India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TVK చీఫ్ విజయ్, సంగీత విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి లాయర్ల సమక్షంలో ఇటీవల చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలోనే కోర్టులో విచారణ జరగనుంది. సెటిల్మెంట్ కింద రూ.250 కోట్లు కావాలని సంగీత కోరగా రూ.35 కోట్లను విజయ్ ప్రతిపాదించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని ఆయన చెప్పినట్లు పేర్కొంటున్నాయి.

TG: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్లో 43.1, మహబూబ్నగర్ 42.4, మెదక్ 42, రామగుండం 41.5, హకీంపేట్ 41.1, దుండిగల్ 40.3, భద్రాచలం 40.4, HYD 40.4, నల్గొండ 40, ఖమ్మంలో 40 డిగ్రీలుగా రికార్డయినట్లు వెల్లడించింది.

మలయాళ మూవీ ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 17 రోజుల్లోనే రూ.200+ కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్కూల్లో అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రాళ్లు జీవితంలో ఎలా సెటిలయ్యారనేదే కథ. ఈ సినిమా తెలుగులో వాలా-2 పేరుతో ఈ నెల 24న రిలీజవనుంది. రేపు ట్రైలర్ విడుదల కానుంది.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ HYDలోని లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.

ఐపీఎల్-2026లో SRH బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచుల్లో వరుసగా 31(22), 52(35), 62(41), 39(33), 40(26), 59(39) పరుగులు చేశారు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో తొలి స్థానంలో(283) కొనసాగుతున్నారు. జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడల్లా ఆచితూచి ఆడుతూ, లూజ్ బాల్స్ను బౌండరీకి తరలిస్తూ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలా నిలుస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ్టి 2 ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. నిన్న సర్జరీ చేయించుకున్న Dy.CM పవన్ వేగంగా కోలుకోవాలని YCP చీఫ్ జగన్ ట్వీట్ చేయగా, పవన్ థాంక్స్ చెప్పారు. ఇక జగన్ తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. నిత్యం రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా పోట్లాడుకునే నేతలు హుందాతనం చూపడం రాజకీయాల విలువలను పెంచుతాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG-2026) సబ్జెక్ట్ కరెక్షన్ విండో నేటితో ముగియనుంది. CUET, <

T2OI కెప్టెన్గా సూర్యను తొలగించాలనుకుంటే సెలక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యరే అని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. IPLలో శ్రేయస్ నాయకత్వం పట్ల సానుకూలతతోపాటు T20 క్రికెట్లో నాలుగో స్థానంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ మరొకరు లేరని పేర్కొంది. పంత్, గిల్ పోటీలో ఉన్నప్పటికీ అయ్యర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు రాసుకొచ్చింది. సూర్యకు కెప్టెన్గా మంచి మార్కులు ఉన్నా ఆటగాడిగా ఫెయిలవుతున్నారు.

AP CM చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. NDA అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే CBN ప్రచారం సాగనుంది. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. TNలో ఏప్రిల్ 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

AP: తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న <<19688324>>PM మోదీకి<<>> Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘నాతో మాట్లాడేందుకు సమయం కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన విషెస్, మీరిచ్చే ప్రోత్సాహం నాకు గొప్ప బలాన్నిస్తాయి. మీ మద్దతు, మార్గదర్శకత్వానికి కృతజ్ఞుడినై ఉంటా’ అని పవన్ ట్వీట్ చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలని CM CBN, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్, KTR తదితరులు Xలో పోస్టులు పెట్టారు.
Sorry, no posts matched your criteria.