news

News April 8, 2025

ప్రియాంశ్ దూకుడు.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ

image

IPL: చెన్నైతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య అదరగొడుతున్నారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 19 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 6 ఓవర్లలో 75/3గా ఉంది. ప్రభ్‌సిమ్రాన్ (0), శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4) ఔటయ్యారు.

News April 8, 2025

కెనడాలో ఉండేవారికి శుభవార్త.. కనీస వేతనం పెంపు

image

కెనడా ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రైవేట్ సెక్టార్‌లో కనీస వేతనాలను పెంచింది. ప్రస్తుతం గంటకు కనీస వేతనం 17.30 డాలర్లు ఉండగా దాన్ని 17.75 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల్లో ద్రవ్యోల్బణం అంశమే కీలక అజెండాగా మారింది. కెనడా జనాభాలో 3.7% ఉన్న భారతీయులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది.

News April 8, 2025

రేపు ఎన్టీఆర్-నీల్ సినిమా అప్‌డేట్

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా నుంచి రేపు కొత్త అప్‌డేట్ రానుంది. రేపు మ.12.06 గంటలకు ప్రకటన ఉంటుందని మేకర్స్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

News April 8, 2025

సీఎం ఛైర్మన్‌గా జలహారతి కార్పొరేషన్

image

AP: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైస్ ఛైర్మన్‌గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఈఓగా జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఉండనున్నారు. పోలవరం వరద నీరు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్లకు పైగా ఖర్చవుతుండగా, 3లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయని ప్రభుత్వ అంచనా.

News April 8, 2025

థ్రిల్లింగ్ మ్యాచ్: KKRపై LSG విజయం

image

కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో లక్నో విజయం సాధించింది. 239 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ 234 పరుగులు చేసింది. దీంతో LSG 4 పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్‌లో రహానే (61), వెంకటేశ్ (45) రాణించారు. చివర్లో రింకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

News April 8, 2025

సింగపూర్ వెళ్తున్నా: పవన్

image

తాను ఈ రాత్రి 9.30 గం.కు సింగపూర్ వెళ్లబోతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయనతో పాటు చిరంజీవి దంపతులూ అక్కడికి వెళ్లనున్నారు. ‘నేను అరకులో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది. నా కొడుకు పక్కనే కూర్చున్న పాపకు తీవ్రగాయాలయ్యాయి. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మిగతా అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు. కాగా ఈ ప్రమాద సమయంలో ఆ భవంతిలో 30 మంది పిల్లలు ఉండగా, ఓ చిన్నారి మరణించింది.

News April 8, 2025

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

image

ఐపీఎల్‌లో భాగంగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
CSK: రుతురాజ్(C), కాన్వే, రచిన్, విజయ్, జడేజా, ధోని, అశ్విన్, నూర్, ముకేశ్, ఖలీల్, పతిరణ.
PBKS: ఆర్య, ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్(C), స్టొయినిస్, వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్, జాన్సెన్, అర్ష్‌దీప్, ఫెర్గూసన్, చాహల్.

News April 8, 2025

త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్

image

వాట్సాప్ ప్లాట్‌ఫామ్ త్వరలోనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో చాటింగ్, షేర్ చేసిన వీడియోస్, ఫోటోలు రిసీవర్ సేవ్ చేసుకునే అవకాశం లేకుండా కొత్త ఫీచర్ డెవలప్ చేస్తుంది. దీంతో మన వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అయితే స్క్రీన్‌ రికార్డింగ్, స్క్రీన్‌షాట్‌ల ద్వారా సేవ్ చేసే విషయం‌పై స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం IOSయూజర్స్ కోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు.

News April 8, 2025

గెజిట్ జారీ.. అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం

image

వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయింది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో అవి విచారణకు రానున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం, డీఎంకే తదితర పార్టీలు ఈ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

News April 8, 2025

పూరన్ దెబ్బకు సెహ్వాగ్ రికార్డు బద్దలు

image

KKRతో మ్యాచులో LSG విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ (36 బంతుల్లోనే 87 ) ఊచకోత కోశారు. ఈ క్రమంలో పూరన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. 1,198 బంతుల్లోనే ఆయన 2 వేల పరుగులు మార్కును అందుకున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ (1,211 బంతుల్లో) రికార్డును చెరిపేశారు. అగ్ర స్థానంలో రస్సెల్ (1,120 బంతుల్లో) ఉన్నారు.