Y.S.R. Cuddapah

News September 25, 2024

ఎర్రగుంట్ల: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

image

ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం రాజగోపాల్ రెడ్డి అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని శ్రీరాములు పేటకు చెందిన వ్యక్తిగా ఇతనిని గుర్తించారు. మృతుడు ప్రొద్దుటూరు శ్రీరామ్ ఫైనాన్స్‌లో రికవరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతికి గల వివరాలు తెలియాల్సిఉంది.

News September 25, 2024

కడప: నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారిపై SP సీరియస్

image

కడప నగరంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన యువకులపై<<14190089>> జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీవ్రంగా స్పందించారు.<<>> యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కడప నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులను అప్రమత్తం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం ఇద్దరు యువకులను కడప రిమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి చర్యలపై ఉపేక్షించేది లేదన్నారు.

News September 25, 2024

కోడూరు: నామినేటెడ్ పోస్టు వద్దంటూ సీఎంకు లేఖ

image

ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుడిగా ఇచ్చిన పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేనని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్, సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో ఈయన కోడూరు నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

News September 25, 2024

సోమిరెడ్డి పల్లె వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు

image

అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బ్రహ్మంగారిమఠం సోమిరెడ్డి పల్లె వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని రహదారులు బురదమయంగా మారాయి. బ్రహ్మంగారిమఠం బద్వేల్ రహదారిపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

News September 25, 2024

రాజంపేట: అటవీ ప్రాంతంలో ప్రవేశిస్తున్న 15 మంది అరెస్టు

image

రాజంపేట పరిధిలోని సానిపాయ నిషేధిత అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న 15 మందిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి నుంచి రంపాలు, గొడ్డళ్లు, నాలుగు కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వారిలో నలుగురు అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా.. 11మంది తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఆర్ఎస్ఐ సురేశ్ అటవీశాఖ అధికారులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో వీరు పట్టుబడ్డారు.

News September 25, 2024

కడప జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ తహసీల్దారుల బదిలీలు

image

కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ లోతేటి శివశంకర్ ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులను విడుదల చేశారు. బదిలీలు అయిన డిప్యూటీ తహశీల్దార్లు వెంటనే తమకు కేటాయించిన ప్రాంతంలో విధులలో చేరాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 59 మందిని మార్పు చేశారు.

News September 24, 2024

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రామక్కపల్లి వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే.. బైక్‌ను టాటా మ్యాజిక్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి <<14186271>>మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా<<>> ఉంది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పుల్లంపేట మండలం రెడ్డిపల్లెకు చెందిన గన్నేరు చంటి (32)గా గుర్తించారు.

News September 24, 2024

వల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

వల్లూరు మండలంలో మంగళవారం <<14185933>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వల్లూరు మండలం ఈతచెట్టు వద్ద లారీ పల్సర్ బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు జరిగాళ్ల బాబు (కట్ట) గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

News September 24, 2024

కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కమలాపురం మండలం పందిళ్ళపల్లె గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలమకూరకు చెందిన కారు, కడపకు చెందిన ఆటో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు కడపకు చెందిన షేక్ అబ్దుల్ హసన్ (23)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

News September 24, 2024

ప్రొద్దుటూరు: తండ్రి హత్య కేసులో.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష

image

ఆస్తి, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రిని హత్య చేసిన కేసులో మంగళవారం ప్రొద్దుటూరు 2nd ADJ GS రమేశ్ కుమార్ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కడప హోటల్ లక్ష్మీ భవన్ యజమాని ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్యను ఆయన చిన్న కొడుకు శివ ప్రసాద్, జనార్దన్, పెద్దకోడలు సుప్రజ, 2014 డిసెంబర్ 30న హత్య చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ముగ్గురికి యావజ్జీవ శిక్ష, రూ.4 లక్షలు జరిమానా విధించారు.