Y.S.R. Cuddapah

News June 9, 2024

కడప: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ఆలీ 

image

13, 14న జమ్మూలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాయచోటి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు షేక్ ఆలీ అహ్మద్ ఎంపికయ్యాడు. శనివారం ఆలీ అహ్మద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కబడ్డీ పోటీలలో విజయం సాధించి రాయచోటికి మంచి పేరు తెస్తానన్నారు. 

News June 8, 2024

కడప: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన అలీ 

image

13, 14న జమ్మూలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాయచోటి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు షేక్ అలీ అహ్మద్ ఎంపికయ్యాడు. శనివారం అలీ అహ్మద్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ కబడ్డీ పోటీలలో విజయం సాధించి రాయచోటికి మంచి తెస్తానన్నారు. 

News June 8, 2024

కడప-తిరుపతి హైవేపై రోడ్డు ప్రమాదం

image

రైల్వే కోడూరు మండలంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మాధవరంలోని పోడు హరిజనవాడ సమీపంలో కడప-తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ట్యాంకర్ ఓ వ్యానును బలంగా ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో డ్రైవర్లు ఊపిరి తీసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

ఏడీ సెట్-24 రద్దు: వైఎస్ఆర్‌ఏఎఫ్ యూలో నేరుగా ప్రవేశాలు

image

కడప నగర పరిధిలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఏడీసెట్-2024 (ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ను రద్దు చేసినట్లు ఏడీసెట్ చైర్మన్ ఆచార్య బి. ఆంజనేయప్రసాద్, కన్వీనర్ ఆచార్య ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News June 8, 2024

2024 ఎన్నికల్లో మారిన రాజంపేట సెంటిమెంట్

image

4 దశాబ్దాలుగా రాజంపేటలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ఆపార్టీ అధికారంలోకి వస్తోంది. కానీ 2024 ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ మారింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డి విజయం సాధించగా.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2012 జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి అమర్ నాథ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆకేపాటి ప్రతిపక్షానికి పరిమితం అవుతున్నారు.

News June 8, 2024

టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా భూపేశ్ రెడ్డి?

image

కడప ఎంపీ స్థానానికి కూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయిన చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డికి టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా భూపేశ్ రెడ్డి పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో భూపేశ్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. దీంతో టీడీపీ బోర్డు ఛైర్మన్‌కు భూపేశ్ అర్హుడని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. దీనిపై భూపేశ్ స్పందన తెలియాల్సి ఉంది.

News June 8, 2024

కడప: ఒకే ఒక్క ఎమ్మెల్యే

image

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో YCP గెలిచిన 11 స్థానాల్లో బద్వేల్ MLA దాసరి సుధ ఓ రికార్డు నమోదుచేశారు. YCP నుంచి గెలిచిన ఒకే ఒక్క మహిళా MLAగా నిలిచారు. అంతేకాకుండా బద్వేల్ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచిన ఏకైక మహిళా MLAగా కూడా నిలిచారు. అయితే 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో 90,533 భారీ మెజార్టీతో గెలిచిన ఆమె.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 18,567 మెజార్టీ ఓట్లకు తగ్గిపోయారు.

News June 8, 2024

భూపేశ్‌రెడ్డి ఓటమికి కారణం ఇదేనా?

image

కడప TDP MP అభ్యర్థిగా పోటీ చేసిన భూపేశ్‌రెడ్డి ఓటమికి ప్రధాన కారణం క్రాస్ ఓటింగ్ అని తెలుస్తోంది. జిల్లాలో కూటమి గెలిచిన 5 స్థానాల్లో MLA అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ 1,05,102 ఓట్లు. ఆ స్థానాల్లో MP అభ్యర్థి భూపేశ్‌కు వచ్చిన మెజార్టీ 23,332 ఓట్లు. వీటి మధ్య తేడా 81,770 ఓట్లు. భూపేశ్‌ 65,490 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అంటే.. MLA ఓటు కూటమికి వేసి, MP ఓటు కాంగ్రెస్‌ లేదా YCPకి వేసినట్లు స్పష్టమవుతోంది.

News June 8, 2024

ఒంటిమిట్ట: కోదండ రామాలయంలో తిరుమల వెంకన్న లడ్డూలు

image

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్వామివారి ఆలయంలో ఒక్కో లడ్డుకు 50 రూపాయలు చెల్లించి స్వామివారి ప్రసాదాన్ని పొందవచ్చని తెలిపారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

News June 7, 2024

ప్రొద్దుటూరు: కార్పొరేషన్ల డైరెక్టర్లు రాజీనామా

image

ప్రొద్దుటూరుకు చెందిన పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు YCP ఓటమితో శుక్రవారం రాజీనామా చేశారు. నగర కార్పొరేషన్ డైరెక్టర్ మురళి,ఆరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరి, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రవిచంద్ర, పూసల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, నాటక అకాడమీ డైరెక్టర్ లక్ష్మీదేవి రాజీనామా చేశారు.