Y.S.R. Cuddapah

News October 2, 2024

కడప జిల్లాలో 581 మంది బైండోవర్

image

కడప జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరులో అసాంఘిక కార్యకలాపాలపై ముమ్మరంగా దాడులు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 141 కేసుల్లో 581 మందిని బైండోవర్ చేశామన్నారు. మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేసి 204 లీటర్ల మద్యాన్ని స్వాధీనపరచుకుని, 37 మందిని అరెస్టు చేశామన్నారు. 67 మంది మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి, రూ.5.96 లక్షలు, 382 మంది జూదరులను అరెస్టు చేశామని తెలిపారు.

News October 2, 2024

రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ మానవుడిగా పుట్టినందుకు రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. జాతీయ స్వచ్ఛంద దాతల దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వ రక్తనిధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు.

News October 2, 2024

జాతీయ సేవకులకు వైవీయూ పురస్కారాలు

image

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి యూనివర్శిటి స్థాయి జాతీయ సేవా పథక పురస్కారాలను ప్రకటించింది. సమాజ సేవా, ప్రజా చైతన్యం, జాతీయ సమైక్యత వంటి కార్యక్రమాలలో విశేష కృషిచేసిన ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు, ప్రోత్సాహక అందించిన కళాశాలల జాబితాను వీసీ ప్రొ. కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ. ఎస్. రఘునాథ రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా.వెంకట్రామిరెడ్డి విడుదల చేశారు.

News October 1, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి

image

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ తప్పెట రామప్రసాద్ రెడ్డిని నియమించారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తన ఛాంబరులో నియామక పత్రం అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఆచార్య రఘునాథరెడ్డి రిలీవ్ అయ్యి ప్రధాన ఆచార్యులుగా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్‌కు బోధన, బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

News October 1, 2024

కమలాపురం వద్ద చెట్టును ఢీకొన్న కళాశాల బస్సు

image

కమలాపురం పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన వ్యాను మంగళవారం ఉదయం చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే కళాశాలకు చెందిన వ్యాను విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా కొండాయపల్లె వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉండే చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News October 1, 2024

కడప: రోడ్డు ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు?

image

కడప జిల్లా YVU యూనివర్సిటీ వద్ద సోమవారం రాత్రి కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కాళ్లు విరిగి పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంగా పరిగనించి వేలూరు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో కేవలం కాళ్లకు మాత్రమే కత్తితో నరికిన గాయాలు ఉండగా.. చివరికి <<14239401>>ఎవరో కాళ్లను నరికినట్లు<<>> అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులతోపాటు వారి బంధువులు కూడా అనుమానిస్తున్నారు.

News October 1, 2024

కడప: ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చిన వారికి బహుమతులు.. వివరాలివే.!

image

కడపలోని రాజీవ్ పార్క్ వద్ద <<14237927>>నేటి సాయంత్రం 5 గంటలకు<<>> నిర్వహించే కార్యక్రమానికి ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చేవారికి ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే.
1బాటిల్‌కి ఒక చాక్లెట్
1కేజీ ప్లాస్టిక్‌కు ఒక పెన్, మొబైల్ స్టాండ్
3కేజీల ప్లాస్టిక్‌కు పుష్‌బిన్
5 కేజీలకు డస్ట్‌బిన్ &ఫ్లవర్‌పాట్
15కేజీల ప్లాస్టిక్‌కు టీషర్ట్
500kgల ప్లాస్టిక్‌కు ఒక బెంచ్‌ గిఫ్ట్‌గా ఇస్తామని కలెక్టర్ తెలిపారు. వివరాలకు 9949831750ఫోన్ చేయాలన్నారు.

News October 1, 2024

కడప జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమలు

image

జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కట్టుదిట్టంగా, పూర్తిగా పారదర్శకంగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మద్యం దుకాణాల పాలసీపై జిల్లా కలెక్టర్ సంబంధిత ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాలను కేటాయించుటకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నదని చెప్పారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో 139 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నామన్నారు.

News October 1, 2024

మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం గ్రామం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల రోడ్డులోని 49వ జాతీయ రహదారిపై కారు స్కూటర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన కంచర్ల రుద్రదీపు(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News October 1, 2024

కడప: ప్లాస్టిక్ తీసుకువస్తే బహుమతులు పొందవచ్చు

image

ఇళ్లలో, కార్యాలయాల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువస్తే ఉపయోగపడే పునర్వినియోగ వస్తువులను తీసుకు వెళ్ళవచ్చని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి బహుమతులు తీసుకువెళ్లండి పోస్టర్లను ఆవిష్కరించారు. నగర పరిధిలోని రాజీవ్ పార్క్ నందు అక్టోబర్ 1 తేదీన సాయంత్రం ఇనుప వస్తువులు స్వీకరిస్తారని చెప్పారు.