India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

T20Iల్లో సూర్య కుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టీమ్ ఇండియా తరఫున అత్యధిక POTMలు నెగ్గిన ప్లేయర్గా నిలిచారు. నిన్నటి మ్యాచులో POTM రావడంతో ఆయన ఖాతాలో అవార్డుల సంఖ్య 17కు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ(16), రోహిత్ శర్మ(14), అక్షర్ పటేల్(8) ఉన్నారు. T20I WCలో భారత్ తరఫున అత్యధిక POTMలు గెలిచిన జాబితాలో కోహ్లీ(8), సూర్య(4), యువరాజ్(3), అశ్విన్(3), రోహిత్(3) ఉన్నారు.

పురాణాల ప్రకారం ఇందుమతి అనే భక్తురాలు తన జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని వశిష్ఠ మహర్షిని వేడుకుంది. ఆయన సూచన మేరకు ఆమె భాను సప్తమి వ్రతాన్ని ఆచరించింది. సూర్యోదయ స్నానం, ఉపవాసం, సూర్య మంత్ర జపం ద్వారా ఆమె తన ఆత్మను శుద్ధి చేసుకుంది. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన సూర్య భగవానుడు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ సూర్యారాధన ద్వారా లభించే పరమపదాన్ని మనకు వివరిస్తుంది.

TG: ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలన్నీ టీ ఫైబర్ ఇంటర్నెట్ వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల ఇంటర్నెట్ వాడకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,484 సంస్థలు టీ ఫైబర్ను వినియోగిస్తున్నాయి. 26 జిల్లాల్లోని 8,895 గ్రామపంచాయతీలకు ఈ నెట్వర్క్ విస్తరించింది. ఈ సేవలకు వన్ టైం పేమెంట్ రూ.9500 చెల్లించాలి.

వారాల నియమాల ప్రకారం కుటుంబ సౌభాగ్యం కోసం కొన్ని ఆచారాలున్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు కాబట్టి, ఆ రోజున ఆడపిల్లలను ఇంటి నుంచి పంపకూడదు. దీన్ని ఇంటి లక్ష్మిని బయటకు పంపినట్టు భావిస్తారు. మంగళవారం ఉద్వేగాలకు, కలహాలకు సంకేతం. ఈ రోజున వివాహిత అత్తగారింటికి వెళ్తే గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుందని శాస్త్ర వచనం. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయని పెద్దల నమ్మకం.

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొత్త టేకింగ్తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.