Y.S.R. Cuddapah

News March 20, 2024

నేడు కడప జిల్లాలో పర్యటించనున్న భువనేశ్వరి

image

TDP చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. 20, 21, 22వ తేదీల్లో ఆమె పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు అరెస్టుకు గురై జైలులో ఉండటాన్ని తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ‘నిజం గెలవాలి’ అనే పేరుతో పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి జిల్లాలోని బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేస్తారు.

News March 20, 2024

జగన్ బస్సు యాత్ర సభకు ఏర్పాట్లను పరిశీలించిన రాచమల్లు

image

ప్రొద్దుటూరులో 27న సీఎం జగన్ నిర్వహించే బస్సు యాత్ర బహిరంగ సభకు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్డులో సభకు స్థలం అనువుగా ఉంటుందని వైసీపీ నాయకులతో ఆయన చర్చించారు. వైసీపీ ప్రోగ్రాం మెంబర్ చంద్రహాసరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, JCS జిల్లా కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్ర రెడ్డి పాల్గొన్నారు.

News March 19, 2024

కడప జిల్లాలో నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన

image

ఈనెల 20, 21, 22వ తేదీల్లో ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆవేదనతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. 20న గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామంలో పర్యటించి తిరుమల వెళ్లనున్నారు. 21న రాత్రికి బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పొరుమామిళ్ల చేరుకుని మండలంలో 22న కార్యకర్తలను పరామర్శిస్తారు.

News March 19, 2024

కడప: సీఎం ఇలాకపై టీడీపీ స్పెషల్ ఫోకస్

image

సీఎం సొంత ఇలాకలో టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఈసారి ఎలాగైనా ఉమ్మడి కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతోనే అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది. కడప ఎంపీగా మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డిని బరిలోకి దుంపే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మిగిలిన వాటిపై మల్లగుల్లాలు పడుతుంది. అటు కడపలో వైసీపీని కూటమి ఏ మేరకు నిలువరిస్తుందని మీరు అనుకుంటున్నారు.?

News March 19, 2024

పులివెందుల: టైంకు అన్నం పెట్టలేదని హత్య

image

అన్నంలోకి కూరలు సకాలంలో తీసుకురాలేదని కోపంతో రెడ్డి బాబును(15) అతని చిన్నాన్న సురేశ్ దాడి చేసి హత్య చేశాడు. సురేశ్‌కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఒక రూములో ఉంచి రోజు భోజనాలు పెట్టేవారు. సోమవారం చిన్నాన్నకు భోజనం పెట్టడంలో ఆలస్యం కావడంతో సురేశ్ ఆగ్రహంతో రెడ్డి బాబును తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన రెడ్డిబాబు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ప్రొద్దుటూరు: బాలికపై అత్యాచారం.. ఐదుగురిపై కేసు

image

కల్లూరుకి చెందిన లింగం కిరణ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 10వ తరగతి చదువుతున్న బాలికకు కిరణ్‌తో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో తన వెంట రావాలని బాలికను కిరణ్ భయపెట్టేవాడు. ఈ క్రమంలోనే బైక్‌పై తీసుకెళ్లి పలుసార్లు అత్యాచారం చేశాడు. సదరు బాలిక ఫిర్యాదు చేయడంతో నిందితుడితో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి:రిటర్నింగ్ అధికారి

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలని, సువిధ యాప్‌లో అనుమతులు తప్పక తీసుకోవాలని కడప ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, సువిధ యాప్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ECI గైడ్ లైన్స్ ప్రకారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తప్పక పాటించాలని కోరారు.

News March 18, 2024

కడప జిల్లా TODAY TOP NEWS

image

* కడప పార్లమెంట్ బరిలో వీర శివారెడ్డి.?
* బద్వేల్‌లో ఆక్రమణలు తొలగించాలని ధర్నా
* ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటా: కమలమ్మ
* కడపలో దారుణం.. వ్యక్తిని పొడిచిన వైనం
* కమలాపురంలో బ్యాంకు ఉద్యోగి మృతి
* ఒంటిమిట్ట ఆలయంలో కోతుల పట్టివేత
* కువైట్లో కడప జిల్లా వాసులకు ఊరట
* కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ?
* రాజంపేటలో పెరిగిపోతున్న చోరీలు

News March 18, 2024

అన్నమయ్య: ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లు స్వాహా

image

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువకుడి ఉదంతం అన్నమయ్య జిల్లా పీలేరులో వెలుగు చూసింది. పట్టణంలోని బండ్లవంకకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. 400 మందికి పైగా నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముందుగా డిపాజిట్ రూపంలో రూ.10 కోట్లకు పైగా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.

News March 18, 2024

కడప పార్లమెంట్ TDP అభ్యర్థిగా వీర శివారెడ్డి.?

image

కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప పార్లమెంటులోని ప్రజలకు అధిష్ఠానం ఐవీఆర్ సర్వే ద్వారా ఫోన్లు చేస్తోంది. సర్వేలో ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డితో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించగా.. వీరశివారెడ్డి వైపే మొగ్గుచూపినట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇక్కడినుంచి వాసు టికెట్ ఆశిస్తుండగా ఎవరికి దక్కుతుందో చూడాలి