India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లి వేడుకకు పచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన కడప జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపురం మండలం నల్లింగాయపల్లెకి ఓ వ్యక్తి మల్లుపెల్లికి వచ్చాడు. సోమవారం రాత్రి భారతి సిమెంట్ కంపెపీ సమీపంలో నడిచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడు ఆసుపత్రిలో మృతి చెందాడు.
కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె వద్ద బాంబు స్క్వాడ్ వాహనానికి ప్రమాదం తప్పింది. జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందులకు వెళ్తున్న బాంబు స్క్వాడ్ వాహనాన్ని మంగళవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. దీంతో వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. వాహనంలో 10 మంది బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.
YS జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా 10:45 ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుని ఆయన నివాసంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టిదిట్టం చేశారు. మూడు రోజులపాటు జగన్ జిల్లాల పర్యటిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.
వైవీయూ పీజీ కళాశాలలో కామర్స్, కాంపిట్యూషనల్ డేటా సైన్సెస్ సబ్జెక్టులలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం నవంబర్ 4వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథ్ రెడ్డి తెలిపారు. కామర్స్ సబ్జెక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి ఎంకాం, కాంపిట్యూషనల్ డేటా సైన్సెస్ సబ్జెక్టులకు ఎమ్మెస్సీ, పీహెచ్డీ/ నెట్/ సెట్ అర్హత ఉండాలన్నారు. అన్ని రకాల ఒరిజినల్ అర్హత పత్రాలతో రావాలని సూచించారు.
రాజుపాలెం గ్రామానికి చెందిన ఆదిల్(11) అనే బాలుడు చాపాడు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆదిల్ మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.
కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో అత్తను రోకలి బండతో కొట్టి గాయపరిచిన కేసులో ముద్దాయికి 1 సంవత్సరం జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించారు. 2022 సంవత్సరంలో నెహ్రూ నగర్లో నివాసం ఉంటున్న బాధితురాలిపై రోకలి బండతో దాడి చేసి గాయపర్చిన నిందితుడు శ్రీనివాసులుపై అప్పట్లో కేసు నమోదైంది. విచారణ చేసిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో సోమవారం 2వ అదనపు జడ్జి శిక్ష ఖరారు చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పులివెందులకు రానున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10:45కు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గం.కు పులివెందుల చేరుకోనున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇక అక్కడి నుంచి 11:40 గం.కు ఆయన ఇంటికి వెళతారని పేర్కొంది.
ఏపీలో దాదాపు రూ.1397 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే వివిధ స్టేషన్లు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా కడప రైల్వే స్టేషన్ను రూ.20 కోట్లతో ఆధునికీకరించనున్నారు. అంతర్జాతీయ హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సంబంధిత పనులకు ప్రధాని మోదీ ఇటీవల వర్చువల్గా శంకుస్థాపన చేయడంతో పనులు జోరుగా జరుగుతున్నాయి.
రాజంపేటలో విషాద ఘటన జరిగింది. నంద్యాల జిల్లా సుగాలి తండాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు కూలీ పని నిమిత్తం రాజంపేటకు వలస వచ్చారు. పట్టణంలోని మన్నూరు సాతవీధిలో జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తల్లి ఇంటి పనులు చేసుకుంటుండగా.. సుశాంక్(2) పచ్చి చికెన్ ముక్క నోట్లో వేసుకున్నాడు. ఈక్రమంలో ఊపిరాడక మృతిచెందాడు.
నేరాలను నిరోధించడంలో, నేరస్థులను గుర్తించి అరెస్ట్ చేయడంలో CC కెమెరాల పాత్ర కీలకమైనదని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులకు కడప పోలీసు కార్యాలయంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని వ్యాపారులు తమ వంతు సామాజిక బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ సూచించారు.
Sorry, no posts matched your criteria.