India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*కడప జిల్లా కంట్రోల్ రూమ్ 94408- 17440,
*కడప డివిజన్ -99017 61782
*పులివెందుల – 78930-63007
*ప్రొద్దుటూరు -78932-61958
*మైదుకూరు-98490 57659
విద్యుత్ ప్రమాదాలు జరిగితే పై నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

కార్తీకమాసం సందర్భంగా భక్తులు శైవ క్షేత్రాలను దర్శించేందుకు కడప జిల్లాలోని 6 డిపోల పరిధిలో 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ గోపాల్రెడ్డి తెలిపారు. ఈ బస్సులు ఈనెల 27 నుంచి వచ్చేనెల 3, 10, 17తేదీల్లో పొలతల క్షేత్రం, నిత్యపూజ కోన, లంకమల్ల, అగస్తీశ్వర కోన, కన్యతీర్థం, నయనాలప్ప కోన, పుష్పగిరి, శ్రీశైలం తదితర క్షేత్రాలకు బస్సు సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.

కడప జిల్లాలో అన్ని పాఠశాలలకు గురువారం సెలవులు ప్రకటిస్తూ డీఈవో శంషుద్దీన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ కూడా పలు మండలాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కడప జిల్లాలో మండలాల వారీగా నేడు స్థానికంగా ఉన్న పరిస్థితులు, వర్షాలు, ఇబ్బందులు ఆధారంగా సెలవును మండల MEOలు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కొద్దిసేపటి క్రితమే సర్కిలర్ జారీ చేశారు.

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈనెల 21 నుంచి 29 వరకు సెలవుపై వెళ్లనున్నారు. కాగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా JC అతిధిసింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ తిరిగి 29వ తేదీన విధుల్లో చేరనున్నారు.

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో కడప జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
*పొలతల మల్లికార్జునస్వామి ఆలయం
*ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం
* వీరపునాయనపల్లె సంగమేశ్వర స్వామి ఆలయం
* అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం
* సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి
* జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం
*ఖాజీపేట నాగ నాదేశ్వర కోన.
*పులివెందుల సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం.

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో కడప జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
*పొలతల మల్లికార్జునస్వామి ఆలయం
*ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం
* వీరపునాయనపల్లె సంగమేశ్వర స్వామి ఆలయం
* అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం
* సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి
* జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం
*ఖాజీపేట నాగ నాదేశ్వర కోన.
*పులివెందుల సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం.

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం కడపలో నిర్వహించనున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. ఉదయం పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొననున్నట్లు చెప్పారు.

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా రద్దు చేస్తున్నామని అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.