా పెట్టారు. వీరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా YVU నిర్వహించే అన్ని పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చని వర్సిటీ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. వాటికి సంబంధించిన పోస్టర్లను కులసచివులు పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.ఎస్.వి కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు. వి.సి మాట్లాడుతూ.. ప్రభుత్వం వాట్సాప్(9552300009) ఇంటిగ్రేటెడ్ సేవల ద్వారా ఫలితాలు వెంటనే సెల్లో పొందవచ్చన్నారు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు YCP పరిశీలకులను నియమించింది. వారి వివరాలు:
☞ మైదుకూరు- వాకమళ్ల రాజగోపాల్ రెడ్డి ☞ బద్వేలు- దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి
☞ కడప-సింగసాని గురుమోహన్ ☞పులివెందుల-కల్లూరి నాగేంద్రరెడ్డి ☞ కమలాపురం-రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ☞ ప్రొద్దుటూరు- పూల శ్రీనివాసులురెడ్డి ☞ జమ్మలమడుగు నియోజకవర్గానికి పోరెడ్డి నరసింహ రెడ్డిని YCP అధిష్ఠానం పార్టీ పరిశీలకులుగా నియమించింది.

కడప జిల్లాలో గుర్తింపు లేని ఇంటర్ జూనియర్ కాలేజీల్లో తమ పిల్లలను చేర్చొద్దని కడప RIO వెంకటేశ్వర్లు బుధవారం తల్లిదండ్రులకు సూచించారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేర్పిస్తే రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి కాని, RIO కార్యాలయం కాని అందుకు బాధ్యత వహించదని తెలిపారు. అడ్మిషన్ నోటిఫికేషన్ కన్నా ముందే ప్రవేశాలను నిర్వహించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కడప YVU పరిధిలోని డిగ్రీ 3, 4, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ వి.సి ప్రొ బెల్లంకొండ రాజశేఖర్ తన ఛాంబర్లో విడుదల చేశారు. రిజిస్ట్రార్ ప్రొ.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ కె.ఎస్.వి కృష్ణారావుతో కలిసి మాట్లాడుతూ.. డిగ్రీ 3వ సెమిస్టర్లో 62.39%, 4వ సెమిస్టర్లో 81.58% శాతం, ఐదో సెమిస్టర్ లో 77.14% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. yvuexams.in నుంచి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.

కడప జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్(JDA) చంద్ర నాయక్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా ఆత్మ పీడీగా చంద్రనాయక్ను నియమించింది. అక్కడ పనిచేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర రావును కడప జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ (JDA)గా బదిలీ చేశారు.

కడప జిల్లాలో బుధవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ మ్యాథమాటిక్స్, సివిక్స్ పరీక్షలు నిర్వహించారు. 12,888 మంది విద్యార్థులకు గాను.. 12,512 మంది పరీక్షలు రాశారు. 375 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 11,738 మందికి గాను.. 11,427 మంది విద్యార్థులు హాజరయ్యారు. 311 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,150 మందికి గాను.. 1,085 మంది పరీక్షలు రాశారు. 65 మంది ఆబ్సెంట్ అయ్యారు.

కడప జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న రాత్రి మైదుకూరులో దాడులు చేసి పీడీఎస్కు చెందిన 57 బస్తాల బియ్యం, 91 బస్తాల జొన్నలు, 6 బస్తాల రాగులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు, పాఠశాలల మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్ల ముద్ర కలిగిన గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. చివరికి అక్రమార్కులు బడి పిల్లలు, పసి పిల్లల అన్నాన్ని సైతం వదలకుండా అమ్ముకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.