Y.S.R. Cuddapah

News October 25, 2024

లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉండాలి: కడప కలెక్టర్

image

స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటిని చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.

News October 24, 2024

ప్రజల సమస్యలను తెలుసుకున్న వైఎస్ అవినాశ్ రెడ్డి

image

పులివెందులలోని తన నివాసంలో గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు వచ్చిన ఫిర్యాదుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.

News October 24, 2024

కడప జిల్లా విద్యాశాఖాధికారిగా మీనాక్షి దేవి

image

కడప జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా నియమితులైన మీనాక్షి దేవిని నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మవరం డిప్యూటీ ఈఓగా ఉన్న మీనాక్షి దేవిని ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా బదిలీ చేశారు. వెంటనే జిల్లా విద్యాశాఖాధికారిగా నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కడప డీఈఓగా ఉన్న అనూరాధను విద్యాశాఖలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

News October 24, 2024

కోడూరు: పెళ్లి ఇంట తీవ్ర విషాదం

image

కోడూరులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ పెళ్లి ఇంట విషాదాన్ని మిగిల్చింది. కర్నూలుకు చెందిన సిరిచందనకు తిరుపతికి చెందిన రోహిత్‌తో ఈనెల 20న వివాహం జరిగింది. తిరుపతిలో 24న రిసెప్షన్ పెట్టుకున్నారు. నిన్న కర్నూలు నుంచి తిరుపతికి కారులో బయల్దేరగా.. రైల్వేకోడూరు వద్ద తిరుపతి నుంచి కడప వైపు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుచిత్ర(49), ప్రేమ్ కుమార్(55), ఆయన భార్య వాసవి(45) మృతి చెందారు.

News October 24, 2024

ఈనెల 25 నుంచి జిల్లాలో పశుగణన ప్రారంభం

image

ఈనెల 25 నుంచి అన్నమయ్య జిల్లాలో పశుగణన ప్రారంభమవుతున్నట్లుగా, దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్లైతో కలిసి పోస్టర్‌లను ప్రారంభించారు. పశుగణన భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని అన్నారు.

News October 23, 2024

తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్‌కు చుక్కెదురు

image

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాశ్, తండ్రి భాస్కర్ రెడ్డి తమ మధ్యంతర బెయిల్ కండిషన్లను సడలించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పుడు విదేశాలకు వెళ్లవద్దని కండిషన్ పెట్టారు. కండిషన్ తొలగించామని కోరగా కోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్డుకు వెళ్లామని వారికి కోర్డు సూచించింది.

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

కడప: బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి

image

బిల్డింగ్ పైనుంచి జారి పడి ఉమ్మడికడప జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు..HYD మాదాపూర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న శివకుమార్ రెడ్డి భవనం పైనుంచి కిందపడిపోయాడు. గమనించిన కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. విద్యార్థి స్వస్థలం రైల్వే కోడూర్‌గా పోలీసులు గుర్తించారు.

News October 23, 2024

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మున్సిపల్ ఛైర్మన్ 

image

పులివెందుల పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఉదయం మున్సిపల్ ఛైర్మన్ వర ప్రసాద్ పరామర్శించారు. ఇదే క్రమంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బందితో చర్చించారు. ఆయనతో పాటు పలువురు మున్సిపల్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

News October 23, 2024

బద్వేల్‌లో మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం

image

బద్వేల్ ఇంటర్ విద్యార్థి విఘ్నేష్ అనే ఉన్మాది చేతిలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబానికి సీఎం రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు వారి కుమారుడికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో సీటు ప్రకటించారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందుడిని కఠిన శిక్షించాలని సీఎం కోరిన విషయం తెలిసిందే.