India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హోమ్లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల ఆర్బీఐ రెపోరేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. దానిని అనుసరిస్తూ SBI వడ్డీ రేట్లను సవరించింది. ఇవి రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారితో పాటు ఇప్పటికే తీసుకున్న వారికీ ఈ రేట్లు వర్తిస్తాయి. కాగా HDFC, BOI బ్యాంకులు ఇంతకుముందే వడ్డీ రేట్లను తగ్గించాయి.
పంజాబ్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు కీలక బౌలర్ అయిన లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి వైదొలగినట్లు PBKS ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ తెలిపారు. ‘లాకీ సేవలు ప్రస్తుతానికి మాకు లేనట్లే. టోర్నీ ముగిసేలోపుగా అతడు రికవర్ అయి మళ్లీ బౌలింగ్ చేయడం కష్టమే. పెద్ద గాయమే అయిందని అనుకుంటున్నాం’ అని తెలిపారు. SRHతో మ్యాచ్ సందర్భంగా లాకీ గాయంతో మైదానం వీడిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు పబ్లిక్ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇవాళ PM మోదీ మాట్లాడుతూ ‘టెండర్లలో కాంగ్రెస్ మతాల వారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ SC, ST, OBCల హక్కుల్ని కాలరాస్తోంది’ అని దుయ్యబట్టారు. దీనిపై ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య స్పందిస్తూ ‘ఇందులో తప్పేముంది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డ వారికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
AP: రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఈ సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.
AP: అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద పెదలంక, చినలంకలో భూములను మంత్రి నారాయణ, MLAలు, కలెక్టర్ పరిశీలించారు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఈ స్పోర్ట్స్ సిటీ ఉండాలని CM చెప్పారని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 2 వేల ఎకరాల అవసరం ఉంటుందని, లంక భూముల్లో సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు.
తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఐపీఎల్లో CSK జట్టు తరఫున ఈరోజు అరంగేట్రం చేస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఈ యువ ఓపెనింగ్ బ్యాటర్ 2022లో భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. సెమీస్, ఫైనల్లో రాణించి జట్టుకు కప్ అందించాడు. CSK గత ఏడాదే కొనుగోలు చేసినా అతడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. ఈరోజు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రషీద్ రాణించాలని తెలుగు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
IPL: చెన్నై ఈ ఏడాది చెత్త ప్రదర్శనతో వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా గత మ్యాచ్లో ఫలితం మారలేదు. అయినా SMలో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. లక్నోలో ఇవాళ LSG, CSK మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియా బజ్పై స్టార్ స్పోర్ట్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో 84% చెన్నైకి, 16% లక్నోకు సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. ఇవాళ గెలుపుపై చెన్నై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఐపీఎల్లో భాగంగా ఈరోజు లక్నోలో CSKతో LSG తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఈ మ్యాచ్లో CSK కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తెలుగు ప్లేయర్ రషీద్ CSKలో ఈరోజు ఆడనున్నారు.
CSK: రచిన్, రషీద్, త్రిపాఠీ, విజయ్ శంకర్, ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్, కాంబోజ్, ఖలీల్, పతిరణ
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, దిగ్వేశ్, ఆవేశ్
ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు 25% ఎంప్లాయీస్ను తొలగిస్తోందని ‘బిజినెస్ స్టాండర్డ్స్’ తెలిపింది. వార్షిక వేతనం రూ.కోటికిపైన ఉన్నవారిని రాజీనామా చేయాలని, 50-55 ఏళ్ల పైన ఉన్న సీనియర్ ఎంప్లాయీస్ని VRS తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది. మేజర్గా R&D ఉద్యోగులపైనే ఫోకస్ చేసినట్లు సమాచారం. దీనిపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ దక్కించుకుంది. ట్రైలర్ గ్రిప్పింగ్గా ఉండటం, చాలాకాలం తర్వాత విజయశాంతి ఫైట్లు చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 144 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ ఈ నెల 18న విడుదల కానుంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Sorry, no posts matched your criteria.