India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన పెండ్లిమర్రి మండలంలోని గోపరాజుపల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే ఇరువర్గాల మధ్య గొడవ జరిగి నంద్యాల సుబ్బయ్య అనే యువకుడి మీద దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గొడవకు పాతకక్షలే కారణమని వారు తెలిపారు.

సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. 5వ తేదీ గురువారం రోజు రాత్రి రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాన్ని కొందరు ఆకతాయిలు వాట్సాప్ గ్రూప్లలో, సోషల్ మీడియాలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉయదం 9:5కి బేగంపేట ఎయిర్ పోర్ట్లో బయలుదేరి 10:15కి కడప ఎయిర్కి వస్తారు. అక్కడినుంచి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక 1:25కి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని 2:15కి బేగంపేటలో దిగుతారు.

రోడ్డు ప్రమాదం జరిగితే 108 వాహనం రయ్ రయ్ మంటూ వచ్చి వారిని త్వరగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ.. గురువారం గువ్వలచెరువు ఘాట్లో బ్రహ్మంగారి మఠానికి చెందిన 108 డ్రైవర్ రమేశ్ మృతి చెందాడు. ఆయన మృతిని చూసిన వారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మందిని రక్షించిన వ్యక్తి ఇవాళ అదే రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

పుష్ప-2లో కడప జిల్లా వాసి కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన వీరా కోగటం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఈక్రమంలో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ డైరెక్టర్ సుకుమార్ను కలిశారు. ఆ పరిచయంతో పుష్ప-2 ప్రాజెక్టులో చేరారు. ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా పని చేశారు. స్ర్కిప్ట్ కల్చర్, రీసెర్చర్గానూ వ్యవహరించారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రజాప్రతినిధులతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతుల భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు అన్నింటికీ పరిష్కార మార్గం చూపడానికి ఈనెల 6వ తేదీ నుంచి వచ్చేనెల జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు.

ఈనెల 7వ తేదీన కడపకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొని ఆయన నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొని తిరిగి హైదరాబాదుకు చేరుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈనెల 7న మెగా పేరెంట్స్- టీచర్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు కడప జిల్లాకు రానున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కడపలోని పవన్ కళ్యాణ్ పర్యటించే మునిసిపల్ స్కూలులో ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు.

కడప నూతన SPగా రాహుల్ మీనా వస్తున్నారనే కథనాలు జిల్లాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి కేసులో SP హర్షవర్ధన్ రాజు అలసత్వం వహించాడని ఆయన్ను తప్పించారు. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా SP విద్యాసాగర్ నాయుడును అదనపు SPగా ఉన్నతాధికారులు నియమించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుంతకల్ రైల్వే SPగా పనిచేస్తున్న రాహుల్ మీనా వస్తారని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రపంచ పర్యాటక మ్యాపులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండికోట పర్యాటక అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రం” భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.