Y.S.R. Cuddapah

News June 13, 2024

రాయచోటి: 62 ఏళ్లలో మొదటిసారి..

image

62 ఏళ్ల రాయచోటి నియోజకవర్గ చరిత్రలో ఓ అరుదైన రికార్డ్ నమోదయింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎందరో రాజకీయ ఉద్ధండులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గడికోట, పాలకొండ్రాయుడు వంటి వారు 4 సార్లు MLAగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఎవ్వరికీ మంత్రి పదవి దక్కలేదు. తాజాగా ఆ అదృష్టం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వరించింది.

News June 13, 2024

అన్నమయ్య: ప్రభుత్వ టీచర్ దారుణ హత్య

image

ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి దారుణ హత్యకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికంకాలనీ, ఆంజనేయస్వామి గుడి వద్ద కాపురం ఉంటున్న టీచర్ దొరస్వామి(62)ని ఎవరో ఆయన ఇంటిలోనే మరణాయుధాలతో దారుణంగా హత్యచేసి పరారయ్యారు. మృతదేహాన్ని 1టౌన్, తాలూకా సీఐ వల్లి భాష, శేఖర్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News June 13, 2024

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఏ శాఖ?

image

రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అనూహ్యంగా టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవి ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు మంత్రి మండలిలో ఏ శాఖ వరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈయనకు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. మరి కొంతమంది ఈయనకు కార్మిక శాఖ ఇస్తారని అంచనాలు వేస్తున్నారు. మరి మండిపల్లికి ఏ శాఖ వరిస్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News June 12, 2024

ప్రొద్దుటూరు: ఆప్కాబ్ ఛైర్ పర్సన్ రాజీనామా

image

ఆప్కాబ్ ఛైర్ పర్సన్ పదవికి మల్లెల ఝాన్సీ రాణి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్లు ఆమె పేర్కొన్నారు. 2021 జులై 26 నుంచి ఆప్కాబ్ ఛైర్ పర్సన్ గా పనిచేస్తున్నానని, 2024 జనవరి 12న నాటి ప్రభుత్వం 2024 జులై 17 వరకు తన పదవీ కాలాన్ని పొడిగించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం సహకార బ్యాంకులను లాభాల బాటలో నడిపి అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు.

News June 12, 2024

కడప: 28 నుంచి వైవీయు పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

image

యోగి వేమన యూనివర్సిటీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంపీఈడీ (పీజీ) 2, 4 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. 2వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28, జులై 1, 3, 5, 8, 10 తేదీలలో, 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 29, జులై 2, 4, 6, 9, 11 తేదీలలో జరుగుతాయన్నారు. వీటితోపాటు ఎంబీఏ పరీక్షలు మొదలవుతాయన్నారు.

News June 12, 2024

కడప: 6 సార్లు ఎమ్మెల్యే అయినా దక్కని మంత్రి పదవి

image

ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజులరెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి లభించలేదు. ఈయన 1985లో TDP తరఫున గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1989లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు MLAగా విజయం సాధించారు. తిరిగి ఈ ఎన్నికల్లో 22,744 మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఈయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు ఆశించారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించకపోవడంతో నిరాశ చెందారు.

News June 12, 2024

మంత్రిగా మండిపల్లి ప్రమాణ స్వీకారం

image

రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.

News June 12, 2024

వైసీపీలో ఇద్దరు.. టీడీపీలో ఒకరు

image

మంత్రివర్గ జాబితాలో చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఉమ్మడి కడప జిల్లా నేతలకు నిరేశే ఎదురైంది. వైసీపీ హయాంలో సీఎంగా జగన్, డిప్యూటీ సీఎంగా అంజాద్ బాషా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాగా తాజా మంత్రివర్గ జాబితాలో ఉమ్మడి కడప జిల్లా నుంచి కేవలం రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News June 12, 2024

కడప: టీటీడీ బోర్డు పదవికి యానాదయ్య రాజీనామా

image

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, బీసీ రాష్ట్ర నేత సిద్దవటం యానాదయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు పంపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News June 12, 2024

మండిపల్లి రాజకీయ నేపథ్యం ఇదే.. 

image

రాయచోటి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  మంత్రివర్గ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈయన 2021లో టీడీపీలో చేరారు. ఈయన తండ్రి నాగిరెడ్డి, సోదరుడు నారాయణరెడ్డి చెరో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో టికెట్ దక్కించుకున్న రాంప్రసాద్ రెడ్డి.. వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై గెలుపొంది.. జిల్లాలో మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక నేతగా నిలిచారు.