Y.S.R. Cuddapah

News April 10, 2026

కడప: యువతి గొంతు కోసి హత్య

image

కడప జిల్లా ఖాజీపేట పట్టణంలో దారుణం జరిగింది. అగ్రహారం ఏరియాకు చెందిన యువతిని ఓ యువకుడు గొంతు కోశాడు. చికిత్స నిమిత్తం కడపకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. నిందితుడు కొట్టాలు గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువకుడి(19)గా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోలేదని ప్రేమోన్మాదిగా మారి మర్డర్ చేశాడని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

News April 10, 2026

పులివెందుల యువతి గ్రేట్..!

image

పులివెందుల పట్టణానికి చెందిన అనిలాదేవి, గురుదత్తల కుమార్తె సాయి వర్షిత తాజాగా విడుదలైన SSC CGL ఫలితాల్లో సత్తాచాటారు. ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె గతేడాది ఐదు సెంట్రల్ జాబ్స్ సాధించి ఔరా అనిపించారు. న్యాయ శాస్త్రం చదివిన ఐదేళ్లలో నాలుగు బంగారు పతకాలు సాధించడం విశేషం. ఆమెను పలువురు అభినందించారు.

News April 10, 2026

కడప: ముమ్మర వాహన తనిఖీలు.. రూ.49 వేల జరిమానా!

image

జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 227 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 49,565 జరిమానా వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

News April 10, 2026

కడప: ముమ్మర వాహన తనిఖీలు.. రూ.49 వేల జరిమానా!

image

జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 227 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 49,565 జరిమానా వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

News April 10, 2026

కడప: ముమ్మర వాహన తనిఖీలు.. రూ.49 వేల జరిమానా!

image

జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 227 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 49,565 జరిమానా వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

News April 10, 2026

కడప: ముమ్మర వాహన తనిఖీలు.. రూ.49 వేల జరిమానా!

image

జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 227 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 49,565 జరిమానా వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

News April 9, 2026

కడప: ‘పదో తరగతి’ మూల్యాంకన రుసుము పెంచండి: APTF

image

పదో తరగతి పరీక్షల మూల్యాంకన రుసుమును 100% పెంచాలని కోరుతూ APTF నాయకులు గురువారం DEO శంషుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే స్పెషల్ అసిస్టెంట్లకు TA, DAలు చెల్లించాలని, అలాగే ట్యాబ్‌లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నేతలు DEOను కలిసి తమ సమస్యలను వివరించారు.

News April 9, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,190
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,975
* 10 గ్రాముల వెండి ధర రూ.2,420.

News April 9, 2026

కడప: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్ప గారి పల్లెలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాయచోటి తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కుందా శేఖర్‌తోపాటు చిలేకంపల్లి గ్రామం నారపురెడ్డి పల్లెకు మోరం నాగిరెడ్డి అనే వ్యక్తి కూడా మృతి చెందారు. వీరు పనుల నిమిత్తం రాయచోటికి వెళుతుండగా గాలివీడు క్రాస్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News April 9, 2026

కడప జిల్లా MLAలపై లోకేశ్ ఆగ్రహం

image

జిల్లాలోని TDP ఎమ్మెల్యేలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు MLAలు మాధవిరెడ్డి, చైతన్యరెడ్డి, పుట్టా సధాకర్ యాదవ్, వరదరాజులు రెడ్డి, పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు దూరంగా ఉండటం, 4 వారాలుగా గ్రీవెన్స్‌లు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉండటమే కారణమట. మళ్లీ ఇది రిపీట్ అయితే నోటీసులు ఇస్తామని చెప్పారట.