India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ ఏడాది ఉద్యోగుల జీతాల పెంపు ఆలస్యం అవ్వొచ్చని TCS హింట్ ఇచ్చింది. ‘పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. జీతాల పెంపుపై ఈ ఏడాదిలో నిర్ణయం తీసుకుంటాం. వ్యాపారాన్ని బట్టి అది ఎప్పుడైనా ఉండొచ్చు’ అని చీఫ్ HR మిలింద్ తెలిపారు. 2025 JAN-MARలో TCS కేవలం 625 మంది ఉద్యోగులను మాత్రమే చేర్చుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఫ్రెషర్ల నియామకాలు అంతే లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని చెప్పారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘HIT-ది థర్డ్ కేస్’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మే 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ అంచనాలను పెంచేసింది.

చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు 145 శాతానికి పెరిగాయి. బుధవారం చైనా వస్తువులపై 125% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అప్పటివరకు చైనా దిగుమతులపై అమెరికా 20% టారిఫ్ విధిస్తోంది. దీంతో ఆ రెండు కలిపి అది 145 శాతానికి పెరిగింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు 70 దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఏఐ అసిస్టెడ్ IVF విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించింది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్లో నిపుణుల సమక్షంలో ఓ 40 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చారు. అండంలోకి స్పెర్మ్ను నేరుగా ఇంజెక్ట్ చేసే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI)కు బదులు ఆటోమేటెడ్ IVF సిస్టమ్ను ఉపయోగించారు. దీని ద్వారా ICSI ప్రక్రియలోని 23 దశలు మనిషి సాయం లేకుండానే పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు 9min 56sec సమయం పట్టింది.

AP: రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంతముఖ్యమో ఆ పెట్టుబడులు క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చడమూ అంతే ముఖ్యమని CM చంద్రబాబు అన్నారు. ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే ఆ సంస్థ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందనే తేదీపై స్పష్టత తీసుకోవాలని అధికారులకు సూచించారు. SIPB సమావేశంలో 17 సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటితో ₹31,167cr పెట్టుబడులు, 32,633 ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు.

పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ ఉన్నా ప్రభాస్ యాడ్స్లో కనిపించేది చాలా తక్కువే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బాహుబలికి ఓ బ్రాండ్ యాడ్లో నటించాలని ఆఫర్ వచ్చిందట. 3 రోజులు కేటాయిస్తే రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేయగా ప్రభాస్ సింపుల్గా నో చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రాలతో డార్లింగ్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది.

AP: మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల సాకారం కానుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. చినకాకాని వద్ద వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఈ నెల 13న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్గా, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పేర్కొన్నారు.

ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాను ఇండియాకు తీసుకొచ్చిన అనంతరం ఫస్ట్ ఫొటో బయటకు వచ్చింది. అయితే అందులో రాణా ముఖం కనిపించట్లేదు. NIA అధికారులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం అమెరికా నుంచి రాణాను తీసుకొచ్చిన ఎయిర్ఫోర్స్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్లో 1,000 బౌండరీలు బాదిన తొలి ప్లేయర్గా నిలిచారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులో మూడు బౌండరీలు బాదడంతో ఈ ఘనత అందుకున్నారు. మొత్తంగా IPLలో 280 సిక్సర్లు, 721 ఫోర్లు బాదారు. తర్వాతి స్థానాల్లో ధవన్(920), వార్నర్(899), రోహిత్(885), గేల్(761) ఉన్నారు.

AP: నర్సింగ్కు 2025-26 విద్యాసంవత్సరం నుంచే కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఇది మొదటిసారని, నర్సింగ్ విద్యలో రాజీపడబోమని చెప్పారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ నుంచి కాకుండా జులై నుంచే ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్య నాణ్యతపై అలసత్వాన్ని సహించబోమని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.