news

News April 12, 2025

విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి

image

AP: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. రాజుదేవా, రాజుజయ, యశ్వంత్ నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులో ఉన్న కుంటలో పడ్డట్లు తెలుస్తోంది. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కుంటలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.

News April 12, 2025

IPL: ఈరోజు డబుల్ బొనాంజా

image

ఈరోజు వీకెండ్ కావడంతో ఐపీఎల్‌లో రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు లక్నోలో LSG vs GT.. రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లో SRH, PBKS తలపడనున్నాయి. సీజన్ మధ్య దశలోకి వస్తుండటంతో అన్ని జట్లూ విజయం కోసం ఆశగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు మ్యాచులూ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచుల్లో ఎవరు గెలవొచ్చు? కామెంట్ చేయండి.

News April 12, 2025

సంచలన తీర్పు: కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష

image

TG: సొంత కూతుర్ని హత్య చేసిన తల్లికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మోతే మండలంలోని మేకపాటి తండాకు చెందిన ఓ మహిళ, మానసిక స్థితి సరిగ్గా లేదన్న కారణంతో తన కుమార్తెను హత్య చేసింది. 2021లో ఇది జరగ్గా అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. ఎట్టకేలకు నిన్న జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.

News April 12, 2025

హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్‌పై కీలక నిర్ణయం

image

AP: గత ప్రభుత్వం ప్రారంభించిన 294 హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్‌ను ఈ ఏడాదీ కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో పనిచేసే టీచర్లకు అక్కడే కొనసాగేలా లేదా బదిలీ కోరుకునేలా అవకాశం కల్పించింది. మరో 210 చోట్ల ఇంటర్ విద్యను తిరిగి ఇంటర్మీడియట్ శాఖకు అప్పగించనుంది. అందులోని టీచర్లను వెనక్కు తీసుకుని ఇతర స్కూళ్లలో నియమించనుంది. అలాగే 900 హైస్కూళ్లలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు త్వరలో అనుమతులు ఇవ్వనుంది.

News April 12, 2025

దక్షిణాఫ్రికా ఆటగాడిపై PSLలో నిషేధం

image

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బోష్‌పై పాకిస్థాన్ సూపర్ లీగ్ నిషేధం విధించింది. ఈ ఏడాది టోర్నీ కోసం పెషావర్ జల్మీ జట్టు అతడిని కొనుగోలు చేసింది. అయితే ముంబై ఇండియన్స్ ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో అతడి రీప్లేస్‌మెంట్‌గా కార్బిన్‌ను MI తీసుకుంది. ఈ నేపథ్యంలో PSL నుంచి కార్బిన్ వైదొలిగారు. దీంతో వచ్చే ఏడాదికి కార్బిన్‌ను నిషేధిస్తున్నట్లు PSL యాజమాన్యం ప్రకటించింది.

News April 12, 2025

రొయ్యల మేత ధర కిలోకు రూ.4 తగ్గింపు

image

AP: పెరిగిన ఖర్చులు, ఎగుమతి కౌంట్ రేట్లు తగ్గిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు ₹4 చొప్పున ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. <<16027501>>సీఎం చంద్రబాబు<<>> ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నేటి నుంచి అమలు చేస్తామని వెల్లడించాయి. అయితే కిలోకు ₹20-25 తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా రొయ్యల ధరలను తగ్గించొద్దని వ్యాపారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

News April 12, 2025

ALERT: వడగాలులు బాబోయ్!

image

AP: రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ వడగాలుల తీవ్రత మాత్రం పరాకాష్ఠకు చేరింది. మధ్యాహ్నవేళల్లో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఆ తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు 66 మండలాల్లో వడగాడ్పులు వీయొచ్చని తెలిపింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృ‌ష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News April 12, 2025

టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?

image

TG: TPCCకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. BC సామాజిక వర్గ నేత మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశాన్ని కల్పించే దిశగా కాంగ్రెస్ చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పీసీసీని పూర్తిస్థాయిలో విస్తరించొచ్చని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.

News April 12, 2025

గూగుల్‌లో భారీగా కొలువుల కోత

image

గూగుల్ మరోసారి కొలువుల తొలగింపు ప్రారంభించింది. వందలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. ప్రధానంగా ఆండ్రాయిడ్, పిక్సెల్ ఫోన్, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే టెకీలపై వేటు వేసింది. చివరిగా 2023లోనూ 12వేలమందిని ఆ సంస్థ తొలగించిన సంగతి తెలిసిందే. ఆంక్షల యుద్ధాల నడుమ ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో గూగుల్ బాటలోనే మరిన్ని సంస్థలు కొలువుల కోత బాట పట్టొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News April 12, 2025

ఈ నెలలో భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు?

image

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24 మధ్య భారత్‌కు సతీసమేతంగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్ కూడా భారత్‌లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానితో భేటీ అనంతరం వాన్స్ తన భార్యతో కలిసి జైపూర్, ఆగ్రా పర్యటిస్తారని సమాచారం. ఆయన భార్య ఉష భారత సంతతి మహిళ కావడం విశేషం.