India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఉండే పూజా గది ఈశాన్యంలో ఉండడం శుభదాయకం. దేవుడి విగ్రహాలను తూర్పు దిశలో అమర్చాలి. అంటే ఆ విగ్రహాలు పశ్చిమ దిశను చూస్తున్నట్లుగా ఉండాలి. ఇలా ఉంచడం వల్ల మనం పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చుంటాము. ఇది ఏకాగ్రతను పెంచి ఇంట్లో ప్రశాంతతను, సానుకూల శక్తిని చేకూరుస్తుంది. ఈ దిశల అమరిక వల్ల దైవ స్వరూపాల నుంచి వచ్చే శక్తి ఇల్లంతా ప్రసరించి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది.

అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరిలోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. డెరివేటివ్లపై సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ భారీ పెంపుతో భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ఛాన్సుంది. 2025లో FPIలు రూ.1.66 లక్షల కోట్ల(18.9 బి.డాలర్లు) పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

T20 వరల్డ్కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే టోర్నీకి కమిన్స్ దూరమవ్వగా, తాజాగా ఆ జట్టు కీలక బౌలర్ హేజిల్వుడ్ కొన్ని మ్యాచులకు దూరంకానున్నారు. కాలి మడమ నొప్పి గాయం నుంచి కోలుకుంటున్న హేజిల్వుడ్ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దీంతో అతడి స్థానంలో రిజర్వ్ పేసర్గా సీన్ అబాట్కు అవకాశం కల్పించారు.

ఒకటిన్నర ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన గద్దె వెంకటరత్నం. ఆరేళ్ల నుంచి తనకు ఉన్న ఎకరన్నర విస్తీర్ణంలో 70 సెంట్లలో వరి, 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతో వరి పొలం చుట్టూ కందకం తవ్వి 4 రకాల చేపలను పెంచుతున్నారు. 6 మీటర్ల వెడల్పు గట్టుపై 700 అరటి, 80 కొబ్బరి చెట్లతో పాటు 50 రకాల పండ్లు, కూరగాయల రకాలను పెంచుతూ ఏడాదంతా ఆదాయం పొందుతున్నారు.

గోవా షిప్యార్డ్ లిమిటెడ్(<

ప్రథమ పూజలందుకునే వినాయకుడు ఎప్పుడూ మధ్యలో ఉండాలి. ఆయనకు కుడివైపున కులదేవతలు, హనుమంతుడు, కుమారస్వామి దేవుళ్ల విగ్రహాలను అమర్చాలి. అమ్మవార్ల విగ్రహాలను ఎడమవైపున ఉంచాలి. సీతారాములు , లక్ష్మీనారాయణుల వంటి జంట పటాలలో అమ్మవారు స్వామికి ఎడమవైపున ఉంటే, అప్పుడు స్వామివారే ప్రధానం కాబట్టి ఆ పటాలను వినాయకుడికి కుడివైపునే ఉంచాలి. ఎడమవైపున అమ్మవారు స్వామికి సహాయకారిగా ఉంటారని శాస్త్రం చెబుతోంది.

TG: త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో TGPSC కీలక ప్రకటన చేసింది. కమిషన్లో నమోదైన 31.56 లక్షల మంది తప్పనిసరిగా తమ OTR (వన్టైమ్ రిజిస్ట్రేషన్) వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది. వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, తాజా ఫొటో, సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. అప్డేట్ చేయకపోతే భవిష్యత్ నియామకాలకు దరఖాస్తు చేసుకోలేరని హెచ్చరించింది.

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు FEB 26- MAR 2 వరకు జరగనున్నాయి. FEB 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, FEB 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, 28న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, మార్చి 1, 2న మలయప్పస్వామి పుష్కరణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. FEB 26, 27న సహస్రదీపాలంకార సేవ, FEB 28, MAR 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.

పూజ గదిలో నిలబడి ఉన్న లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడి విగ్రహాలు, ఉగ్ర రూప మూర్తులు ఉంచకూడదు. అలా ఉంటే సంపద నిలవదని అంటారు. ఎత్తుగా ఉండే విగ్రహాలు కూడా అరిష్టమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పెద్ద విగ్రహాల ఆకర్షణ శక్తిని ఇల్లు భరించలేదు కాబట్టి వాటిని గుడికే పరిమితం చేయాలంటున్నారు. మరణించిన వారి ఫొటోలు సైతం పూజా మందిరంలో పెట్టకూడదట. తద్వారా దైవాగ్రహానికి గురై శాంతి, ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
Sorry, no posts matched your criteria.