India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నూతన సంవత్సరానికి మందు బాబులు ఫుల్ కిక్తో స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలో డిసెంబర్ 30, 31 జనవరి 1న రూ.14,51,06,769 మద్యాన్ని మందు బాబులు తాగేశారు. వీటిలో లిక్కర్ 18,586 కేసులు, బీర్లు 8586 కేసులు అమ్మకాలు జరిగాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు.

కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించేందుకు వచ్చిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో కడప ఆర్డీవో జాన్ ఏర్విన్ కేంద్ర మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో కడపకు బయలుదేరారు. నేటి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో ఆయన కడపకు చేరుకోగా కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో కడప కలెక్టర్ శ్రీధర్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్లు ఘనంగా స్వాగతం పలికారు. మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.

రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో డెడ్బాడీ కలకలం రేపింది. 2వ ప్లాట్ ఫాం పక్కన ఉన్న మద్యం షాప్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

వేముల మండలం మబ్బుచింతలపల్లి గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం తెల్లవారుజామున విశ్వజిత్ సాహు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే మృతుని తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు ఉరి వేసుకుని చనిపోయే వ్యక్తి కాదని, మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు. మృతుడి తండ్రి విక్రమ్ కుమార్ ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తే వ్యవసాయంలో అత్యధిక లాభాలు గడించవచ్చని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. మంగళవారం కడప కలెక్టర్లోని తన ఛాంబర్లో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించాలని రైతులు ఉపయోగించే పనిముట్లు ఇతర వస్తువులను ఆధునికీకరించే దిశగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, రైతులకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. దీనికి సంబంధించి తిరుపతిలో జనవరి 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి టోకెన్లు ఇవ్వనున్నారు. ఆ ఏరియాలు ఇవే..
➤ రామచంద్ర పుష్కరిణి ➤ జీవకోన ZP స్కూల్
➤ ఇందిరా మైదానం ➤ శ్రీనివాసం రెస్ట్ హౌస్
➤ విష్ణునివాసం ➤ 2వ చౌల్ట్రీ
➤ రామానాయుడు హైస్కూల్ బైరాగిపట్టెడ
➤ ఎమ్మార్ పల్లి జడ్పీ స్కూల్

జమ్మలమడుగు నగర పంచాయతీ వార్డు మహిళా సంరక్షణ సచివాలయ ఉద్యోగిని యం. భారతి భాయినిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామి రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్ పంపిణీలో ఒక్కొక్క లబ్దిదారుడు నుంచి రూ.300 నుంచి రూ.500లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో విచారించిన అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

YCP నేత వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసుల దూకుడు పెంచారు. గుంటూరుకు చెందిన పలువురిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు.. కళ్ళం హరికృష్ణ రెడ్డి, ప్రేమ్ సాగర్, వెంకటరామిరెడ్డి లను అదుపులోకి తీసుకొని పులివెందుల తరలించారు. ఇప్పటికే ఈ కేసులో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేయగా.. మొత్తం ఈ కేసుకు సంబంధించి 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.

నూతన సంవత్సర వేడుకలలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే తాటతీస్తామని జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. బైకులకు సైలెన్సర్ తీసి పెద్దగా శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే బైక్ సిస్టంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులకు దయచేసి సహకరించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.