India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైదుకూరు మండలంలో నిన్న హత్య జరిగిన విషయం తెలిసిందే. చెర్లోపల్లికి చెందిన వీర నారాయణ యాదవ్కు బాలకృష్ణ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల బాలకృష్ణ కువైట్ వెళ్లారు. డబ్బు కోసం వీర నారాయణ తరచూ బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. సమస్య ఏంటో చూడాలని బాలకృష్ణ తన అన్న సుబ్బరాజుకు చెప్పగా.. ఆయన కోపంతో వెళ్లి నారాయణను గొడ్డలితో నరికి హత్య చేశాడు.
మైదుకూరు ఘాట్లో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాశినాయన(M) చిన్నాయపల్లెకు చెందిన శ్రీనివాసులరెడ్డి(45), అరుణ(37) కుమారుడు జగదీశ్వర్ రెడ్డి ఖాజీపేటలో 8వ తరగతి చదువుతూ తిప్పాయపల్లెలోని అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. అతడిని చూసేందుకు కుమార్తె పవిత్ర(12)తో కలిసి దంపతులు బైకుపై బయల్దేరారు. ఘాట్ రోడ్డులో లారీని ఓవర్ టేక్ చేస్తూ కిందపడిపోయారు. వీరిపై నుంచి మరో లారీ వెళ్లడంతో ముగ్గరూ చనిపోయారు.
ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు జరుగుతున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమ సమయంలో మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజలు ఈ సమయ మార్పును గమనించి 08562-244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు
మైదుకూరు – పోరుమామిళ్ల ప్రధాన రహదారిలో టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. కాశినాయన మండలం చిన్నాయపల్లికి చెందిన గుర్రాల శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య అరుణ, కుమార్తె పవిత్రలుగా గుర్తించారు. మైదుకూరు మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఫంక్షన్కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మైదుకూరు మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎద్దడుగు కనుమ వద్ద ఆదివారం సాయంత్రం బైకును టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో బైకులో వెళుతున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతి చెందారు. మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తుత స్థితిపై పార్లమెంట్లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు నరసరావు ఎంపీ లావు కృష్ణదేవరాయులు తెలిపారు. పార్లమెంట్లో చర్చించాలనుకునే అంశాలపై ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ కడప ఉక్కు అంశం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఈ కూటమి హయాంలో అయినా అది పూర్తవుతుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
ఎన్నో చారిత్రక ప్రదేశాలకు కడప జిల్లా ప్రసిద్ధి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గది సిద్ధవటం కోట. 1303 CEలో విజయనగర సామ్రాజ్యంలోని తుళువ రాజవంశ సామంతరాజులు దీనిని నిర్మించారు. కృష్ణదేవరాయులు అల్లుడు వరదరాజు పాలనలో కోటను బాగా విస్తరించారు. పెన్నానది ఒడ్డున 30 ఎకరాల్లో ఈ కోట విస్తరించి ఉంది. కోటగోపురం, ఈ ప్రాంతాన్ని రక్షించడానికి నిర్మించిన 17 బురుజులు ఇప్పటికీ కోటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కడప జిల్లా మైదుకూరు మండలం భూమనపల్లికి చెందిన వీర నారాయణ బాలరాజుకు అప్పు ఉన్నాడు. ఈ విషయంలో పొలంలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన బాలరాజు నారాయణను పొలాల్లో దారుణంగా హత్య చేశాడు.
కడపలోని రామాంజనేయపురం ఎరువుల గోడౌన్లో చోరీ చేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు రిమ్స్ SI తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 20 రాత్రి ఎరువుల గోడౌన్ తాలాలు పగులగొట్టి ఎరువులు, రసాయనాలను చోరీ చేసినట్లు సమాచారం. గౌడోన్ యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ సీతారామిరెడ్డి ఆదేశాలతో 8 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వారినుంచి లక్ష విలువైన రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా పులివెందులలో నమోదైన కేసుల నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-A కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను విజయవాడలో భార్గవ్ తల్లికి అందజేయగా, అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నెల 8న ఐటీ, అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ-1గా వర్రా , ఎ-2 సజ్జల భార్గవ్, ఎ-3గా అర్జున్ రెడ్డిలను చేర్చారు.
Sorry, no posts matched your criteria.