India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

PBKS ప్లేయర్ చాహల్కు మద్దతుగా అతని రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ RJ మహ్వాష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘కష్టసుఖాల్లో మన వాళ్ల కోసం ఓ బండరాయిలా ఉండి అండగా నిలవాలి. చాహల్ నీకోసం మేమందరం ఉన్నాం’ అంటూ నిన్న మ్యాచ్ అనంతరం ఆయనతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు. దానికి చాహల్ స్పందిస్తూ.. ‘మీరే నా వెన్నెముక! నన్ను ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు’ అని లవ్ సింబల్తో కామెంట్ చేశారు.

iPhone17 సిరీస్ మొబైల్స్ సెప్టెంబర్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కొత్త ఫీచర్లు, డిజైన్లో మార్పులతో సరికొత్తగా ఉండనున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. iPhone 17Proలో ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో ఒకే సమయంలో వీడియో రికార్డ్ చేయగలిగే ఫీచర్ రాబోతోందంటున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా దీనిపై SMలో చర్చ జరుగుతోంది. INDలో iPhone17 ప్రారంభ ధర ₹79,900, iPhone 17Pro ₹1,44,900గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

కీరదోస తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, నీటితో సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్కు గురి కాకుండా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ను క్రమబద్ధీకరిస్తుంది. గట్ హెల్త్ను మెరుగుపరుస్తుంది.

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ EOగా పని చేసిన మహేశ్వరయ్య ఆస్తులు చూసి ACB అధికారులే షాక్ అయ్యారు. గత FEBలో అతడు రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తాజాగా తిరుపతి పేరూరులోని మహేశ్వరయ్య ఇంట్లో ACB సోదాలు జరిపింది. బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన అపార్ట్మెంట్, పలమనేరులో 3 అంతస్తుల ఇల్లు, ఫాంహౌస్, బద్వేలులో భూములు, బంగారం ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

తన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్ వచ్చిందంటూ హిమాచల్ ప్రభుత్వంపై హీరోయిన్, BJP MP కంగనా రనౌత్ మండిపడ్డారు. ‘మనాలిలో ఉన్న నా ఇంటికి ఈ నెలలో రూ.లక్ష కరెంట్ బిల్ వచ్చింది. అసలు నేను ఆ ఇంట్లోనే ఉండటం లేదు. అలాంటప్పుడు ఇంత బిల్ ఎలా వస్తుంది? ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ సర్కార్ సిగ్గుపడాలి. దీనిపై అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలి’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఐపీఎల్ 2025లో SRH విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ తేలిపోతున్నారు. గత సీజన్లో అత్యధికంగా 42 సిక్సర్లు బాది టాప్లో నిలిచారు. కానీ ఈ సీజన్లో 5 మ్యాచులాడి ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. పవర్ ప్లేలోనే ఆయన పెవిలియన్ బాట పడుతున్నారు. RR-24, LSG-6, DC-1, KKR-2, GTపై 18 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచారు. తర్వాతి మ్యాచుల్లోనైనా అభిషేక్ విజృంభించి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

UPI పేమెంట్ల పరిమితిని పెంచేందుకు NPCIకి RBI అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం P2M(వ్యక్తి నుంచి వ్యాపారికి) పంపే లావాదేవీ పరిమితి ₹2లక్షల వరకే ఉంది. తాజాగా RBI అనుమతితో ₹5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. P2P లావాదేవీలను మార్చకుండా, P2M లిమిట్ మాత్రమే పెంచే ఛాన్సుంది. బ్యాంకులతో చర్చల తర్వాత NPCI దీనిపై ప్రకటన చేయనుంది. కాగా ఎడ్యుకేషన్, బీమా, హెల్త్ కేర్ రంగాలకు చేసే UPI పేమెంట్ లిమిట్ ₹5లక్షల వరకూ ఉంది.

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 17న ఈ చిత్రం విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ‘కన్నప్ప’ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఆయనను కలిసిన వారిలో మంచు విష్ణుతో పాటు డాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఉన్నారు.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్టును పాస్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులతో అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, యూఎస్ కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.