news

News May 7, 2025

మద్యంపై ఈ అపోహల గురించి విన్నారా?

image

మద్యం విషయంలో ఉన్న అపోహల గురించి మద్యం తయారీ నిపుణురాలు సోనాల్ హోలాండ్ స్పష్టతనిస్తున్నారు. ‘రెడ్ వైన్ గుండెకు మంచిదే. కానీ ఎక్కువగా తాగితే రక్తపోటు పెరగడమే కాక లివర్ పాడవుతుంది. ఖరీదైన టెకీలాతో హ్యాంగోవర్ రాదన్నది కూడా అబద్ధమే. వోడ్కాలో తక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి మంచిదని మరో అపోహ ఉంది. కానీ ఏ ఆల్కహాలైనా లివర్ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. అతిగా తీసుకుంటే అమృతమూ విషమే’ అని వివరించారు.

News May 7, 2025

డిఫెన్స్ ఆపరేషన్స్‌ లైవ్ టెలికాస్ట్ చేయకండి: కేంద్రం

image

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ కేంద్ర సమాచార శాఖ అన్ని మీడియా ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణశాఖ కార్యకలాపాలు, భద్రతా బలగాల కదలికలను లైవ్ టెలికాస్ట్ చేయొద్దని కోరింది. ఇది డిఫెన్స్ ఆపరేషన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో యూజర్లు కూడా భద్రతాపరమైన అంశాల వార్తల వ్యాప్తిపై సంయమనం వహించాలని సూచించింది.

News May 7, 2025

హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

image

TG: భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు సీఎం రేవంత్, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా ఈవెంట్ జరిగే హైటెక్స్‌లోని నోవాటెల్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా భారత్ సమ్మిట్‌కు దాదాపు 400 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ముగింపు కార్యక్రమానికి రాహుల్ ఇక్కడికి వచ్చారు.

News May 7, 2025

OTTలోని బెస్ట్ దేశభక్తి సినిమాలు.. చూశారా?

image

OTTలో వార్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ చాలా ఉన్నాయి. వాటిలో ది బెస్ట్‌గా నిలిచే ఈ దేశభక్తి మూవీస్‌ని ఈ వీకెండ్‌కి చూసేయండి.
Border(1997)- Youtube, Prime
Ghazi(2017)- Prime
Raazi(2019)- Prime
URI(2019)- Zee5
kesari(2019)- Prime
Shershaah(2021)- Prime *Major(2022)- Netflix

News May 7, 2025

ఉగ్రదాడి: ఏపీ, తెలంగాణలో హైఅలర్ట్‌ జోన్స్.. నిజమిదే!

image

పహల్గామ్ దాడి నేపథ్యంలో AP, TGలోని 14 ప్రాంతాలను పోలీసులు హైఅలర్ట్ జోన్లుగా ప్రకటించారని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై TG ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇది ఫేక్ అని స్పష్టం చేసింది. ఎలాంటి స్పెషల్ అలర్ట్ జారీ చేయలేదని, పోలీసులు ముందు జాగ్రత్తగా బహిరంగ ప్రదేశాలలో నిఘా పెంచారని పేర్కొంది. ఏవైనా భద్రతా ఏర్పాట్లు ఉంటే DGP ఆఫీసు నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపింది.

News May 7, 2025

పాక్‌తో యుద్ధానికి అనుకూలంగా లేము: సిద్దరామయ్య

image

పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పాక్‌తో యుద్ధానికి అనుకూలంగా లేమని కర్ణాటక CM సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ దాడికి భద్రతా వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. కేంద్రం కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. CM వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయనకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదని ఆ రాష్ట్ర LOP అశోక విమర్శించారు.

News May 7, 2025

9,970 పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా?

image

అన్ని రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 11 వరకు అప్లై చేసుకునే వీలుంది. పదోతరగతితో పాటు ITI చేసుండాలి. లేదంటే సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన వాళ్లు అర్హులు. 18-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రారంభ వేతనం నెలకు రూ.19,900 ఉంటుంది. రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>క్లిక్<<>> చేయండి.

News May 7, 2025

కైలాస్ మానసరోవర్ యాత్రపై అధికారిక ప్రకటన

image

కైలాస్ మానసరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్- ఆగస్టు మధ్య ఉంటుందని కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 50 మంది యాత్రికుల చొప్పున 5, 10 బ్యాచులు ఉంటాయని తెలిపారు. ఉత్తరాఖండ్ లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథులా పాస్ మీదుగా యాత్ర సాగుతుంది. Kmy.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గానే ఉంటుందని పేర్కొంది. కరోనా తర్వాత ఇదే తొలి కైలాస్ మానసరోవర్ యాత్ర.

News May 7, 2025

CSK నా వల్లే ఫెయిలైంది: కోచ్ ఫ్లెమింగ్

image

IPL 2025లో చెన్నై వైఫల్యాలకు మొదటి బాధ్యుడిని తానే అని కోచ్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు. వేలం సమయంలో జట్టు చాలా బలంగా ఉందని.. ఇప్పటికీ అదే భావన కలుగుతోందన్నారు. కానీ గాయాలు, కొందరు ప్లేయర్ల ఫామ్ లేమి జట్టును దెబ్బ తీసిందన్నారు. సక్సెస్ కోసం చాలానే ప్రయోగాలు చేసినా.. ఏదీ వర్కౌట్ కాలేదన్నారు. ఆత్మపరిశీలన చేసుకుంటే ఈ వైఫల్యాలకు మొదటి బాధ్యుడిని తానే అని వ్యాఖ్యానించారు.

News May 7, 2025

నేను భారత కోడలిని.. నన్ను పంపించకండి: సీమా హైదర్

image

తనను పాకిస్థాన్ పంపించొద్దని సీమా హైదర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఆమె 2023లో ఓ భారతీయుడితో ప్రేమలో పడి భారత్‌కు వచ్చి అతడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘నేను పాక్‌కు తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. ప్రధాని మోదీ, సీఎం యోగికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు పాక్ కూతుర్నే అయినా నేడు మాత్రం భారత కోడలిని. నన్ను ఇండియాలోనే ఉండనివ్వండి’ అని ఆమె కోరారు.