India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. YCP నాయకుల దాడిలో గాయపడ్డ గాలివీడు MPDOను ఆయన నేరుగా పరామర్శించనున్నారు. గన్నవరం నుంచి కడప ఎయిర్ పోర్టుకు 10:20amకి చేరుకొని, రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను 10:25కి పరామర్శిస్తారు. అనంతరం 10:55కి గాలివీడు చేరుకుని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శిస్తారు. 2:30కి రాయచోటి చేరుకుని లంచ్ చేస్తారు. 4pmకి తిరిగి గన్నవరం వెళ్తారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కడపకు రానున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శిస్తారు. మరోవైపు ఈ దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వేంపల్లి మండలం ఇడుపులపాయ గ్రామ సమీపంలోని కొండ్రుతు వంకలో శుక్రవారం మనిషి కాలి ఆకృతిలో పుట్టగొడుగు దర్శనమిచ్చింది. ఈ పుట్టగొడుగును చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపుతున్నారు. నెలరోజుల క్రితం ఇదే ప్రాంతంలో మనిషి చేతివేళ్ల ఆకారంలో పుట్టగొడుగు బయటపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై హెచ్ఓ రెడ్డయ్యను వివరణ కోరగా.. జన్యు లోపంతో ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొస్తాయన్నారు.

కడప పట్టణం నుంచి హైదరాబాదు, విజయవాడ దూర ప్రాంతాలకు స్టార్ లైన్ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో RM గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కడప నుంచి హైదరాబాదు, విజయవాడ ప్రాంతాలకు ప్రతిరోజు రాత్రి9 గంటలకు బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా నిద్రిస్తూ ప్రయాణం చేసే విధంగా రూపొందించినట్లు వివరించారు. ప్రజలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తిరుపతి-హుబ్లీ ప్యాసింజర్ రైలు సేవలను 28వ తేదీ నుంచి రద్దు చేసి, కుంభమేళా ఉత్సవాలకు పంపుతున్నట్లు రైల్వే అధికారి జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఉమ్మడి కడప జిల్లాలోని బాలపల్లె, శెట్టిగుంట, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, హస్తవరం, నందలూరు, మంటపంపల్లె, ఒంటిమిట్ట, భాకరాపేట, కనుమలోపల్లి, కడప, కృష్ణాపురం, గంగాయపల్లె, కమలాపురం, ఎర్రగుడిపాడు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, మంగపట్నం, కొండాపురం మీదుగా ప్రయాణిస్తుంది.

రైల్వే కోడూరు మండలానికి చెందిన 95వ బ్యాచ్, 11వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజయ్య గురువారం మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం తాడేపల్లికి వెళ్లారు. 2 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతను అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

యోగి వేమన యూనివర్సిటీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. అనుబంధ పీజీ కళాశాల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 30 నుంచి జరగాల్సి ఉండగా.. 2025 జనవరి 21వ తేదీకి మార్చినట్లు ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేశామన్నారు. MA, Mcom, Msc, Mped ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

ఉమ్మడి కడప జిల్లాలో ఓబుళవారిపల్లెలో ఆదివారం ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నరసింహ(40), భార్య సుజాత (35), బాల ముణిచరణ్(8) మృతిచెందగా.. చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చిన్నవయస్సులోనే ఆ చిన్నారి కుటుంబాన్ని కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. కాగా.. వీరంతా బైక్పై వైకోటలో సుజాత అమ్మగారింటికి వెళ్లి వస్తుండగా.. వారిని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆటో ఢీకొట్టింది.

పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజంపేట మండలం భువనగిరి పల్లికి చెందిన <<14954606>>భార్యాభర్తలు<<>> మృతి చెందిన విషయం విదితమే. ఆ ఘటనలో గాయపడిన వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కొడుకు బాల మణిచరణ్ బుధవారం ఉదయం మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి కుమార్తె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనలో ఆసక్తికర దృశ్యం జరిగింది. స్థానిక సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆయన తన తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విజయమ్మ ఆప్యాయంగా జగన్ను ముద్దాడింది. ఇదే ‘ఫొటో ఆప్ ది డే’ అంటూ వైసీపీ అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.