India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిన్నమండెం మండల వ్యాప్తంగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి కోలాహలం మొదలైంది. వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలు డప్పులు, మేళతాళాలు, బాజా భజంత్రీలు, బాణసంచా పేలుళ్ల నడుమ బారులు తీరిన భక్తులు గణనాథునికి నీరాజనాలర్పించారు.
పోరుమామిళ్ల మండలం ఈదులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈదుళ్ళపళ్లి గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడు స్థానికంగా ఉండే పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్గా పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి, ఇది హత్యా ఆత్మహత్యా అన్న కోనంలో దర్యాప్తు చేస్తున్నారు.
కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజాప్రయోజన పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీస్ అధికారులు వెల్లడించారు. మిలాన్ ఉన్ నబీ పండగ నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం పేర్కొన్నారు.
ఇసుక పంపిణీ నియమ నిబంధనలో మేరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
9వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కడప జిల్లా బాలుర జట్టు నాల్గవ స్థానం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఈనెల 13వ తేది నుంచి 15వ తేది వరకు ఈ పోటీలు సాధించింది. ఇందులో ప్రతిభ కనబరిచిన బాలుర జట్టును వైఎస్ఆర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట రమణ, కోచ్ సురేంద్ర అభినందించారు.
చిన్న కారణాలతో కేసుల వరకు వెళ్లిన వారిని పిలిపించి సెటిల్మెంట్ చేసి పరిష్కరించే కార్యక్రమమే లోక్ అదాలత్. కడప జిల్లా వ్యాప్తంగా 3200 కేసులు శనివారం పరిష్కారం అయ్యాయని, కక్షిదారులకు రూ.6,24,18,818 చెల్లింపు జరిగిందని కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ప్రధాన న్యాయమూర్తి జి శ్రీదేవి అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈనెల 27న గండికోటలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాలులోని గండికోటలో శనివారం సమావేశం అయ్యారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రంలో వైభవంగా పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.
కడప జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశం గండికోటలో నగరవనం, మైలవరం జలాశయంలో బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఈ మేరకు గండికోటలో ఏర్పాటు చేయబోయే నగరవనం స్థల పరిశీలనతోపాటు.. మైలవరం జలాశయంలో బోటింగ్ను శనివారం ఆయన పరశీలించారు. బోట్ ఎక్కి ఎంత దూరం ప్రజలను సౌకర్యవంతంగా తిప్పగలరు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు.
కడప జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు ముమ్మరంగా చేయడంతో గంజాయి వ్యసనానికి అలవాటుపడ్డ యువత, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలలో మత్తు కలిగే మందుల కోసం మెడికల్ షాప్లకు వచ్చే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించవద్దని జిల్లా SP హర్షవర్ధన్ రాజు, మెడికల్ షాప్ నిర్వాహకులకు శనివారం సూచించారు.
జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన హనుమంతు గురువారం కేసు విచారణకు కోర్టుకి వెళ్లి తిరిగి వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా డాడి చేయడంతో గాయపడిన హనుమంతురెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదుకు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆసుపత్రి వెళ్లి హనుమంతురెడ్డిని పరామర్శించారు.
Sorry, no posts matched your criteria.