India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జవహర్ నవోదయ విద్యాలయం (నారమరాజుపల్లె, రాజంపేట)లో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గీత ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు https://navodaya.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
కడప జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లగా ఉక్కు పరిశ్రమ స్థాపనకై ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రులు మారుతున్నా శంకుస్థాపనలకే పరిమితం అయిందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తారో లేదో అని అని జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీరేమంటారు.
కడప కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు. ఉత్తరప్రదేశ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఆక్సిస్ బ్యాంకులలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేందుకు డిగ్రీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి రూ.25-33 వేల వేతనంతోపాటు ఇన్సెంటివ్ లభిస్తుందన్నారు. 19-28 మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు.
యోగివేమన విశ్వవిద్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైవీయూ ప్లేస్మెంట్ సెల్ సంచాలకులు ఆచార్య ఎల్.వి.రెడ్డి తెలిపారు. టీసీఎల్, అపోలో ఫార్మసీ కంపెనీలు దాదాపు 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వస్తున్నట్లు తెలిపారు. టీసీఎల్ కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు కావాలన్నారు. ఫార్మా కంపెనీలలో ఉద్యోగాల కోసం బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, పీహెచ్డీ చేసినవారు అర్హులన్నారు.
కడప కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్ శివ శంకర్ లోతేటి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.
అవినీతికి పాల్పడ్డ ముగ్గురు రెవెన్యూ అధికారులను కలెక్టర్ శివ శంకర్ సస్పెండ్ చేశారు. బద్వేల్ డివిజన్ మున్నెల్లి రెవెన్యూ గ్రామంలోని ZPH పాఠశాలకు చెందిన స్థలాన్ని అప్పటి డిప్యూటీ MRO విద్యాసాగర్, సర్వేయర్ ప్రవీణ్, వీఆర్వో గురవయ్య నిబంధనలకు వ్యతిరేకంగా వేరొకరికి ఆన్లైన్ చేశారు. దీనిపై బద్వేలు ఇన్ఛార్జ్ ఆర్డీవో విచారణ చేసి కలెక్టర్కు నివేదిక అందించడంతో ముగ్గురిని సస్పెండ్ చేశారు.
యోగి వేమన యూనివర్సిటీ ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ ఆచార్యులు ప్రొఫెసర్ పి.పద్మ వైస్ ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు నియామకపు పత్రాన్ని వీసి ప్రొ కె.కృష్ణారెడ్డి అందజేశారు. ఈ స్థానంలో పనిచేస్తున్న ప్రొ.షావలిఖాన్ కర్నూల్ ఉర్దూ యూనివర్సిటీకి వీసీగా నియమితులు కావడంతో ఆచార్య పద్మను నియమించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. రఘునాథ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలు నుంచి అందే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్.పి(అడ్మిన్) సుధాకర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వెంకట రాముడు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులతో మాట్లాడారు. బాధితులకు తక్షణ న్యాయాన్ని అందించాలన్నారు.
కడప – కమలాపురం రైల్వే మార్గంలో ఆదివారం నాగర్ సోల్ రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలిసినవారు కడప రైల్వే పోలీస్ స్టేషన్ SHO నాగరాజు నాయక్ను సంప్రదించాలని తెలిపారు.
నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కడప జిల్లాకు చెందిన MLAలు జిల్లాలోని సమస్యలపై తమ గళం విప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు దృష్టి సారించాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిపోయిన పాపాగ్ని వంతెన నిర్మాణంపై దృష్టి సారించాలి. మరి మీ ఎమ్మెల్యే ఏ అంశంపై గళం విప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.