India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప నగరంలో వార్డు సచివాలయ సెక్రటరీలు పెడదారి పడుతున్నారు. లంచాలు, కమీషన్లకు అలవాటు పడి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారిపై కడప నగరపాలక సంస్థ కొరడా ఝళిపించింది. వేయాల్సిన పన్ను కంటే తక్కువ పన్ను వేసినందుకు ఇద్దరు అడ్మిన్ సెక్రటరీలను, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇన్ఛార్జ్ ఆర్ఐ నరేంద్రను నగరపాలక కమిషనర్ మనోజ్ రెడ్డి శుక్రవారం సస్పెండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే సమస్యల పరిష్కారానికి తహశీల్దార్లు ప్రత్యేక చొరవ చూపి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారాని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రీ సర్వే, వెబ్ ల్యాండ్ కరెక్షన్స్ మ్యుటేషన్లకు సంబంధించి రావడం జరుగుతున్నదని తెలిపారు.
కడప జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. కడపలో పనిచేసే ప్రభుత్వ టీచర్ శోభారాణికి అపర్ణ (బెంగళూరు) పరిచయమయ్యారు. బియ్యాన్ని ఆకర్షించే పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని దువ్వూరుకు చెందిన మూలే వెంకట రమణారెడ్డిని వారిద్దరూ నమ్మించారు. వాళ్లకు ఆయన విడతల వారీగా రూ.1.37 కోట్లు చెల్లించి మోసపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అపర్ణతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని ప్రొద్దుటూరు సీఐ యుగంధర్ తెలిపారు.
అసభ్యకర పోస్టుల కేసులో కడప జైలుకు వెళ్లిన వర్రా రవీంద్రరెడ్డిపై ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో మరో కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా రవీంద్రను PT వారెంట్పై కడప జైలు నుంచి బాపట్ల పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. ఇవాళ ఆయనను బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచనున్నట్లు సమాచారం.
వైవీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు శుక్రవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. జిల్లాలోని 54 కేంద్రాలలో 1,3,5 సెమిస్టర్లకు సంబంధించి 20,819 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఫస్ట్ సెమిస్టర్కు 8,407 మంది, 3వ సెమిస్టర్ 6,903 మంది, 5వ సెమిస్టర్ 5509 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
కడప జిల్లాలో రాగల నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం తెలిపింది.
శుక్రవారం: మోస్తరు నుంచి భారీ వర్షాలు
శనివారం: భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఆదివారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సోమవారం: మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నేటి నుంచి YSR, అన్నమయ్య జిల్లాల్లో డిసెంబర్ 1 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కడప ఎంపీ YS అవినాశ్ రెడ్డి PA బండి రాఘవరెడ్డి తనపై మోపిన అభియోగాలకు సంబంధించిన కేసుపై ముందస్తు బెయిల్ పిటిషన్ కడపలోని జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. మెజిస్ట్రేట్ ఈ విచారణను 29కి వాయిదా వేశారు. అదే రోజున ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని పోలీస్ కస్టడీకి కోరిన పిటిషన్ విచారణ కూడా జరగనుంది.
జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఫ్లైయాష్ వివాదం నేపథ్యంలో ఇరువురి నేతలకూ CM చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఉచిత బూడిద వివాదంపై జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైవీయూ పరిధిలో గల కమలాపురంలోని సీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ, పీజీ కళాశాలలో బీఏ ఫస్టియర్ చదువుతున్న రేఖా మోని వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పతకం సాధించారు. నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న దక్షిణ, పశ్చిమ భారత అంతర విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 45 కేజీల విభాగంలో ఈమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు వైవీయూ వీసీ కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ పద్మ అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.