Y.S.R. Cuddapah

News January 20, 2025

కడప: నేడు యథావిధిగా కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని యథావిధిగా నేడు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు నేరుగా కడప కలెక్టరేట్లో రేపు ఉదయం 10:30 గంటల నుంచి అధికారుల దృష్టికి తీసుకుని రావచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 19, 2025

మస్కట్‌లో కడప వ్యక్తి మృతి.. స్పందించిన లోకేశ్

image

కడప బిస్మిల్లా నగర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ అనీష్ అన్సారీ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు సాయం చేయాలని SM ద్వారా ఓ వ్యక్తి మంత్రి లోకేశ్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన లోకేశ్ ‘జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన అన్సారీ మృతి చెందటం అత్యంత బాధాకరం. వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి అని’ అన్నారు.

News January 19, 2025

గోల్డ్ మెడల్ సాధించిన కడప జిల్లా బిడ్డ

image

బ్రహ్మంగారి మఠానికి చెందిన చిత్రాల జెస్సీ అంతర్జాతీయ పోటీల్లో జంప్ రోప్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించింది. నేపాల్ అంతర్జాతీయ పోటీల్లో ఏపీ తరఫున పాల్గొంది. అత్యుత్తమ ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్‌ను సాధించిన ఆమెను అందరూ అభినందిస్తున్నారు. జెస్సీ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

News January 19, 2025

29 నుంచి దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు

image

ఈనెల 29 నుంచి తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండగా, 28న సాయంత్రం అంకురార్పణ, 29న ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఫిబ్రవరి 3న స్వామి వారి కళ్యాణం, 4న వైభవంగా రథోత్సవం, ఫిబ్రవరి 7న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

News January 18, 2025

Rewind: చౌటిపల్లెలో బస చేసిన సీనియర్ ఎన్టీఆర్

image

నందమూరి తారక రామారావు కొండాపురం మండలంలోని చౌటిపల్లెలో గతంలో బస చేశారు. 1982 ఏడాది చివరిలో తాడిపత్రి నుంచి చైతన్య రథంలో డ్రైవర్‌గా హరికృష్ణతో రామారావు రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోలో భాగంగా చౌటిపల్లె వద్ద గల చిత్రావతి నదిపై వాహనం మొరాయించడంతో అక్కడే అగి బస చేశారు. 1993 ఎన్నికల ప్రచారంలో కూడా పాత కొండాపురంలో టీ తాగారు. నేడు NTR 29వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను పలువరురు Rewind చేసుకున్నారు.

News January 18, 2025

YSR జిల్లాపై చంద్రబాబు అసంతృప్తి

image

చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో చివరి మూడు స్థానాల్లో YSR జిల్లా, అల్లూరి, తూ.గో జిల్లా ఉండగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురు మంత్రులను CM చంద్రబాబు హెచ్చరించారు.

News January 18, 2025

నేడు కడప జిల్లాకు చంద్రబాబు.. ట్రాఫిక్ ఆంక్షలు.!

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మైదుకూరుకు వెళ్లే వాహనాల దారి పూర్తిగా మళ్లించారు. బద్వేలు- పోరుమామిళ్ల వైపు వెళ్లే వాహనాలు ఖాజీపేట, నాగసానిపల్లె మీదుగా వెళ్లాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, కర్నులు వైపు వెళ్లే వాహనాలు టౌన్‌లోకి రాకుండా జాతీయ రహదారి పైనుంచి వెళ్లాలని CI సయ్యద్ తెలిపారు.

News January 17, 2025

మైదుకూరుకు సీఎం.. షెడ్యూల్ ఖరారు!

image

మైదుకూరులో రేపు CM చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12 గం. నుంచి హెలికాఫ్టర్ ద్వారా మైదుకూరు చేరుకుని, అనంతరం 12:20 నుంచి 1 గం. వరకు NTR వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 1:55 నుంచి మైదుకూరు మున్సిపల్ ఆఫీస్‌ నుంచి ఇళ్లను సందర్శిస్తారు. 2:15 నుంచి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.

News January 17, 2025

పులివెందులలో MLC సతీమణి ధర్నా

image

పులివెందుల పట్టణంలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేషన్ డీలర్లకు సంబంధించి రాత పరీక్ష జరుగుతోంది. వేంపల్లికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తిని కొంతమంది కిడ్నాప్ చేయడంతో ఆ వ్యక్తి రాత పరీక్షకు హాజరు కాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న దుండగులు ప్రకాశ్‌ను పులివెందులలోని పరీక్షా కేంద్రం వద్ద విడిచిపెట్టారు. 

News January 17, 2025

కడప అభివృద్ధికి నిధులు ఇవ్వండి: శ్రీనివాస రెడ్డి

image

కడప నగర అభివృద్ధికి ప్రభుత్వం స్పందించి నిధులను మంజూరు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన నిన్న రాత్రి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కడప నగరంతో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల విషయమై చర్చించారు. ఎన్నికల సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీల అమలకు కృషి చేయాలన్నారు.