news

News September 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 8, 2025

శుభ సమయం (8-09-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ పాడ్యమి రా.10.21 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర రా.10.11 వరకు
✒ శుభ సమయములు: రా.7.40-రా.8.10
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: మ.12.58-సా.4.30

News September 8, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా: దుర్గేశ్
* ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత: బొత్స
* చంద్రబాబుకు కోర్టులంటే లెక్కే లేదు: అంబటి
* వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్
* అవసరమైతే ప్రభుత్వంపై పోరాటానికైనా సిద్ధం: రాజగోపాల్
* కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు: హరీశ్ రావు
* హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
* భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం

News September 8, 2025

మాతా, శిశు వైద్యసేవలు విస్తరిస్తున్నాం: మంత్రి సత్యకుమార్

image

AP: ప్రభుత్వాస్పత్రుల్లో మాతా, శిశు వైద్య సేవలను విస్తరిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరు, కాకినాడ GGHలలో 500 చొప్పున పడకలతో 2 బ్లాకులు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయా చోట్ల రూ.51కోట్లతో వైద్య పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కొత్త బ్లాకుల కోసం ICU బెడ్లు, పేషెంట్ మానిట‌ర్లు, వెంటిలేట‌ర్లు, మొబైల్ అల్ట్రా సౌండ్ మెషీన్లు తదితరాలు భారీ స్థాయిలో కొనుగోలు చేయ‌నున్నారు.

News September 8, 2025

బిగ్‌బాస్ సీజన్-9 కంటెస్టెంట్లు వీరే..

image

బిగ్‌బాస్ సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కోటాలో తనూజ(ముద్ద మందారం), నటి ఆశా సైనీ, కమెడియన్లు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరీ, నటి సంజనా గల్రానీ, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, సామాన్యుల నుంచి సోల్జర్ పవన్, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీశ్‌ లోనికి వెళ్లారు.

News September 8, 2025

గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కన్నుమూత

image

నిర్మాత అల్లు అరవింద్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు(76) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం నాగరాజు అంత్యక్రియలు HYDలో జరిగాయి. అంతకుముందు దర్శకుడు రవిరాజా పినిశెట్టి, బన్నీ వాసు, బండ్ల గణేశ్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే.

News September 7, 2025

గ్రహణం తర్వాత ఏం చేయాలంటే?

image

చంద్ర గ్రహణం తర్వాత ఉదయం లేచాక ఇంటిని శుభ్రం చేయాలని, వస్తువులపై పవిత్ర నది జలాలను చల్లి శుద్ధి చేయాలని పండితులు చెబుతున్నారు. రాత్రి మిగిలిన ఆహారాన్ని పడవేయడంతో పాటు తల స్నానం చేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు పేదలకు దుస్తులు, ఆహారం, పాలు, బియ్యం, చక్కెర వంటివి దానం చేస్తే మేలని చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 2.25గంటల తర్వాత వీడనుంది.

News September 7, 2025

క్వాంటం వ్యాలీ అభివృద్ధికి రెండు కమిటీలు

image

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. అపెక్స్, ఎక్స్‌పర్ట్ కమిటీల విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఏఐ కంప్యూటింగ్, డిఫెన్స్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని చూస్తోంది.

News September 7, 2025

సౌతాఫ్రికా ఘోర ఓటమి

image

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో SA ఘోర పరాజయం పాలైంది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ బ్యాటర్లు 72 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో టాప్ స్కోరర్ బాష్(20) అంటేనే వాళ్ల ఆట ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా టాపార్డర్‌ను పడగొట్టారు. దీంతో 342 పరుగుల తేడాతో SA ఓడింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడా ఓటమి ఇదే కావడం గమనార్హం.

News September 7, 2025

రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.