India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ను రెండు సార్లు పట్టుకున్న ముంబై లెజెండరీ పోలీస్ మధుకర్ బాపూరావు జెండే గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తన తెలివితేటలు, ధైర్యం, ఓపికతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించడం విశేషం. దీంతో ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జెండేను ప్రశంసించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఇన్స్పెక్టర్ జెండే’ సినిమా ఈనెల 5న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది.
AP: 2017-20 మధ్య TTD EOగా పని చేసిన IAS అధికారి అనిల్ కుమార్ <<17648825>>సింఘాల్<<>> మరోసారి అక్కడికే బదిలీ అయ్యారు. గతంలో ఆయన తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్కు రూపకల్పన చేసి అమలు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా TTD ఖజానాకు నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది. TTDలో అన్యమత ఉద్యోగుల గుర్తింపు కోసం సర్వే చేశారు. 2020లో వైసీపీ ప్రభుత్వం సింఘాల్ను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో 841 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 410 AAO (స్పెషలిస్ట్), 350 AAO (జనరలిస్ట్), 81 ఏఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి అర్హత కలిగి ఉండాలి. వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.88,635 నుంచి రూ.1.26 లక్షల వరకు ఉంటుంది. <
TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని <<17647664>>BRS<<>> చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితంతో రాజకీయంగా వీరికి కనెక్టివిటీ పోయిందని దుయ్యబట్టారు. ఏ పార్టీకి చెందని సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తే లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు.
AP: రాష్ట్రంలో రబీ సీజన్కు సంబంధించి యూరియా పంపిణీపై ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా సమస్య లేకుండా చూడాలని, దీనిపై రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. ‘క్వింటా ఉల్లి ధర రూ.1,200కు తగ్గకూడదు. రూ.1,200కు తగ్గితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అరకు కాఫీ తోటల్లోని బెర్రీ బోరర్ తెగులు ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు.
TG: రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల్లో MA, M.COM, MSC తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన CPGET (Common Post Graduate Entrance Tests-2025) ఫలితాలు విడుదలయ్యాయి. <
రాధాకృష్ణన్(ఎన్డీఏ అభ్యర్థి): బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన-షిండే, YCP, LJP, అన్నాడీఎంకే(పళనిస్వామి), JDS, జనసేన, RLD, అప్నాదళ్, NCP(అజిత్ పవార్), SKM, స్వతంత్రులు.
సుదర్శన్ రెడ్డి (ఇండీ కూటమి): కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, TMC, ఆప్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్), NCP(శరద్ పవార్), RJD(లాలూ), CPM, CPI, ఎంఐఎం.
* బీఆర్ఎస్(4), బీజేడీ(7) దూరం.
1984 నుంచి 2023 వరకు 14 సార్లు వన్డే, రెండు సార్లు టీ20 ఫార్మాట్లలో జరిగిన ఆసియాకప్లో అత్యధిక సార్లు టీమ్ ఇండియా(8) విజేతగా నిలిచింది. శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు విజయం సాధించాయి. ఈ సారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లోనే ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 8 దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. చివరగా వన్డే ఫార్మాట్లో జరగగా రోహిత్ సారథ్యంలో భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.
USలో గన్ కల్చర్ తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇది. హరియాణాకు చెందిన కపిల్ (26) రూ.45 లక్షలు ఖర్చు పెట్టి 2022లో డంకీ రూట్ ద్వారా USకు వెళ్లాడు. అక్కడ అరెస్టై లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా బయటకు వచ్చి కాలిఫోర్నియాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదం చెలరేగింది. అతడు కాల్పులు జరపడంతో కపిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలాడు.
TG: ఎరువుల సరఫరా విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని ఫైరయ్యారు. తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమని తెలిపారు.
Sorry, no posts matched your criteria.