India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు పట్టణంలోని వీణ విజయ వీధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12.100 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బయట వ్యక్తులు గుంపుగా ఉండడంపై విద్యాశాఖ, పోలీస్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి గురించి ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా మంగళవారం నుంచి నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. పొత్తులో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే అవకాశం వుండడంతో పవన్ కల్యాణ్ వాయిస్తో ‘రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా మద్దెల సుబ్బరాయుడుకు ఓటు వేస్తారా లేక నోటాకు వేస్తారా’ అంటూ సర్వే జరుగుతోంది. ఈయన ఇది వరకు జర్నలిస్ట్గా పని చేశారు.
ఎన్నికల కోడ్ వచ్చినా జిల్లాలో కొన్ని స్థానాలపై ఉత్కంఠ వీడలేదు. YCP అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి 6 స్థానాలను ప్రకటించింది. ఇందులో ఇద్దరు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, కోడూరు స్థానాలను ప్రకటించలేదు. జమ్మలమడుగు, బద్వేలు స్థానాలు పొత్తులో భాగంగా BJPకి.. రాజంపేట, కోడూరులో ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక కడప MPకి ముగ్గురు పోటీలో ఉన్నారు.
TDP చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. 20, 21, 22వ తేదీల్లో ఆమె పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు అరెస్టుకు గురై జైలులో ఉండటాన్ని తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ‘నిజం గెలవాలి’ అనే పేరుతో పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి జిల్లాలోని బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేస్తారు.
ప్రొద్దుటూరులో 27న సీఎం జగన్ నిర్వహించే బస్సు యాత్ర బహిరంగ సభకు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్డులో సభకు స్థలం అనువుగా ఉంటుందని వైసీపీ నాయకులతో ఆయన చర్చించారు. వైసీపీ ప్రోగ్రాం మెంబర్ చంద్రహాసరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, JCS జిల్లా కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
ఈనెల 20, 21, 22వ తేదీల్లో ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆవేదనతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. 20న గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామంలో పర్యటించి తిరుమల వెళ్లనున్నారు. 21న రాత్రికి బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పొరుమామిళ్ల చేరుకుని మండలంలో 22న కార్యకర్తలను పరామర్శిస్తారు.
సీఎం సొంత ఇలాకలో టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఈసారి ఎలాగైనా ఉమ్మడి కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతోనే అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది. కడప ఎంపీగా మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డిని బరిలోకి దుంపే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మిగిలిన వాటిపై మల్లగుల్లాలు పడుతుంది. అటు కడపలో వైసీపీని కూటమి ఏ మేరకు నిలువరిస్తుందని మీరు అనుకుంటున్నారు.?
అన్నంలోకి కూరలు సకాలంలో తీసుకురాలేదని కోపంతో రెడ్డి బాబును(15) అతని చిన్నాన్న సురేశ్ దాడి చేసి హత్య చేశాడు. సురేశ్కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఒక రూములో ఉంచి రోజు భోజనాలు పెట్టేవారు. సోమవారం చిన్నాన్నకు భోజనం పెట్టడంలో ఆలస్యం కావడంతో సురేశ్ ఆగ్రహంతో రెడ్డి బాబును తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన రెడ్డిబాబు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్లూరుకి చెందిన లింగం కిరణ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 10వ తరగతి చదువుతున్న బాలికకు కిరణ్తో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో తన వెంట రావాలని బాలికను కిరణ్ భయపెట్టేవాడు. ఈ క్రమంలోనే బైక్పై తీసుకెళ్లి పలుసార్లు అత్యాచారం చేశాడు. సదరు బాలిక ఫిర్యాదు చేయడంతో నిందితుడితో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.