India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప నగర పాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న 2019 ఐఏఎస్ అధికారి జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ సీఆర్డీఏ అదనపు కమిషనర్గా బదిలీ అయ్యారు. కడపను అభివృద్ధి చేయడంలోనూ, సుందరంగా తీర్చిదిద్దడంలోనూ ఈయన ఎనలేని సేవలందించారని నగర ప్రజలు అంటున్నారు. కడప నగరపాలక సంస్థ కమిషనర్గా 2018 ఐఏఎస్ అధికారి తేజ్ భరత్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ఆ రాష్ట్ర సీఎం ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. శనివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్ పర్సన్ వైసీపీ కాబట్టి మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యేల ఫొటోలను మున్సిపల్ కార్యాలయంలో పెట్టాలనడం అది వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. గతంలో మీరు ఫొటోలు మార్చినప్పుడు తాము పట్టించుకోలేదన్నారు.
✎ కడపలో కొడుకు హత్య.. బాధ లేదంటున్న తండ్రి
✎ వైసీపీ నేతలు రూ.కోట్లు దోచుకున్నారు: మండిపల్లి
✎ ప్రొద్దుటూరు ఎఫ్బీఓ సస్పెన్షన్
✎ వైసీపీపై భూపేశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
✎ జగన్కు బుద్ధి ఉందా: TNSF
✎ పుల్లంపేటలో రౌడీ షీటర్ సూసైడ్
✎ సమస్యలు ఉంటే నేరుగా కడప కలెక్టర్కు ఫోన్ చేయవచ్చు
✎ ప్రొద్దుటూరులో ఫొటోల వివాదం
✎ రాజకీయ లబ్ధి కోసమే జగన్ పర్యటనలు: బీటెక్ రవి
✎ ముద్దనూరులో వేపరాల వాసి మృతి
ముద్దనూరు – జమ్మలమడుగు రహదారి సమీపంలో ఉన్న వనంలో ఓ మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సై మైనుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు షరాబు రామచంద్ర ఆచారి (49)అని ఎస్సై తెలిపారు. మైలవరం మండలంలోని వేపరాలకు చెందిన రామచంద్ర చికిత్స కోసం తిరుపతికి ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి వారం రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సుండుపల్లి మండలం సానిపాయ అటవీ ప్రాంతంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్సు పోలీసులు తెలిపారు. సానిపాయ బేస్ క్యాంపు నుంచి రాయవరం మీదుగా ఆవుల దారి, ముడుంపాడు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ వెళుతూ కనిపించారన్నారు. వారిలో ఒకరిని పట్టుకున్నామని తెలిపారు. 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
కడప జిల్లాలోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ శివశంకర్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలపై 08562-244437 నంబర్కు ఫోన్ చేసి నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT
పుల్లంపేట మండలం రామక్కపల్లెలో జయసింహ అనే రౌడీ షీటర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జయసింహ తల్లిదండ్రులు చాలా కాలంగా ఉపాధికోసం కువైట్ వెళ్లారు. గొడవల కారణంగా అతడిపై ఆరేళ్ల క్రితం రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సింది ఉంది.
కడప బిల్డప్ సర్కిల్లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల.. వెంకటేశ్(32) మద్యానికి బానిసై, అందరితో గొడవపడేవాడు. దీంతో భార్యాపిల్లలు అతనికి దూరంగా ఉంటున్నారు. సాధిక్ వలితో ఇతనికి పాతగొడవలు ఉండేవి. దీంతో నిన్న సాధిక్ వెంకటేశ్ను హత్య చేశాడు. గతంలో తనను చంపడానికి యత్నించాడని, తల్లిని హింసించేవాడని, కొడుకు హత్యకు గురయ్యాడనే బాధ తనకు లేదని వెంకటేశ్ తండ్రి కృష్ణయ్య అన్నాడు.
రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని ఆదేశించారు. కడప పోలీస్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన సమాచారం వచ్చేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ను కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు భేటీ అయ్యారు. ఇటీవల కడప ఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో కర్నూలులోని డీఐజీ కార్యాలయంలో కోయ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం కడప జిల్లాలో నెలకొన్న రాజకీయ నేతల మధ్య వైరం, నియోజకవర్గాల వారిగా సమస్యలు వివరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, ఇతర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.