India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో పారామెడికల్ సిబ్బంది నియామక నోటిఫికేషన్పై, కడప జీజీహెచ్, క్యాన్సర్ కేర్ సెంటర్, జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు, జీజీహెచ్ పులివెందుల ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సదుపాయాలు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
కామర్స్ చదివిన వారికి విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వైవీయూ వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఉద్బోధించారు. విశ్వవిద్యాలయంలో కామర్స్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి ఒక దీపదారిలా ఉండేలా జ్ఞానాన్ని పొందాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. నిత్యం సానుకూల ఆలోచనలు చేయాలని సూచించారు.
పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణ సహిత, ఆరోగ్యకర ఆహ్లాదకర వాతావరణంలో గణేశ్ చతుర్థి, విజయదశమి ఉత్సవాలను జరిగేలా ప్రజల్లో అవగాహన పెంచాలని చేపట్టాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యావరణ సహితంగా గణేశ్ చతుర్థి, విజయదశమి ఉత్సవాల నిర్వహణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్యంపై వీసీ నిర్వహించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు.
ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణిస్తున్న బాలుడు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాణికుల వివరాల ప్రకారం.. ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణిస్తున్న బాలుడు హుస్సేన్ ప్రమాదవశాత్తు గంగాయిపల్లె – కమలాపురం మార్గమధ్యలో కింద పడ్డాడు. గాయపడ్డ బాలుడిని కమలాపురం ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం అసెంబ్లీ సమావేశంలో మాజీ సీఎం జగన్పై రెచ్చిపోయారు. ‘జగన్ వ్యక్తిగతంగా నాపై కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు పెట్టారు. 2019 మార్చి 15న ఉదయం వివేకాకు గుండెపోటు అని చెప్పిన వ్యక్తి చివరికి నేను వైరస్లా దూరి చంపానన్నారు. జగన్ ఎంతోమందిని చంపించారు. అనంతబాబు ఒకరిని చంపి డిక్కీలో తీసుకొచ్చారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడపలో విచ్చలవిడిగా గంజాయి రవాణా జరుగుతోందని, పోలీసులు వెంటనే గంజాయి విక్రయాలపై మెరుపు దాడులు చేయాలని TDP జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు) కోరారు. YCP పాలనలో కడప నగరంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు సాగాయని, గంజాయి వల్ల యువత నాశనం అయిందన్నారు. దీనిపై నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులు స్పందించి ఎక్కడికక్కడ మెరుపుదాడులు నిర్వహించి గంజాయి కట్టడి చేయాలని సూచించారు.
ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విశాఖ-చెన్నై కారిడార్లో కొప్పర్తికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. నీళ్లు, రోడ్లు, హైవేల అభివృద్ధికై నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మలా తెలిపారు.
కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ మైదానం, కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రికెట్ మైదానాలలో క్రెకెట్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 24 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు ఏసీఏ అండర్ -19 మల్టీ డేస్ అంతర్ జిల్లాల పోటీలు జరుగుతాయని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్ఆర్ జిల్లా ప్రతినిధులు తెలిపారు. ఈ పోటీల్లో కడప, విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, చిత్తూరు, నెల్లూరు జట్లు పాల్గొంటాయని తెలిపారు.
జవహర్ నవోదయ విద్యాలయం (నారమరాజుపల్లె, రాజంపేట)లో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గీత ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు https://navodaya.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
కడప జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లగా ఉక్కు పరిశ్రమ స్థాపనకై ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రులు మారుతున్నా శంకుస్థాపనలకే పరిమితం అయిందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తారో లేదో అని అని జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీరేమంటారు.
Sorry, no posts matched your criteria.