Y.S.R. Cuddapah

News September 14, 2024

ఎర్రగుంట్ల: తండ్రి తాగొద్దని చెప్పినందుకు కొడుకు సూసైడ్

image

ఎర్రగుంట్లలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన చింతకుంట వెంకట్(18) రోజూ తాగి ఇంటికి వస్తుంటాడు. తన తండ్రి మందు తాగొద్దని మందలించేవాడని తెలిపారు. దీంతో శనివారం ఉదయం వెంకట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

ప్రొద్దుటూరు: ‘మా పాప మృతికి కారణం వైద్యులే’

image

ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి విషాదం నెలకొంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చాపాడు మండలం నక్కలదిన్నెకు చెందిన బాలఎల్లయ్య, సుమలతల కుమార్తె జసికాశ్రీ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. దీనికి కారణం చిన్నారి ఊపిరితిత్తిలో నిమ్ము ఎక్కువ అవ్వడమేనని వైద్యులు తెలిపారు. అయితే తమ పాప మృతికి కారణం వైద్యులే అని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు.

News September 14, 2024

కడప: ‘17 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు’

image

అక్టోబర్ 2న ‘స్వచ్ఛ భారత్ దివస్’ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈనెల 17 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో, కార్యక్రమాలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మండలాల అధికారులతో వీసీ ద్వారా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జిల్లా “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

News September 13, 2024

కడప: 108 వాహనాల్లో ఉద్యోగ అవకాశాలు

image

108 వాహనాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్​ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండి BS-3, 4, 6 (టెంపో ట్రావెలర్, టాటా వింగర్)లను చేయగలిగే వారు ఈ ఉద్యోగాలకు అర్హులను వారు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4లోపు దరఖాస్తులు కడప న్యూ రిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్న 108 కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News September 13, 2024

గృహ నిర్మాణాలలో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాలో గత రెండు వారాలుగా గృహ నిర్మాణాలలో జీరో శాతం స్టేజ్ కన్వర్షన్ ఉన్నవారు వారంలోగా ప్రగతి సాధించాలన్నారు. లక్ష్యసాధనలో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల స్థాయి గృహ నిర్మాణ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News September 13, 2024

పులివెందుల: సొంత తమ్ముడిని చంపిన అన్న.. కారణం ఇదే.!

image

మతిస్థిమితం లేక సొంత తమ్ముడిని <<14090347>>అన్న చంపిన ఘటన<<>> రాయలాపురంలో చోటుచేసుకుంది. పులివెందుల అర్బన్ సీఐ జీవన్ గంగానాథ్ బాబు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాయలాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాబయ్య తమ్ముడు బాబా ఫక్రుద్దీన్‌తో గొడవపడి కోపంలో సమ్మెటతో తమ్ముడిని బలంగా కొట్టి చంపినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు.

News September 13, 2024

పులివెందుల: ‘నా కుమారుడి ఆరోగ్యం బాగుంది’

image

తన కుమారుడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగుందని వైఎస్ మధుసూధన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైఎస్ జగన్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు ఈ విషయంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభిషేక్ తీవ్ర జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని ప్రస్తుతం బాగుందని వెల్లడించారు.

News September 13, 2024

నిండుకుండలా గండికోట జలాశయం

image

గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యంతో కళకళలాడుతోంది. జలాశయంలో 24.85 క్యూసెక్కుల నీరు నిల్వ ఉన్నట్లు జనవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. శుక్రవారం 11 గంటలకు మైలవరం జలాశయానికి నీరు వదులుతున్నట్లు సమాచారం. అవుకు రిజర్వాయర్ నుంచి 10,000 క్యూసెక్కులు వరద నీరు జలాశయంలోకి వస్తున్నట్లు చెప్పారు. జలాశయం నుంచి 2,990 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

News September 13, 2024

ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదు: ఎమ్మెల్యే వరద

image

ఏపీలో ఇక YCPకి భవిష్యత్తు లేదని, జగన్ ఒక రాజకీయ అజ్ఞానిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని MLA వరదరాజులరెడ్డి విమర్శించారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని సహాయ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటే జగన్ బురద రాజకీయాలు చేయడం హేయమైన చర్యని అన్నారు. లక్షల కోట్ల అధిపతైన జగన్ వరద బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు.

News September 13, 2024

ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

image

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న హత్యాయత్నం కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పుంగనూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన న్యాయమూర్తి విచారణ అనంతరం ఆ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాతి విచారణ ఈనెల 17కి వాయిదా పడింది.